అన్వేషించండి

IPL 2021: దేవుడిచ్చిన ప్రతిభను వృథా చేస్తున్నాడు: సంజు శాంసన్‌పై సన్నీ ఆగ్రహం

సంజు శాంసన్‌ దేవుడిచ్చిన ప్రతిభను వృథా చేస్తున్నాడని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీజులోకి రాగానే సిక్సర్లు బాదేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు.

యువ ఆటగాడు సంజు శాంసన్‌ దేవుడిచ్చిన ప్రతిభను వృథా చేస్తున్నాడని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రీజులోకి రాగానే సిక్సర్లు బాదేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉంటే తప్ప అలా చేయలేరని, అంతర్జాతీయ క్రికెట్లోనూ అతడిలాగే అవకాశాలు వృథా చేసుకున్నాడని వెల్లడించాడు. రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచులో అతడి ప్రదర్శనపై సన్నీ మాట్లాడాడు.

Also Read: IPL 2021: ఓ వైపు బాలీవుడ్‌ మెలొడీ.. మరో వైపు రోహిత్‌, సూర్య, పొలార్డ్‌ బ్యాటింగ్‌లో ఢీ.. ఆనందంలో అభిమానులు!

'సంజు విఫలమవ్వడానికి కారణం అతడి షాట్ల ఎంపికే. అంతర్జాతీయ మ్యాచుల్లోనూ అతడంతే. పైగా అతడేమీ ఓపెనింగ్‌ చేయడు. రెండు, మూడో డౌన్లో వస్తుంటాడు. రాగానే మొదటి బంతినే సిక్సర్‌గా బాదాలనుకుంటాడు. అది సాధ్యం కాదు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నవారూ అలా కొట్టలేరు. క్రీజులో నిలబడేందుకు, పరిస్థితులు అర్థం చేసుకొనేందుకు సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తుండాలి. అప్పుడే ఫుట్‌వర్క్‌ కాస్త మెరుగవుతుంది' అని గావస్కర్‌ అన్నాడు.

Also Read: IPL 2021: రిషభ్‌ పంత్‌.. ఆధునిక క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్‌! సందేహం లేదన్న మంజ్రేకర్‌

'శాంసన్‌ ఇవన్నీ చూసుకోవాలి. లేదంటే దేవుడిచ్చిన ప్రతిభ వృథా అవుతుంది. టెంపర్‌మెంట్‌ నుంచి షాట్ల ఎంపిక వరకు అతడు మెరుగవ్వాలి. ఇవే కదా కుర్రాళ్లను, సీనియర్లను వేరు చేసేది. పైగా అతడు టీమ్‌ఇండియాకు క్రమం తప్పకుండా ఆడాలంటే షాట్‌ సెలక్షన్‌ మరింత మెరుగు పర్చుకోవాలి' అని సన్నీ పేర్కొన్నాడు.

Also Read: MI vs KKR Match Preview: హిట్‌ మ్యాన్‌ వచ్చేస్తాడా? ముంబయిని చూస్తే కోల్‌కతాకు వణుకే.. ఈసారైన మారేనా!

ఐపీఎల్‌ రెండో దశలో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచులో రాజస్థాన్‌ ఉత్కంఠర విజయం అందుకుంది. 185 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, నికోలస్‌ పూరన్‌ చెలరేగి ఆడినా.. ఆఖరి ఓవర్లో వారిని అడ్డుకొని విజయం అందుకుంది. కాగా ఈ మ్యాచులో సంజు కేవలం 4 పరుగులే చేశాడు. భారీ సిక్సర్లు బాదుతూ సెంచరీలు కొట్టగల అతడు షాట్ల ఎంపికలో లోపాలతో నిలకడ సాధించడం లేదు. దీనిపైనే సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా తర్వాతి పోరుకోసం రాజస్థాన్‌ సాధన చేస్తోంది. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లుకు అన్యాయం జరుగుతోందా.. వాస్తవాలేంటి..!?
బాదుడే బాదుడు.. అమ్మాయిలూ మీరు సూపర్!
India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
దేశం గర్వించేలా చేసిన అమ్మాయిలు.. టీమిండియా విజయంపై ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
KTR on Hydra Demolitions: ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి కూల్చేశాడు - హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్
Jodhpur Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
జోధ్‌పూర్‌లో లారీని ఢీకొట్టిన టెంపో.. 15 మంది మృతితో తీవ్ర విషాదం.. సీఎం భజన్‌లాల్ దిగ్భ్రాంతి
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Rashmika Mandanna: శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
శారీలో గర్ల్ ఫ్రెండ్... సారీ సారీ నేషనల్ క్రష్ రష్మిక
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘శివాజీ’, పవన్ కళ్యాణ్ ‘బద్రి’ TO రాజశేఖర్ ‘మా అన్నయ్య బంగారం’, రామ్ ‘రెడీ’ వరకు- ఈ సోమవారం (నవంబర్ 03) టీవీలలో వచ్చే సినిమాలివే
Embed widget