అన్వేషించండి

India vs England ODI: చిన్నారికి తగిలిన రోహిత్‌ సిక్సర్‌! వెక్కి వెక్కి ఏడవడంతో ఆట నిలిపివేత!

India vs England: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం అందుకుంది. రోహిత్ శర్మ బాదిన సిక్సర్‌ ఓ చిన్నారికి తగలడంతో ఆటను కాసేపు నిలిపివేశారు.

India vs England ODI: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం అందుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉతికారేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)  తిరుగులేని ఫామ్‌ కనబరిచాడు. చాన్నాళ్ల తర్వాత  సింహగర్జన చేశాడు. తనకిష్టమైన పుల్‌షాట్లతో ప్రత్యర్థిని వణికించాడు. అయితే అతడు కొట్టిన సిక్సర్‌ ఓ చిన్నారికి తగలడంతో ఆటను కాసేపు నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో వెంటనే మొదలు పెట్టారు.

టీమ్‌ఇండియా ఇన్నింగ్సు ఐదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డేవిడ్‌ విలే వేసిన బంతిని రోహిత్‌ శర్మ తనకిష్టమైన పుల్‌షాట్‌ ఆడేశాడు. బ్యాటు మధ్యలో తగిలిన బంతి ఫైన్‌లెగ్‌లో నేరుగా జనాల మధ్యన పడింది. అంపైర్‌ వెంటనే సిక్సర్‌గా ప్రకటించాడు. కెమేరాను అటు వైపు మళ్లించడంతో ఓ వ్యక్తి చిన్నారిని సముదాయిస్తూ కనిపించాడు. ఆమె భుజాలు, మెడను రుద్దాడు. బహుశా బంతి అక్కడే తగిలినట్టుంది.

విషయం తెలియడంతో క్రికెటర్లంతా ఒక్కసారిగా అటువైపే దృష్టి సారించారు. అంతా సవ్యంగా ఉందో లేదో కనుక్కున్నారు. కామెంటరీ చేస్తున్న రవిశాస్త్రి, ఆర్థర్‌టన్‌ సైతం బంతి ఎవరినో తాకినట్టుందని ధ్రువీకరించారు. 'చూస్తుంటే రోహిత్‌ శర్మ బాదిన సిక్సర్‌ ఎవరినో తాకినట్టుంది. బహుశా ఏం కాలేదనే అనుకుంటున్నా' అని ఆర్థర్‌టన్‌ అన్నాడు. 'అవును, అలాగే అనిపిస్తోంది. బంతి కొట్టిన వైపు రోహిత్‌ అలాగే చూస్తున్నాడంటే ఎవరినో తాకిందన్న సందేశం అతడికి అందే ఉంటుంది' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. స్టేడియం వైద్య సిబ్బంది సైతం బౌండరీ సరిహద్దులు దాటి అటు వైపు పరుగెత్తినట్టు టీవీ తెరల్లో ప్రసారమైంది.

IND vs ENG, 1st ODI, The Oval Stadium: గెలుపంటే ఇదీ! అన్నట్టుగా చెలరేగింది టీమ్‌ఇండియా. ఆంగ్లేయులకు తమ సొంతగడ్డపైనే కనీవినీ ఎరగని పరాభవం రుచిచూపించింది. మొదట జస్ప్రీత్‌ బుమ్రా (6/19), మహ్మద్‌ షమి (3/31)  దెబ్బకు ఇంగ్లాండ్‌ కేవలం 25.2 ఓవర్లకే 110 పరుగులకే కుప్పకూలింది. చరిత్రలోనే టీమ్‌ఇండియా చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (30; 32 బంతుల్లో 6x4), డేవిడ్‌ విలే (21; 26 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లంటేనే మన బౌలర్ల అటాక్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఆ తర్వాత రోహిత్‌ శర్మ (76; 58 బంతుల్లో 7x4, 5x6), శిఖర్ ధావన్‌ (31; 54 బంతుల్లో 4x4) ఇద్దరే కలిసి 10 వికెట్ల తేడాతో గెలిపించేశారు. విజయం కోసం కేవలం 18.4 ఓవర్లే తీసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
Republic Day 2025 LIVE: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్పెషల్ బలగాలతో ఢిల్లీలో భారీ బందోబస్తు
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్పెషల్ బలగాలతో ఢిల్లీలో భారీ బందోబస్తు
India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తాండవం..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
పద్మ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష - వారి పేర్లు లేకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
Republic Day 2025 LIVE: దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్పెషల్ బలగాలతో ఢిల్లీలో భారీ బందోబస్తు
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్పెషల్ బలగాలతో ఢిల్లీలో భారీ బందోబస్తు
India Thrilling Victory: తిలక్ వర్మ తడాఖా..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ.. 
తిలక్ వర్మ తాండవం..సూపర్బ్ ఫిఫ్టీతో తెలుగు ప్లేయర్ సత్తా.. రెండో టీ20లో భారత్ స్టన్నింగ్ విక్టరీ
Padma Award 2025: 2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
2025 సంవత్సరానికి 139 మందికి పద్మ అవార్డులు - 7 మందికి విభూషణ్ ప్రకటన
Padma Awards: ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
ఏఐజీ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ - మందకృష్ణ, మాడుగులకు పద్మశ్రీ - తెలుగువారికి దక్కిన గౌరవం
Ind Vs Eng 2nd T20 Updates: సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
సమష్టిగా రాణించిన బౌలర్లు, సత్తా చాటిన అక్షర్, వరుణ్.. బట్లర్ కెప్టెన్ ఇన్నింగ్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
పవన్ కల్యాణ్‌కేమీ తెలియదు - ఆయన పొలిటికల్ జోకర్ - డిప్యూటీ సీఎంను ఇంత మాట అనేశాడేంటి ?
Karimnagar News: మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
మోదీ ఫొటో, పేరు లేకుంటే బియ్యం, ఇళ్లు ఎందుకివ్వాలి? కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
Embed widget