By: ABP Desam | Updated at : 06 Feb 2023 03:21 PM (IST)
విరాట్ కోహ్లీ (ఫైల్ ఫొటో)
IND vs AUS: భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ల్లో ఇప్పటి వరకు కోహ్లీ బ్యాట్ నుంచి ఎన్నో అద్భుతమైన టెస్టు ఇన్నింగ్స్ వచ్చాయి.
అయితే ఈ ఫార్మాట్లో 2019 సంవత్సరం నుంచి ఒక్క సెంచరీ కూడా కోహ్లీ చేయలేకపోయాడు. మరోవైపు గత రెండు టెస్టుల సిరీస్లో విరాట్ కోహ్లి ఆటతీరును చూస్తుంటే, కనీసం అర్థ సెంచరీ మార్కును కూడా దాటలేకపోయినట్లు కనిపిస్తుంది
ఈ టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరగనుంది. ఈ మైదానంలో విరాట్ కోహ్లి రికార్డును మామూలుగా లేదు. కోహ్లి ఇక్కడ మూడు మ్యాచ్ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుండి రెండు సెంచరీ ఇన్నింగ్స్లు కూడా వచ్చాయి. అందులో కోహ్లీ ఒక ఇన్నింగ్స్లో 213 పరుగులు కూడా చేశాడు.
మరోవైపు టెస్టు ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ రికార్డు కూడా ఆకట్టుకుంది. కంగారూ జట్టుతో ఆడిన 20 టెస్టు మ్యాచ్ల్లో 48.06 సగటుతో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 1,682 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతని బ్యాట్ నుంచి ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు కూడా వచ్చాయి.
నాథన్ లియాన్తోనే ముప్పు
ఈ టెస్ట్ సిరీస్కు సంబంధించి ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇందులో నాథన్ లియాన్ రూపంలో జట్టులో అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లీకి లియాన్ పెద్ద ముప్పుగా మారవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటి వరకు నాథన్ లియాన్ బౌలింగ్ లోనే ఏడు సార్లు తన వికెట్ కోల్పోయాడు.
మైదానంలో కోహ్లీ ఎప్పుడూ నంబర్వన్గా ఉంటాడు. ఇప్పుడు ఫీల్డ్ బయట కూడా నంబర్ వన్ అయ్యాడు. 2022లో మోస్ట్ పాపులర్ క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతన్ని ఇన్స్టాగ్రామ్లో 230 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. క్రికెటర్లలో ప్రస్తుతానికి విరాట్ కోహ్లీకే అత్యధికంగా ఫాలోయర్లు ఉన్నారు. తన అద్భుతమైన బ్యాటింగ్ చూసి ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
విరాట్ కోహ్లీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అతని వల్లే ఆర్సీబీని కూడా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. విరాట్ కోహ్లి లాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇన్స్టాగ్రామ్లో 2022లో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ జట్టుగా నిలిచింది. కోహ్లి తన ఐపీఎల్ కెరీర్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతోనే ప్రారంభించాడు. అతను ఇప్పటికీ RCB తరఫునే ఆడటం చూడవచ్చు.
భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీతో సహా భారత జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్ 2023లోని కొన్ని మ్యాచ్లను ఆడకపోవచ్చు. ఆటగాళ్ల పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఏడాది భారత టీ20 జట్టుకు కూడా విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది విరాట్ ఇప్పటి వరకు ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు.
MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!
UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్.. హరికేన్ ఇన్నింగ్స్ - ఆఖరి లీగులో గుజరాత్కు తప్పని ఓటమి!
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?
GG vs UPW: 'దయ'తో కలిసి బాదేసిన గార్డ్నర్ - యూపీ టార్గెట్ 179
GG vs UPW: టాస్ లక్ గుజరాత్దే - తెలుగమ్మాయి ప్లేస్లో మరొకరు!
Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్