అన్వేషించండి

VIRAT KOHLI: విదర్భలో విరాట్‌కు తిరుగులేని రికార్డు - ఆ ఒక్క గండం దాటితే!

నాగ్‌పూర్‌లోని విదర్భ మైదానంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడి మైదానంలో విరాట్ డబుల్ సెంచరీ కూడా సాధించాడు.

IND vs AUS: భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఇప్పటి వరకు కోహ్లీ బ్యాట్ నుంచి ఎన్నో అద్భుతమైన టెస్టు ఇన్నింగ్స్ వచ్చాయి.

అయితే ఈ ఫార్మాట్‌లో 2019 సంవత్సరం నుంచి ఒక్క సెంచరీ కూడా కోహ్లీ చేయలేకపోయాడు. మరోవైపు గత రెండు టెస్టుల సిరీస్‌లో విరాట్ కోహ్లి ఆటతీరును చూస్తుంటే, కనీసం అర్థ సెంచరీ మార్కును కూడా దాటలేకపోయినట్లు కనిపిస్తుంది

ఈ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరగనుంది. ఈ మైదానంలో విరాట్ కోహ్లి రికార్డును మామూలుగా లేదు. కోహ్లి ఇక్కడ మూడు మ్యాచ్‌ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుండి రెండు సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా వచ్చాయి. అందులో కోహ్లీ ఒక ఇన్నింగ్స్‌లో 213 పరుగులు కూడా చేశాడు.

మరోవైపు టెస్టు ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ రికార్డు కూడా ఆకట్టుకుంది. కంగారూ జట్టుతో ఆడిన 20 టెస్టు మ్యాచ్‌ల్లో 48.06 సగటుతో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 1,682 పరుగులు చేశాడు. అదే సమయంలో, అతని బ్యాట్ నుంచి ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు కూడా వచ్చాయి.

నాథన్ లియాన్‌తోనే ముప్పు
ఈ టెస్ట్ సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇందులో నాథన్ లియాన్ రూపంలో జట్టులో అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లీకి లియాన్ పెద్ద ముప్పుగా మారవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు నాథన్ లియాన్ బౌలింగ్ లోనే ఏడు సార్లు తన వికెట్ కోల్పోయాడు.

మైదానంలో కోహ్లీ ఎప్పుడూ నంబర్‌వన్‌గా ఉంటాడు. ఇప్పుడు ఫీల్డ్ బయట కూడా నంబర్ వన్ అయ్యాడు. 2022లో మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో 230 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. క్రికెటర్లలో ప్రస్తుతానికి విరాట్ కోహ్లీకే అత్యధికంగా ఫాలోయర్లు ఉన్నారు. తన అద్భుతమైన బ్యాటింగ్ చూసి ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అతని వల్లే ఆర్సీబీని కూడా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. విరాట్ కోహ్లి లాగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 2022లో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ జట్టుగా నిలిచింది. కోహ్లి తన ఐపీఎల్ కెరీర్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతోనే ప్రారంభించాడు. అతను ఇప్పటికీ RCB తరఫునే ఆడటం చూడవచ్చు.

భారత జట్టు వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో విరాట్ కోహ్లీతో సహా భారత జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్ 2023లోని కొన్ని మ్యాచ్‌లను ఆడకపోవచ్చు. ఆటగాళ్ల పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఏడాది భారత టీ20 జట్టుకు కూడా విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది విరాట్ ఇప్పటి వరకు ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
India Richest MLA: దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
Adilabad Road Accident: లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Vanavaasam Song Lyrics: వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Embed widget