అన్వేషించండి

Tokyo Olympics: పతకం గెలిస్తే డబ్బే డబ్బు... ఏ రాష్ట్రం ఎంత ఆఫర్‌ చేస్తుందంటే?

క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి.

సాధారణంగా మన క్రీడాకారులు ప్రతిష్టాత్మక టోర్నీల్లో విజయం సాధిస్తే వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక నజరానా ప్రకటిస్తుంటాయి. ఇప్పటి వరకు క్రీడాకారులు టోర్నీలు గెలిచి వచ్చిన తర్వాత వారిని సన్మానించి నజరానాలు ప్రకటించడం చూశాం. కొన్ని రాష్ట్రాలైతే నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్ని కూడా కల్పిస్తాయి.


Tokyo Olympics: పతకం గెలిస్తే డబ్బే డబ్బు... ఏ రాష్ట్రం ఎంత ఆఫర్‌ చేస్తుందంటే?

కానీ, ఈ సారి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేశాయి. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి. అంతేకాదు, మరికొన్ని రాష్ట్రాలైతే తమ రాష్ట్రం తరఫున ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన వారికి కూడా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు ఏ పతకం గెలిస్తే ఎంత ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. 

కేంద్ర ప్రభుత్వం: 
స్వర్ణం గెలిచిన వారికి రూ.75లక్షలు, రజతం గెలిచిన వారికి రూ.50 లక్షలు, కాంస్యం గెలిచిన వారికి రూ.35లక్షలు ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. 

రాజస్థాన్: 
రాజస్థాన్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన ఏ క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు, రజతం గెలిస్తే రూ.2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

హరియాణా: 
రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైనా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ. 4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 1.5కోట్లు ఇస్తామని 
ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ తెలిపారు. 

పంజాబ్: 
పంజాబ్ ముఖ్యమంత్రి రాణా గుర్మీత్ సింగ్ ఆ రాష్ట్ర క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయిన క్రీడాకారులు ఒకొక్కరికీ రూ.5లక్షలు ఇస్తామన్నారు. దీంతో పాటు స్వర్ణం గెలిస్తే రూ.2.25కోట్లు, రజతం గెలిస్తే రూ.1.5కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు అందించనుంది. 

కర్ణాటక: 
తమ రాష్ట్ర క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ. 5కోట్లు, రజతం గెలిస్తే రూ. 3కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2కోట్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. 

ఉత్తరప్రదేశ్: 
పంజాబ్ ప్రభుత్వం లాగానే ఉత్తరప్రదేశ్ కూడా ఆ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైతే ఒలింపిక్స్‌‌కి అర్హత సాధించిన ఒకొక్కరికీ రూ.10లక్షలు ఇవ్వనుంది. అలాగే స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ.4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2 కోట్లు అందించనున్నట్లు తెలిపింది.

తమిళనాడు: 
ఒలింపిక్స్‌లో  నగదు ప్రోత్సాహకంతో పాటు ప్లాట్ కూడా ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 3కోట్లు, రజతం గెలిస్తే రూ. 2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనుంది. 

ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ కూడా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరి, పతకాలు గెలిచి ఏ క్రీడాకారులు ఎంతెంత తమ ఖాతాల్లో వేసుకుంటారో చూద్దాం. 
  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget