అన్వేషించండి

Tokyo Olympics: పతకం గెలిస్తే డబ్బే డబ్బు... ఏ రాష్ట్రం ఎంత ఆఫర్‌ చేస్తుందంటే?

క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి.

సాధారణంగా మన క్రీడాకారులు ప్రతిష్టాత్మక టోర్నీల్లో విజయం సాధిస్తే వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక నజరానా ప్రకటిస్తుంటాయి. ఇప్పటి వరకు క్రీడాకారులు టోర్నీలు గెలిచి వచ్చిన తర్వాత వారిని సన్మానించి నజరానాలు ప్రకటించడం చూశాం. కొన్ని రాష్ట్రాలైతే నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్ని కూడా కల్పిస్తాయి.


Tokyo Olympics: పతకం గెలిస్తే డబ్బే డబ్బు... ఏ రాష్ట్రం ఎంత ఆఫర్‌ చేస్తుందంటే?

కానీ, ఈ సారి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేశాయి. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి. అంతేకాదు, మరికొన్ని రాష్ట్రాలైతే తమ రాష్ట్రం తరఫున ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన వారికి కూడా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు ఏ పతకం గెలిస్తే ఎంత ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. 

కేంద్ర ప్రభుత్వం: 
స్వర్ణం గెలిచిన వారికి రూ.75లక్షలు, రజతం గెలిచిన వారికి రూ.50 లక్షలు, కాంస్యం గెలిచిన వారికి రూ.35లక్షలు ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. 

రాజస్థాన్: 
రాజస్థాన్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన ఏ క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు, రజతం గెలిస్తే రూ.2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

హరియాణా: 
రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైనా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ. 4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 1.5కోట్లు ఇస్తామని 
ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ తెలిపారు. 

పంజాబ్: 
పంజాబ్ ముఖ్యమంత్రి రాణా గుర్మీత్ సింగ్ ఆ రాష్ట్ర క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయిన క్రీడాకారులు ఒకొక్కరికీ రూ.5లక్షలు ఇస్తామన్నారు. దీంతో పాటు స్వర్ణం గెలిస్తే రూ.2.25కోట్లు, రజతం గెలిస్తే రూ.1.5కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు అందించనుంది. 

కర్ణాటక: 
తమ రాష్ట్ర క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ. 5కోట్లు, రజతం గెలిస్తే రూ. 3కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2కోట్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. 

ఉత్తరప్రదేశ్: 
పంజాబ్ ప్రభుత్వం లాగానే ఉత్తరప్రదేశ్ కూడా ఆ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైతే ఒలింపిక్స్‌‌కి అర్హత సాధించిన ఒకొక్కరికీ రూ.10లక్షలు ఇవ్వనుంది. అలాగే స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ.4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2 కోట్లు అందించనున్నట్లు తెలిపింది.

తమిళనాడు: 
ఒలింపిక్స్‌లో  నగదు ప్రోత్సాహకంతో పాటు ప్లాట్ కూడా ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 3కోట్లు, రజతం గెలిస్తే రూ. 2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనుంది. 

ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ కూడా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరి, పతకాలు గెలిచి ఏ క్రీడాకారులు ఎంతెంత తమ ఖాతాల్లో వేసుకుంటారో చూద్దాం. 
  

టాప్ హెడ్ లైన్స్

Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
Asian Games Draw: 2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!
2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget