అన్వేషించండి

Tokyo Olympics: పతకం గెలిస్తే డబ్బే డబ్బు... ఏ రాష్ట్రం ఎంత ఆఫర్‌ చేస్తుందంటే?

క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి.

సాధారణంగా మన క్రీడాకారులు ప్రతిష్టాత్మక టోర్నీల్లో విజయం సాధిస్తే వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక నజరానా ప్రకటిస్తుంటాయి. ఇప్పటి వరకు క్రీడాకారులు టోర్నీలు గెలిచి వచ్చిన తర్వాత వారిని సన్మానించి నజరానాలు ప్రకటించడం చూశాం. కొన్ని రాష్ట్రాలైతే నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్ని కూడా కల్పిస్తాయి.


Tokyo Olympics: పతకం గెలిస్తే డబ్బే డబ్బు... ఏ రాష్ట్రం ఎంత ఆఫర్‌ చేస్తుందంటే?

కానీ, ఈ సారి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేశాయి. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ పతకం గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తామో ముందే ప్రకటించేశాయి. అంతేకాదు, మరికొన్ని రాష్ట్రాలైతే తమ రాష్ట్రం తరఫున ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన వారికి కూడా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలు ఏ పతకం గెలిస్తే ఎంత ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. 

కేంద్ర ప్రభుత్వం: 
స్వర్ణం గెలిచిన వారికి రూ.75లక్షలు, రజతం గెలిచిన వారికి రూ.50 లక్షలు, కాంస్యం గెలిచిన వారికి రూ.35లక్షలు ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. 

రాజస్థాన్: 
రాజస్థాన్ ప్రభుత్వం తమ రాష్ట్రానికి చెందిన ఏ క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు, రజతం గెలిస్తే రూ.2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

హరియాణా: 
రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైనా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ. 4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 1.5కోట్లు ఇస్తామని 
ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ తెలిపారు. 

పంజాబ్: 
పంజాబ్ ముఖ్యమంత్రి రాణా గుర్మీత్ సింగ్ ఆ రాష్ట్ర క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయిన క్రీడాకారులు ఒకొక్కరికీ రూ.5లక్షలు ఇస్తామన్నారు. దీంతో పాటు స్వర్ణం గెలిస్తే రూ.2.25కోట్లు, రజతం గెలిస్తే రూ.1.5కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు అందించనుంది. 

కర్ణాటక: 
తమ రాష్ట్ర క్రీడాకారులెవరైనా స్వర్ణం గెలిస్తే రూ. 5కోట్లు, రజతం గెలిస్తే రూ. 3కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2కోట్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. 

ఉత్తరప్రదేశ్: 
పంజాబ్ ప్రభుత్వం లాగానే ఉత్తరప్రదేశ్ కూడా ఆ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైతే ఒలింపిక్స్‌‌కి అర్హత సాధించిన ఒకొక్కరికీ రూ.10లక్షలు ఇవ్వనుంది. అలాగే స్వర్ణం గెలిస్తే రూ. 6కోట్లు, రజతం గెలిస్తే రూ.4కోట్లు, కాంస్యం గెలిస్తే రూ. 2 కోట్లు అందించనున్నట్లు తెలిపింది.

తమిళనాడు: 
ఒలింపిక్స్‌లో  నగదు ప్రోత్సాహకంతో పాటు ప్లాట్ కూడా ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 3కోట్లు, రజతం గెలిస్తే రూ. 2కోట్లు, కాంస్యం గెలిస్తే కోటి రూపాయలు ఇవ్వనుంది. 

ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ కూడా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరి, పతకాలు గెలిచి ఏ క్రీడాకారులు ఎంతెంత తమ ఖాతాల్లో వేసుకుంటారో చూద్దాం. 
  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Embed widget