అన్వేషించండి

Watch Video: హార్దిక్ పాండ్యపై విరాట్ కోహ్లీ కోపం - వీడియో వైరల్ 

Watch Video: నిన్న జరిగిన భారత్- శ్రీలంక మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా తన సహచరుడు హార్దిక్ పాండ్యపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోపం ప్రదర్శించాడు. ఎందుకో తెలుసా!

Watch Video:  గువాహటి వేదికగా భారత్- శ్రీలంక మధ్య నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టిగా రాణించిన రోహిత్ సేన 67 పరుగుల తేడాతో లంకను మట్టి కరిపించింది. విరాట్ కోహ్లీ (113) అద్భుత సెంచరీకి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) లు రాణించారు. యువ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 3, మహ్మద్ సిరాజ్ లు 2 వికెట్లతో గెలుపులో కీలకపాత్ర పోషించారు. 

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తిరిగి తన పాత ఆటను అందుకున్నాడు. తనవైన షాట్లతో అలరించిన కోహ్లీ వన్డే కెరీర్ లో 45వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈ శతకంతో పలు రికార్డులను అందుకున్నాడు. కోహ్లీ మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. బౌండరీలు రావడం కష్టమైన దశలో సింగిల్స్, డబుల్స్ తో స్కోరు బోర్డును నడిపిస్తాడు. ఈ మ్యాచ్ లో ఇలా వికెట్ల మధ్య పరిగెత్తే విషయంలో విరాట్ కోహ్లీ తన సహచరుడు హార్దిక్ పాండ్యపై కోపం ప్రదర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాండ్య వైపు కోపంగా చూసిన కోహ్లీ

భారత్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 43వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. ఆ ఓవర్లో లంక బౌలర్ కసిన్ రజిత వేసిన బంతిని స్ట్రైకింగ్ లో ఉన్న కోహ్లీ ఆన్ సైడ్ ఆడాడు. చకచకా ఒక పరుగు పూర్తిచేశాడు. రెండో పరుగు కోసం పిచ్ సగం వరకు వచ్చాడు. అయితే అటువైపు ఉన్న పాండ్య స్పందించలేదు. రెండో పరుగు వద్దంటూ చేతితో సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే కోహ్లీ తిరిగి తన క్రీజులోకి వెళ్లిపోయాడు. తర్వాత విరాట్ పాండ్య వైపు 2 సెకన్లు కోపంగా చూశాడు. అయితే పాండ్య కోహ్లీ వైపు చూడలేదు. ప్రస్తుతం వీడియా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. నిజానికి అక్కడ రెండో పరుగును కూడా తేలికగానే పూర్తిచేసే అవకాశం ఉంది. అయినప్పటికీ పాండ్య నిరాకరించాడు. బహుశా ఇందువలనే కోహ్లీ అతనివైపు కోపంగా చూశాడు. 

శతకంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకున్న కింగ్ కోహ్లీ

ఈ మ్యాచ్ లో శతకం బాదిన విరాట్ కోహ్లీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో సచిన్ చేసిన 20 శతకాల రికార్డును విరాట్ అందుకున్నాడు. అలాగే శ్రీలంకపై టెండూల్కర్ సాధించిన 8 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ శ్రీలంకపై తన శతకాల సంఖ్యను 9కి పెంచుకున్నాడు. వన్డేల్లో విరాట్ కిది 45వ శతకం. అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో 73వ సెంచరీని సాధించాడు.  ప్రస్తుత క్రికెట్ లో ఎవరూ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేేరు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget