అన్వేషించండి

Virat -Babar: ఒకే జట్టులో విరాట్‌ కోహ్లీ- బాబర్ ఆజమ్‌ , కల నెరవేరుతుందా?

Afro-Asia Cup: స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్‌, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్ త్వరలో ఒకే జట్టు తరఫున ఆడే అవకాశముందా? జైషా ఏమన్నారంటే?

Virat Kohli To Partner Babar Azam For Same Team In This Tournament:  భారత్‌-పాక్(Ind Vs Pak) మ్యాచ్‌ ఆంటేనే ఇరు దేశాల అభిమానులు దాన్నో యుద్ధంలా చూస్తారు. ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు... పరస్పర కవ్వింపు చర్యలతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. విరాట్‌ కోహ్లీ(Virat Kohli)- బాబర్‌ ఆజమ్‌(Babar Azam)లలో ఉత్తమ ఆటగాడు ఎవరన్న దానిపై ఎప్పడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. షాహీన్‌ షా అఫ్రిదీ... జస్ప్రీత్‌ బుమ్రాలలో ఎవరూ అత్యుత్తమమనే దానిపైనా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు వీరందరూ కలిసి ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా.. ఇది నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఒకే జట్టులో ఆడే అవకాశం కనిపిస్తోంది. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో-ఆసియా కప్(Afro-Asia Cup) నిర్వహించే అవకాశం ఉంది.
 
 
ఆఫ్రో-ఆసియా కప్‌
ఆఫ్రో ఆసియా కప్‌ను మొదటిసారిగా 2005లో నిర్వహించారు. ఆఫ్రికా లెవన్‌ జట్టుతో ఆసియా లెవన్‌ జట్టు తలపడింది. అప్పుడు సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, ఇంజమామ్-ఉల్-హక్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్ ఆసియా లెవన్‌ జట్టులో ఆడారు. 2007లో జరిగిన ఆఫ్రో ఆసియా కప్‌లో MS ధోని, సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే ఆడారు. ఆ మ్యాచ్‌లో ధోనీ ఐదు సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆఫ్రో-ఆసియా కప్‌ను 2007 తర్వాత నిర్వహించలేదు. ఇప్పుడు ఈ లీగ్‌ను పునరుద్ధరించేందుకు ఐసీసీ చర్యలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా నియమించిన తర్వాత ఆఫ్రో-ఆసియా కప్‌ నిర్వహణపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2023 ఆఫ్రో-ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆఫ్రో-ఆసియ కప్‌ నిర్వహించాలన్న అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తుందని ఒక అధికారి తెలిపారు.
 
జై షా చేతుల్లోనే..
డిసెంబర్‌లో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా(Jay Shah) బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్రో- ఆసియ కప్‌ నిర్వహణ అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. చివరిసారి వన్డే ఫార్మాట్‌లో ఈ కప్‌ను నిర్వహించగా... ఈ సారి టీ 20 ఫార్మట్‌లో నిర్వహించే అవకాశం ఉంది.  ఆఫ్రో-ఆసియా కప్ నిర్వహించకపోవడం వ్యక్తిగతంగా తనను చాలా బాధ పెట్టిందని... ఇప్పుడు మళ్లీ దానిని పరిశీలిస్తున్నారని ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ సమోద్ దామోదర్ తెలిపారు. భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడితే చూడాలన్న కల నెరవేరాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. విరాట్ కోహ్లి, బాబర్ అజామ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్ల ఒకే జట్టులో కనపడితే అదిరిపోతుందని అన్నాడు. 2023లో ఆఫ్రో- ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. ఆసియా క్రికెట్‌ అసోసియేషన్‌లో ని అంతర్గత గందరగోళం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఇది తెరపైకి వచ్చింది.
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget