అన్వేషించండి

Virat -Babar: ఒకే జట్టులో విరాట్‌ కోహ్లీ- బాబర్ ఆజమ్‌ , కల నెరవేరుతుందా?

Afro-Asia Cup: స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్‌, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్ త్వరలో ఒకే జట్టు తరఫున ఆడే అవకాశముందా? జైషా ఏమన్నారంటే?

Virat Kohli To Partner Babar Azam For Same Team In This Tournament:  భారత్‌-పాక్(Ind Vs Pak) మ్యాచ్‌ ఆంటేనే ఇరు దేశాల అభిమానులు దాన్నో యుద్ధంలా చూస్తారు. ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు... పరస్పర కవ్వింపు చర్యలతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. విరాట్‌ కోహ్లీ(Virat Kohli)- బాబర్‌ ఆజమ్‌(Babar Azam)లలో ఉత్తమ ఆటగాడు ఎవరన్న దానిపై ఎప్పడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. షాహీన్‌ షా అఫ్రిదీ... జస్ప్రీత్‌ బుమ్రాలలో ఎవరూ అత్యుత్తమమనే దానిపైనా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు వీరందరూ కలిసి ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా.. ఇది నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఒకే జట్టులో ఆడే అవకాశం కనిపిస్తోంది. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో-ఆసియా కప్(Afro-Asia Cup) నిర్వహించే అవకాశం ఉంది.
 
 
ఆఫ్రో-ఆసియా కప్‌
ఆఫ్రో ఆసియా కప్‌ను మొదటిసారిగా 2005లో నిర్వహించారు. ఆఫ్రికా లెవన్‌ జట్టుతో ఆసియా లెవన్‌ జట్టు తలపడింది. అప్పుడు సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, ఇంజమామ్-ఉల్-హక్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్ ఆసియా లెవన్‌ జట్టులో ఆడారు. 2007లో జరిగిన ఆఫ్రో ఆసియా కప్‌లో MS ధోని, సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే ఆడారు. ఆ మ్యాచ్‌లో ధోనీ ఐదు సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆఫ్రో-ఆసియా కప్‌ను 2007 తర్వాత నిర్వహించలేదు. ఇప్పుడు ఈ లీగ్‌ను పునరుద్ధరించేందుకు ఐసీసీ చర్యలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా నియమించిన తర్వాత ఆఫ్రో-ఆసియా కప్‌ నిర్వహణపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2023 ఆఫ్రో-ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆఫ్రో-ఆసియ కప్‌ నిర్వహించాలన్న అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తుందని ఒక అధికారి తెలిపారు.
 
జై షా చేతుల్లోనే..
డిసెంబర్‌లో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా(Jay Shah) బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్రో- ఆసియ కప్‌ నిర్వహణ అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. చివరిసారి వన్డే ఫార్మాట్‌లో ఈ కప్‌ను నిర్వహించగా... ఈ సారి టీ 20 ఫార్మట్‌లో నిర్వహించే అవకాశం ఉంది.  ఆఫ్రో-ఆసియా కప్ నిర్వహించకపోవడం వ్యక్తిగతంగా తనను చాలా బాధ పెట్టిందని... ఇప్పుడు మళ్లీ దానిని పరిశీలిస్తున్నారని ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ సమోద్ దామోదర్ తెలిపారు. భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడితే చూడాలన్న కల నెరవేరాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. విరాట్ కోహ్లి, బాబర్ అజామ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్ల ఒకే జట్టులో కనపడితే అదిరిపోతుందని అన్నాడు. 2023లో ఆఫ్రో- ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. ఆసియా క్రికెట్‌ అసోసియేషన్‌లో ని అంతర్గత గందరగోళం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఇది తెరపైకి వచ్చింది.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Embed widget