అన్వేషించండి

Indian Bowlers: పార్ట్ టైమర్స్- భారత జట్టు విస్మరిస్తున్న ప్రధాన సమస్య!

Indian Bowlers: పార్ట్ టైమ్ బౌలర్లు... వారు వేసే ఒకట్రెండు ఓవర్లలోనే మ్యాచ్ మలుపుతిప్పగలరు. భాగస్వామ్యాలు బలపడుతున్న వేళ వికెట్లు తీయగలరు. ఇప్పుడు టీమిండియా విస్మరిస్తున్న సమస్య కూడా ఇదే.

Indian Bowlers:  టీమిండియా మ్యాచ్ ఓడిపోయి, టీ20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించి రెండు రోజులు పూర్తయిపోయాయి. కానీ ఇంకా అదే బాధ, కోపం ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. అందరి ఆవేదన ఒక్కటే. ఓడినా తప్పులేదు. కానీ కనీస పోరాటం లేకుండా చేతులెత్తేయడమే బాధిస్తోంది. అందరూ చెప్పుకున్నట్టు ఓపెనింగ్ సమస్య, బౌలింగ్ లో సరైన ఆటగాడు లేకపోవడమే ప్రధాన కారణాలన్నది స్పష్టం.  నిజమే. ఈ రెండు విభాగాల్లోనూ ఈ టోర్నమెంట్ లో మన ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచిన మాట వాస్తవమే. అయితే ఈ రెండింటినే ప్రధాన కారణాలుగా చూపిస్తూ... ఏళ్ల తరబడి వెంటాడుతున్న అసలు సమస్యను పక్కన పెట్టేద్దామా...? అదేంటో వివరంగా చెప్పుకుందాం. 

పార్ట్ టైమ్ బౌలర్లు... వారు వేసే ఒకట్రెండు ఓవర్లలోనే మ్యాచ్ మలుపు తిప్పగలరు. భాగస్వామ్యాలు బలపడుతున్న వేళ వికెట్ తీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టగలరు. ప్రధాన బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేస్తున్న సమయాన బంతి అందుకుని రన్స్ ను కట్టడి చేయగలరు.  అవసరమైతే పూర్తి ఓవర్ల కోటా పూర్తిచేయగలరు. ఎందుకంటే వారి బౌలింగ్ గురించి ప్రత్యర్థి జట్లకు అంతగా అవగాహన ఉండదు కాబట్టి. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ప్రతి జట్టు తమ టీంలో ఒకరిద్దరు పార్ట్ టైమర్లు ఉండేలా చూసుకుంటోంది. అయితే భారత్ జట్టులో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా అలాంటి వాళ్లు లేరు. టీ20 ప్రపంచకప్ లో ఘోర వైఫల్యం తర్వాత టీమిండియా దృష్టి సారించాల్సిన అంశాల్లో ఇది కూడా ఒకటి.

అప్పుడు యువీ, రైనా.. ఇప్పుడెవరు?

కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. అంటే ధోనీ కెప్టెన్సీ కాలంలోకి. ఫార్మాట్ వేరే అయి ఉండొచ్చు కానీ ఇది కచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశమే. అప్పట్లో వన్డేల్లో, టీ20ల్లో మనకు సెహ్వాగ్, యువరాజ్, రైనా లాంటి పార్ట్ టైం బౌలర్లు కానీ, ఆల్ రౌండర్లు కానీ ఉండేవారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యువీ, రైనా గురించి. యువీ అవసరమైతే పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేసేవాడు. రైనా అయితే ప్రత్యేకమే. ప్రత్యర్థి భాగస్వామ్యాలను విడదీసేందుకు ధోనీ రైనాను బాగా ఉపయోగించుకునేవాడు. ఆ రోజుల్లో ప్రధాన బౌలర్ల ప్రదర్శన కొంచెం అటూ ఇటూ అయితే ఈ పార్ట్ టైమర్లు రెడీగా ఉండేవారు. అంతేకాదు ఇలా ఇద్దరు, ముగ్గురు బౌలింగ్ ఆప్షన్ గా ఉండడం వల్ల తుది జట్టులో ఓ అదనపు బ్యాట్స్ మెన్ ను ఆడించే వీలుండేది. లోయరార్డర్ లో బ్యాటింగ్ లోతు పెరిగేది. ఇదంతా అప్పుడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి ఇప్పుడు రోహిత్ హయాం వరకు మన జట్టులో అలాంటి ఆల్ రౌండర్లు ఎంతమంది ఉన్నారు? గుర్తురావట్లేదు కదా. అసలుంటే కదా గుర్తొచ్చేది. అవును ఇది నిజం. ఇదే మన జట్టు విస్మరిస్తున్న ప్రధాన సమస్య. 

పార్ట్ టైమర్స్ జట్టుకు బలం

టీ20ల్లో ఇంతకుముందు ఓ థియరీ ఉండేది. ప్రతి జట్టు ఆరు బౌలింగ్ ఆప్షన్స్ తో బరిలోకి దిగితే మంచిదని. అయితే మారుతున్న ఆటను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు 7 బౌలింగ్ ఆప్షన్లు ఉంటే మంచిదని అన్ని దేశాలు అనుకుంటున్నాయి. భారత్ తప్ప మిగతా జట్లన్నీ దాదాపుగా ఇదే అనుసరిస్తున్నాయి. ఫలితాలు రాబడుతున్నాయి. మన పరిస్థితి ఏంటంటే.. హార్దిక్ పాండ్య మనకు ఆరో బౌలింగ్ ఆప్షన్. జట్టులో మరో అదనపు బ్యాట్స్ మెన్ ను ఆడించాలంటే హార్దిక్ నే ఐదో బౌలర్ గా ఉపయోగించుకుంటున్నారు. అంటే ఆ ఐదుగురు బౌలర్లు మ్యాచ్ రోజున సరిగ్గా బౌలింగ్ చేయకపోయినా, పరుగులు సమర్పించుకున్నా వారితోనే బౌలింగ్ వేయించాలి. ఎందుకంటే మరో ఆప్షన్ లేదు కాబట్టి. మన జట్టు లైనప్ చూసుకుంటే... రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్ ఇదీ టాప్ 5 బ్యాట్స్ మెన్. వీరిలో ఎవరూ కనీసం 2 ఓవర్లైనా బౌలింగ్ చేయలేరు. అంతకుముందు కోహ్లీ, రోహిత్ అప్పుడప్పుడు ఒక్కో ఓవర్ అయినా వేసేవారు. రోహిత్ కు అయితే ఐపీఎల్ లో హ్యాట్రిక్ కూడా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా రోహిత్ అసలు బంతి అందుకోవట్లేదు. 

ఇంగ్లండ్ తో సెమీస్ లో మన జట్టు ఓటమికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణం. పార్ట్ టైమ్ బౌలర్లు లేకపోవడం అన్నది ఎప్పటికైనా జట్టుకు లోటే. ఏ జట్టుకైనా పార్ట్ టైమర్స్ విలువ వెలకట్టలేనిది. వారిని ప్రత్యర్థి జట్లు తక్కువ అంచనా వేస్తారు. కాబట్టి వికెట్లు దక్కే అవకాశముంటుంది. కాబట్టి టాప్ 5 లో ఒకట్రెండు ఓవర్లు వేసే బ్యాటర్లు మన జట్టులో ఉండనంత కాలం.. ఆ బ్యాకప్ ఆప్షన్ ఉందన్న ధీమా రానంత కాలం జట్టు సమతూకంగా ఉండదు. 

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget