అన్వేషించండి

Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ నోరు విప్పాలి - అసలేం జరిగిందని మాజీ చీఫ్ సెలెక్టర్ ప్రశ్నలు

Sunil Joshi: భారత్ తరఫున టెస్టుల్లో రెండో విజయవంతమైన బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. తను 537 వికెట్లు తీశాడు. అయితే ఇటీవల ఆసీస్ టూర్లో సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. 

BGT 2025: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత మేటీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సిరీస్ మధ్యలో అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెబుతున్నట్లు కూల్‌గా ప్రకటించాడు. అయితే సిరీస్ మధ్యలో ఏం జరిగిందో, ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై అటు బీసీసీఐ గానీ, ఇటు టీమ్ మేనేజ్మెంట్ గానీ ఎలాంటి సమాచారం చెప్పడం లేదు. దీనిపై తాజాగా మాజీ స్పిన్నర్, 2020-21 ఆస్ట్రేలియాలో భారత జట్టు విజయం సాధించినప్పుడు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సునీల్ జోషి ప్రశ్నించాడు. అశ్విన్ సడెన్ రిటైర్మెంట్‌పై ఉన్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. అసలు మూడో టెస్టు ముగిశకా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడని, రెండు, మూడు టెస్టుల మధ్య ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశాడు. 

జట్టు ప్రణాళికా రాహిత్యం..
ఈ సిరీస్‌లో టీమిండియా చాలా తప్పులు చేసిందని, ఆటగాళ్లను తరచూ మారుస్తూ గందరగోళం నెలకొల్పిందని జోషి భావించాడు. అదే ఆసీస్ మాత్రం చక్కని ప్రణాళికలతో అనుకున్న ఫలితాలను సాధించిందని గుర్తు చేశాడు. అంతగా వికెట్లు తీయకున్నా, ఐదు టెస్టుల్లోనూ నాథన్ లయన్‌ను కొనసాగించడాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే భారత జట్టు మాత్రం అలాంటి చొరవ చూపించ లేకపోయిందని తెలిపాడు. నిజానికి అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లను ఎడాపెడా ఈ సిరీస్‌లో మార్చింది. బ్యాటర్ల విషయానికొస్తే తొలి టెస్టులో ఆడని శుభమాన్ గిల్, రోహిత్ శర్మ స్థానంలో దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్‌లను ఆడించారు. ఇక రెండో టెస్టులో వారిద్దరూ టీమ్‌లోకి రావడంతో పడిక్కల్, జురేల్‌ను తప్పించారు. నాలుగో టెస్టులో రోహిత్ కోసం శుభమాన్ గిల్‌ను తప్పించారు. ఇక ఐదో టెస్టులో రోహితే తప్పుకుని గిల్‌కు దారిచ్చాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే తొలి రెండు టెస్టుల్లో హర్షిత్ రాణా ఆడగా, తను విఫలం అవడంతో తర్వాత రెండు టెస్టులకు ఆకాశ్ దీప్‌సింగ్‌ను ఆడించారు. తను గాయపడగా చివరి టెస్టులో ప్రసిధ్ కృష్ణను ఆడించారు. ఇక స్పిన్నర్లలో తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించగా, రెండో టెస్టులో అశ్విన్‌ను, మూడో టెస్టులో రవీంద్ర జడేజాను ఆడించారు. తనను మూడో టెస్టులో తప్పించారనే మనస్తాపంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారని అభిమానులు వాదిస్తున్నారు. ఇక నాలుగు, ఐదు రెండు టెస్టుల్నూలో జడేజా, సుందర్లను ఆడించారు. ఇలా టీమ్ మేనేజ్మెంట్ గందరగోళంగా వ్యవహరించింది. 

బౌలింగ్ లో వైవిధ్యం లేదు..
ఇక బౌలింగ్‌లోనూ వైవిధ్యం కొరవడిందని జోషీ తెలిపాడు. న్యూజిలాండ్, ఆసీస్, ఇంగ్లాండ్ బౌలర్లు లెఫ్టార్మ్ పేసర్లకు తడబడుతారని తెలిసి, జట్టులో అలాంటి బౌలర్లను తీసుకోలేదని పేర్కొన్నాడు. 2020-21 టూర్లో గాయాల కారణంగా నెట్ బౌలర్లుగా ఉన్న ప్లేయర్లను జట్టులోకి తీసుకుని అద్భుతాలు సాధించామని, ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ కొరవడిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా నెట్ బౌలర్లుగా ఉన్న ఖలీల్ అహ్మద్, యశ్‌దయాల్ లాంటి లెఫ్టార్మ్ పేసర్లు ఉన్నప్పటికీ, వారిని వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా జట్టు విఫలమైనప్పుడే అందరి నోళ్లు లేస్తాయని, అదే విజయవంతమైతే తప్పులను కూడా ఎవరూ ప్రశ్నించరని, ఇది ఆటలో సహజమని పేర్కొన్నాడు. ఇక ఎన్సీఏలో ఆసీస్‌కు చెందిన టాయ్‌కూలీ నాయకత్వంలో పేసర్ల శిక్షణ జరుగుతోందని, త్వరలోనే మరింత మంది బౌలర్లు అందుబాటులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 1-3తో భారత్ చేజార్చుకుంది. దీంతో పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్ దక్కించుకుంది. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదేళ్ల తర్వాత టాప్-2 నుంచి దిగజారింది. 

Also Read: Aus Open 2025: విషం పెట్టి చంపాలని చూశారు - దేశం నుంచి వెళ్లగొట్టేందుకు నీచంగా ప్రవర్తించారు, టెన్నిస్ సూపర్ స్టార్ సంచలన ఆరోపణలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Advertisement

వీడియోలు

భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Aus vs Ind 2nd T20 Match Highlights | ఆసీస్ తో రెండో టీ20 లో ఓడిన టీమిండియా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Kavitha Politics: తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
తెలంగాణలో రాజకీయ శూన్యత.. జనం బాట పూర్తయ్యాక కవిత యాక్షన్ ప్లాన్
Srikakulam Stampede News: కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై మోదీ దిగ్భ్రాంతి- మృతులకు పరిహారం ప్రకటన
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Srikakulam Stampede News:
"అది ప్రైవేటు గుడి" కాశీబుగ్గ ఆలయంపై దేవాదాయశాఖ వివరణ
Tejeswini Nandamuri Jewellery AD: తేజస్విని నందమూరి యాడ్ చేసిన కంపెనీ ఎవరిదో తెలుసా? బాలకృష్ణ చిన్న కుమార్తె ఆ యాడ్ ఎందుకు చేశారంటే?
తేజస్విని నందమూరి యాడ్ చేసిన కంపెనీ ఎవరిదో తెలుసా? బాలకృష్ణ చిన్న కుమార్తె ఆ యాడ్ ఎందుకు చేశారంటే?
Embed widget