అన్వేషించండి

Rohit Sharma Breaks Down: అయ్యో రోహిత్ - హిట్‌మ్యాన్ కంట కన్నీరు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెమీస్ ఓటమి అనంతరం కన్నీరు పెడుతూ కనిపించాడు.

టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన భారత క్రికెట్ జట్టు మరో ఐసీసీ టోర్నీలో తడబడి లక్షలాది మంది క్రికెట్ అభిమానుల గుండెలను ముక్కలు చేసింది. ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ డగౌట్‌లో ఏడుస్తూ కనిపించాడు.

అడిలైడ్ ఓవల్‌లో రోహిత్ భావోద్వేగాలను టెలివిజన్ కెమెరాలు బంధించాయి. అనంతరం అతడిని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఓదార్చారు. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు రోహిత్ వీడియోను షేర్ చేశారు. అందులో అతను భావోద్వేగానికి లోనవుతున్నట్లు చూడవచ్చు.

రోహిత్ కూడా మంచి స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. తను 28 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేశాడు. కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 5 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు. ప్రపంచ టీ20 నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా 10 బంతుల్లో 14 పరుగులు చేసి విఫలం అయ్యాడు.

గురువారం అడిలైడ్ ఓవల్‌లో 16 ఓవర్లలో 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 86, జోస్ బట్లర్ 49 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఆదివారం ఎంసీజీలో జరగనున్న ఫైనల్లో పాకిస్థాన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.

విరాట్ కోహ్లి 40 బంతుల్లో 50, హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులు చేయడంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డ్ వేడుకలో భారత కెప్టెన్ మాట్లాడుతూ, తమ జట్టు ఒత్తిడిని ఎదుర్కోవడంలో విఫలమైందని, బంతితో సరిపడినంతగా రాణించలేదని చెప్పాడు.

"నాకౌట్ మ్యాచ్‌ల్లో ప్రెజర్ హ్యాండిల్ చేయడం చాలా ముఖ్యం. దీన్ని ఎవరికీ నేర్పించలేం. ఇదే కుర్రాళ్లు IPLలో ఎంతో ఒత్తిడిలో ప్లేఆఫ్‌లు ఆడారు." అని రోహిత్ శర్మ చెప్పారు. "భువీ మొదటి ఓవర్ వేసినప్పుడు అది స్వింగ్ అయింది. కానీ సరైన ఏరియాల నుండి కాదు. మేం దాన్ని టైట్‌గా ఉంచాలనుకున్నాం. ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ మాకు తెలిసిన ప్రాంతం. కానీ ఈరోజు పరుగులు అక్కడే వచ్చాయి." అన్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget