అన్వేషించండి

Ranji Trophy Semifinals: రంజీ సెమీస్‌ల్లో బౌలర్ల జోరు, చెలరేగిన ఆవేశ్‌ఖాన్‌, శార్దూల్‌

Ranji Trophy: దేశవాళీ ప్రతిష్టాత్మక టర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌-విదర్భ మధ్య సెమీఫైనల్‌ రసవత్తరంగా సాగుతోంది.

Ranji Trophy Semifinals: దేశవాళీ ప్రతిష్టాత్మక టర్నమెంట్‌ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో మధ్యప్రదేశ్‌-విదర్భ మధ్య తొలి సెమీఫైనల్‌ రసవత్తరంగా సాగుతోంది.  మొదటి రోజు ఆటలో మధ్యప్రదేశ్‌ బౌలర్లు చెలరేగడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. 32 పరుగుల వద్ద ప్రారంభమైన విదర్భ వికెట్ల పతనం ఆ తర్వాత వేగంగా కొనసాగింది. క‌రుణ్ నాయ‌ర్(63) హాఫ్ సెంచ‌రీతో పోరాడకపోతే ఇంకాస్త ముందుగానే విదర్భ ఇన్నింగ్స్ ముగిసేది. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో పేసర్‌ అవేష్‌ ఖాన్‌ 4 వికెట్లతో ప్రత్యర్ధి జట్టు దెబ్బతీయగా.. కుల్వంత్ ఖేజ్రోలియా, వెంకటేశ్‌ అయ్యర్‌ తలా రెండు వికెట్లతో రాణించారు. విధర్బ బ్యాటర్లలో కరుణ్‌ నాయర్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్‌ టైడే(39) పరుగులతో పర్వాలేదన్పించాడు. ఇక తొలి రోజు ఆటముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది.
 
రెండో సెమీస్‌లో ముంబై పేసర్ల ధాటికి త‌మిళ‌నాడు 146 పరుగుల‌కే కుప్పకూలింది.  ముంబైకి శార్ధూల్ శుభారంభ‌మిచ్చాడు. తొలి ఓవ‌ర్లోనే సాయి సుద‌ర్శన్ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత తుషార్ దేశ్‌పాండే త‌మిళ‌నాడు భ‌ర‌తం పట్టాడు. కెప్టెన్ సాయి కిశోర్‌ను ఔట్ చేయ‌డంతో 10.1 ఓవ‌ర్ల‌లో త‌మిళ‌నాడు 17 ర‌న్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. క‌ష్టాల్లో ప‌డ్డ జ‌ట్టును బాబా ఇంద్రజిత్, విజ‌య్ శంకర్‌లు ఆదుకునే ప్రయ‌త్నం చేశారు.
 
కానీ, దేశ్‌పాండే ఈ జోడీని విడ‌దీసి ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు, తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు, ముషీర్‌ ఖాన్‌ రెండు వికెట్లతో తమిళనాడు పతనాన్ని శాసించారు. వీరి ధాటికి  త‌మిళ‌నాడు 146 పరుగుల‌కే కుప్పకూలింది.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ త‌గిలింది.  ఓపెన‌ర్ పృథ్వీ షా(5), భూపేన్ ల‌ల్వానీ(15)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ముషీర్ ఖాన్‌(24 నాటౌట్), మోహిత్ అవస్థి(1)లు ఆచితూచి ఆడారు. దాంతో, ముంబై ఆట‌ముగిసే సరికి రెండు వికెట్ల న‌ష్టానికి 45 ప‌రుగులు చేసింది.
 
బరిలోకి దిగిన అయ్యర్
దేశవాళీ టోర్నీల్లో స్టార్‌ క్రికెటర్లు ఆడకపోవడంపై బీసీసీఐ(BCCI) కన్నెర్ర చేయడంతో ఆటగాళ్ల తీరు మారుతోంది. బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) రంజీ ట్రోఫీ(Ranji Trophy) సెమీఫైనల్లో బరిలోకి దిగాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి అయ్యర్‌ను ముంబై సెలక్టర్లుఎంపిక చేశారు. రంజీ సెమీస్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్‌కు అయ్యర్‌ సమాచారం ఇచ్చాడు. రంజీ సెమీఫైనల్స్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని అయ్యర్‌ స్పష్టం చేశాడు. దీంతో అయ్యర్‌ను టీంలోకి తీసుకుంటూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. రంజీ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో ముంబై తరఫున ఆడాలని బీసీసీఐ కోరగా ఫిట్‌నెస్‌తో లేనని అయ్యర్‌ తెలిపాడు. బీసీసీఐ మాట పెడచెవిన పెడుతూ ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోల్‌కతా జట్టుతో చేరి అయ్యర్‌ ప్రాక్టీస్‌ చేశాడు. దీనిపై బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయాన్ని కారణంగా చూపి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్‌ ఐపీఎల్‌ కోసం ప్రాక్టీస్‌ చేయడంతో అతడిపై వేటు పడింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
BSNL Best Prepaid Plan: జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
జియో, ఎయిర్‌టెల్‌ను వణికించే ప్లాన్ దించిన బీఎస్ఎన్ఎల్ - రోజుకు 3 జీబీ అంత తక్కువకా?
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
Embed widget