అన్వేషించండి

ODI World Cup 2023: భారత్‌ vs పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15నే! ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదిక!

ODI World Cup 2023: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూలు దాదాపుగా ఖరారైంది. డ్రాఫ్ట్‌ షెడ్యూలును బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి పంపించింది.

ODI World Cup 2023: 

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ షెడ్యూలు దాదాపుగా ఖరారైంది. డ్రాఫ్ట్‌ షెడ్యూలును బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి పంపించింది. సభ్యదేశాలు ఆమోదించగానే టోర్నీ తేదీలు, వేదికలు, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకు మరో వారం రోజులు పడుతుందని సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌ భూమ్మీద అతిపెద్ద స్టేడియం మోతేరాలోనే జరగనుంది. అక్టోబర్‌ 15న లక్షా పదివేల మంది ఈ మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.

భారత్‌ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌ను చివరిసారి విజేత, రన్నరప్‌ ఆరంభించనున్నాయి. అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే మ్యాచ్‌ ఆడనున్నాయి. ఇక టీమ్‌ఇండియా మూడు రోజుల తర్వాత చెపాక్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఎప్పట్లాగే ఈసారీ కొన్ని శత్రుదేశాల మధ్య మ్యాచులు ఆకట్టుకోనున్నాయి. ప్రపంచకప్ ఫైనల్‌ నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. నవంబర్‌ 15, 16న నిర్వహించే సెమీ ఫైనళ్ల వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.

డ్రాఫ్ట్‌ షెడ్యూలు ప్రకారం టీమ్ఇండియా తొమ్మిది వేదికల్లో లీగ్‌ మ్యాచులు ఆడనుంది. అక్టోబర్‌ 8న చెపాక్‌లో ఆస్ట్రేలియా, 11న దిల్లీలో అఫ్గాన్‌, 15న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌, 19న పుణెలో బంగ్లాదేశ్‌, 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌, 29న లఖ్‌నవూలో ఇంగ్లాండ్‌, నవంబర్‌ 2న ముంబయిలో క్వాలిఫయర్‌ జట్టు, 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికా, 11న బెంగళూరులో రెండో క్వాలిఫయర్‌ జట్టుతో టీమ్‌ఇండియా తలపడుతుంది.

దాయాది పాకిస్థాన్ లీగ్‌ మ్యాచుల్ని ఐదు వేదికల్లో తలపడనుంది. అహ్మదాబాద్‌లో టీమ్‌ఇండియాతో పోరును పక్కనపెడితే అక్టోబర్‌ 6, 12న హైదరాబాద్‌లో రెండు క్వాలిఫయర్‌ జట్లు, అక్టోబర్‌ 20, 23 తేదీల్లో బెంగళూరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, 27, 31న కోల్‌కతాలో చెన్న, బంగ్లాదేశ్, నవంబర్‌ 5న బెంగళూరులో న్యూజిలాండ్‌, 12న కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్‌ 29న ధర్మశాలలో ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్‌, నవంబర్‌ 4న ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్‌, నవంబర్‌ 1న న్యూజిలాండ్‌ vs దక్షిణాఫ్రికా వంటి పెద్ద మ్యాచులు జరుగుతాయి.

సాధారణంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ మ్యాచులను ఏడాది ముందే ప్రకటిస్తారు. ఈసారి మాత్రమే కాస్త ఆలస్యమైంది. నాలుగు నెలల ముందు షెడ్యూలు ఇస్తున్నారు. మామూలుగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రోజునే షెడ్యూలు విడుదల చేస్తామని బీసీసీఐ కార్యదర్శి జేషా మే27న అన్నారు. అయితే మరో వారం రోజులూ ఆలస్యమే అవుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget