Jasprit Bumrah Record: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా కొత్త చరిత్ర
కార్డిఫ్ వన్డేలో ఇండియా 233 రన్స్ కే ఆల్ అవుట్ అవ్వగా ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కే జస్ప్రీత్ బుమ్రా కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

Bumrah Gives Dream Start After Batting Collapse: ఇండియా, ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ జట్ల మధ్య కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరుగుతున్న సెండ్ వన్డే మ్యాచ్ ఒక హై-డ్రామా థ్రిల్లర్ లా మారింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 233 రన్స్ కే కంప్లీట్ గా ఆల్ అవుట్ అయింది. అయితే ఈ చిన్న టార్గెట్ ను డిఫెండ్ చేయడానికి గ్రౌండ్ లోకి వచ్చిన ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లోని వెరీ ఫస్ట్ బాల్ కే బెన్ డకెట్ ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ పై ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. ఆ వెంటనే ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్ తో యంగ్ ఓపెనర్ జాకబ్ బెథెల్ ను తక్కువ స్కోర్ కే పంపించేశాడు. 234 రన్స్ ఛేజింగ్ లో ఇంగ్లాండ్ టీమ్ ప్రెజెంట్ 8 ఓవర్లు ముగిసేసరికి 40 రన్స్ కే రెండు వికెట్లు కోల్పోయి తీవ్రమైన ఒత్తిడిలో పడింది. క్రీజులో జో రూట్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ మ్యాచ్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
You just can't keep him out of the game. 🔥#JaspritBumrah gives India the perfect start, sending #BenDuckett back. #ENGvIND 2nd ODI 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/EeGJaTLPJu
— Star Sports (@StarSportsIndia) July 16, 2026
కోహ్లీ అయ్యర్ ల సాలిడ్ హాఫ్ సెంచరీలు..
అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఈ డే-నైట్ మ్యాచ్ లో ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇండియా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ (65 రన్స్), శ్రేయస్ అయ్యర్ (66 రన్స్) పట్టుదలతో ఆడి హాఫ్ సెంచరీలు చేయడంతో ఇండియా ఒక మోస్తరు స్కోరైనా చేయగలిగింది. ఈ ఇద్దరూ ఫోర్త్ వికెట్ కు 67 రన్స్ క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కోహ్లీ క్లాసిక్ డ్రైవ్ లతో తన 78వ వన్డే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయగా, అయ్యర్ 25 రన్స్ వద్ద దొరికిన లైఫ్ ను యూజ్ చేసుకుని 66 రన్స్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఇండియా ఇన్నింగ్స్ ఘోరంగా పతనం అయింది. మిడిల్ ఫేజ్ లో ఇండియా కేవలం 32 రన్స్ గ్యాప్ లోనే ఏకంగా సిక్స్ వికెట్లు కోల్పోయి కంప్లీట్ డిఫెన్స్ లో పడింది.
ఆర్చర్ అట్కిన్సన్ విధ్వంసం..
ఇంగ్లాండ్ ఎక్స్ప్రెస్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన లాస్ట్ ఫైవ్ ఓవర్లలో వినాశనం సృష్టించాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న కోహ్లీని అవుట్ చేయడమే కాకుండా, అక్షర్ పటేల్, శివమ్ దూబేలను వరుస బంతుల్లో అవుట్ చేసి టూ-ఇన్-టూ వికెట్లతో ఇండియాను కోలుకోకుండా దెబ్బకొట్టాడు. ఆర్చర్ 47 రన్స్ ఇచ్చి త్రీ వికెట్లు తీయగా, గుస్ అట్కిన్సన్ కూడా 50 రన్స్ ఇచ్చి త్రీ వికెట్లు పడగొట్టాడు. లాస్ట్ లో బ్యాటింగ్ కు వచ్చిన జస్ప్రీత్ బుమ్రా సకీబ్ మహమూద్ ఓవర్ లో ఒక సిక్స్, ఫోర్ ఫోర్లతో ఏకంగా 18 రన్స్ పిండుకుని టోటల్ గా 20 రన్స్ నాటౌట్ క్యామియో ఇన్నింగ్స్ ఆడి ఇండియా స్కోరును 233 కి చేర్చాడు. అట్కిన్సన్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణలు అవుట్ అవ్వడంతో ఇంకా సిక్స్ ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇండియా ఇన్నింగ్స్ క్లోజ్ అయింది.
Innings Break!
— BCCI (@BCCI) July 16, 2026
Virat Kohli & Shreyas Iyer with vital fifties for #TeamIndia.
Over to the bowlers to defend this!
Scorecard ▶️ https://t.co/2Z0BQOPWjC #ENGvIND pic.twitter.com/4w8wjK1unh
రోహిత్ గిల్ ల నిరాశ.. సిరీస్ ను లెవెల్ చేసే ప్లాన్ లో ఇంగ్లాండ్
ఈ మ్యాచ్ లో ఇండియా టాప్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఓపెనర్ రోహిత్ శర్మ టైమింగ్ దొరకక 47 బంతుల్లో 26 రన్స్ మాత్రమే చేసి జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సిక్ అయిన కేఎల్ రాహుల్ ప్లేస్ లో టీమ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం ఒకే ఒక్క రన్ చేసి సామ్ కరన్ బౌలింగ్ లో దొరికిపోయాడు. ఫస్ట్ వన్డే లో 80 రన్స్ కొట్టిన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ లో సిక్స్ ఫోర్లతో చాలా అగ్రెసివ్ గా 31 రన్స్ చేసినప్పటికీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. బర్మింగ్హామ్ లో జరిగిన ఫస్ట్ వన్డే గెలిచి 1-0 లీడ్ లో ఉన్న ఇండియాను ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని బరిలోకి దిగింది.
ట్రెండింగ్ వార్తలు



















