అన్వేషించండి

IPL 2023: ఐపీఎల్ 2023 మినీ వేలం- ఈ ముగ్గురు కీలక ఆటగాళ్ల దూరం!

IPL 2023: ఐపీఎల్ 2023 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్ కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. అయితే ఈ సీజన్ కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు.

IPL 2023:  ఐపీఎల్ 2023 కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్ కోసం మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్లు లిస్టును బీసీసీఐకు అందజేశాయి. విడుదల చేసిన ఆటగాళ్లు తమ పేర్లును వేలంలో నమోదు చేసుకున్నారు. అయితే కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు ఇంకా తమ పేర్లను వేలంలోకి ఇవ్వలేదు. దీన్ని బట్టి వారు వచ్చే ఐపీఎల్ లో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. 

ఐపీఎల్ కు బ్రావో దూరం

వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తన పేరును వేలంలోకి ఇవ్వలేదు. ఏళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రావో ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈసారి అతన్ని చెన్నై అట్టిపెట్టుకోలేదు. రిలీజ్ చేసింది. సీఎస్ కే తనను విడుదల చేశాక బ్రావో తన పేరును వేలానికి ఇవ్వలేదు. దీన్ని బట్టి అతను ఐపీఎల్ నుంచి రిటైర్ అయినట్లు తెలుస్తోంది. ఇకమీదట భారత టీ20 లీగ్ లో బ్రావో మెరుపులు కనిపించవేమో.

స్మిత్, లబుషేన్ కూడా

ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్ కూడా తమ పేర్లను ఐపీఎల్ వేలానికి ఇవ్వలేదు. ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫాంలో ఉన్నారు. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో స్మిత్, లబుషేన్ లు డబుల్ సెంచరీలతో చెలరేగారు. రాబోయే యాషెస్ సిరీస్ కు తయారయ్యేందుకు వీరు ఐపీఎల్ 2023 వేలానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఆటగాళ్లు 2021 ఐపీఎల్ లో సీజన్ లో అమ్ముడుపోలేదు. అప్పుడు వీరిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. 

ఐపీఎల్ మినీ వేలం తేదీ మార్చాలన్న ఫ్రాంచైజీలు- తిరస్కరించిన బీసీసీఐ!

ఐపీఎల్ 2023 ఎడిషన్ కోసం డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ తేదీని మార్చాలని కొన్ని ఫ్రాంచైజీలు బోర్డును అభ్యర్థించాయి. అయినా కూడా వేలం తేదీలను బోర్డు మార్చబోవడం లేదని వార్తలు వస్తున్నాయి. 

దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడినట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు క్రిస్మస్ సెలవులను పురస్కరించుకుని వేలం తేదీని మార్చమని అడిగారు. వారి అభ్యర్థనను మేం అర్ధం చేసుకోగలం. అయితే తేదీని మార్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో సమీకరణాలు ఉన్నాయి. తేదీని మార్చితే ప్రతిదాన్ని మార్చాలి. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మినీ వేలం ఆ సమయానికే జరుగుతుంది. అని ఆయన చెప్పినట్లు సమాచారం. 

పంజాబ్ వద్ద ఎక్కువ డబ్బు

2022లో జరిగిన మెగా వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ. 3.45 కోట్ల డబ్బు మిగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 1.55 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ రూ. 95 లక్షలు, కోల్ కతా నైట్ రైడర్స్ రూ. 45 లక్షలు, గుజరాత్ టైటాన్స్ రూ. 15 లక్షలతో ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, డిల్లీ క్యాపిటల్స్ వద్ద తలా రూ. 10 లక్షలు మిగిలాయి. లక్నో సూపర్ జెయింట్స్ పర్సు మొత్త ఖాళీ అయిపోయింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget