అన్వేషించండి

ODI World Cup 2023: ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ ఎక్కడెక్కడ ప్రత్యక్షప్రసారం అవుతుంది?

IND vs PAK : క్రికెట్‌ మహా సంగ్రామంలో భారత్-పాక్‌ కాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్‌ మైదానం అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ మైదానం లక్షా 32 వేల మంది ప్రేక్షకులతో మార్మోగనుంది.

మరికాసేపట్లో ప్రపంచం స్తంభించపోనుంది. క్రికెట్‌ మహా సంగ్రామంలో భారత్-పాక్‌ కాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మైదానం లక్షా 32 వేల మంది ప్రేక్షకులతో మార్మోగనుంది. ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై కాలుమోపిన పాకిస్థాన్‌.. భారత్‌పై స్వదేశంలో విజయం సాధించాలని భావిస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ప్రపంచకప్‌లోనే  హైఓల్టేజీ మ్యాచ్‌ అయిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య భీకర పోరు జరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు తలపడితే ప్రతీసారి భారత్‌నే విజయం వరించి ఉండవచ్చు. కానీ పాక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. బలాబలాలు, ఇటీవలి ప్రదర్శన చూసినా రోహిత్‌ సేనే ఫేవరెట్‌ కావచ్చు. కానీ దాయాది జట్టులోనూ ఆట స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లకు కొదవలేదు. అయితే ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ను ఎలా చూడాలి.. అసలు మ్యాచ్‌ ఏ సమయానికి ప్రారంభమవుతుంది... ఫోన్‌లో ఫ్రీగా చూడొచ్చా... మ్యాచ్ ఎన్ని గంటలకు...ఈ వివరాలు మీకోసం 
 
మ్యాచ్ ఎన్ని గంటలకు...
భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. 1:30కు టాస్‌ వేస్తారు.
 
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ..
 భారత్‌-పాక్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
 
ఫోన్‌లో ఉచితంగా..
డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఉచితంగా చూడొచ్చు.
 
ప్రపంచకప్‌ తాజా స్కోరు కోసం
భారత్‌-పాక్‌ మ్యాచ్‌ తాజా స్కోర్, అప్‌డేట్‌ల కోసం news.abplive.com/sportsని చూస్తూ ఉండండి
ఈ ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రణ క్షేత్రం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్‌ లోకమే ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ వేదికపై చిరకాల ప్రత్యర్థులు అమితుమీ తేల్చుకోనున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య పోరును సాధారణ మ్యాచ్‌ల కాకుండా ఇరు దేశాల అభిమానలు ఓ యుద్ధంలా చూస్తారు. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు కనురెప్ప ఆర్పకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తారు. ప్రపంచకప్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌లలో ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్‌లపై భారత్‌ భారీ విజయం సాధించగా... నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించిన పాక్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇటీవలి ఆసియా కప్‌ ప్రదర్శనను బట్టి చూస్తే అన్ని రంగాల్లో భారత్‌ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా ఆడే పాక్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
 
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్
 
పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది , మహ్మద్ వాసిం.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget