అన్వేషించండి

India vs england 4th test: భారత్ క్రికెట్ లో కొత్త చరిత్ర.. కేఎల్ రాహుల్, గిల్ సంచలనం! 55 ఏళ్ల తర్వాత అద్భుతం

kl rahul and gill created history test series against england | కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో రాణించారు. కీలక సమయాల్లో పరుగులతో జట్టును ఆదుకున్నారు.

మాంచెస్టర్: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ కెఎల్ రాహుల్ నాల్గవ టెస్ట్ నాల్గో రోజున 174 పరుగుల భాగస్వామ్యంతో జట్టును కష్టాల నుండి గట్టెక్కించారు. అసలే 311 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ మొదటి ఓవర్లోనే భారత్ ఓపెనర్ జైస్వాల్ తో పాటు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ వికెట్లు పడగొట్టింది. ఆ తరువాత రాహుల్, గిల్ తమ బ్యాటింగ్ తో గత 55 సంవత్సరాలలో అరుదైన ఘనత సాధించారు. 

 ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు. 55 సంవత్సరాల తర్వాత విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ 1970-71లో చివరిసారిగా ఈ ఘనత సాధించారు.

మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల వెనుకబడిన టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌లో చాలా పేలవంగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ డబుల్ షాకిచ్చాడు. క్రిస్ వోక్స్ మొదటి ఓవర్ నాల్గవ బంతికి యశస్వి జైస్వాల్ (0)ను, ఐదవ బంతికి సాయి సుదర్శన్ (0)ను ఔట్ చేశాడు. కానీ ఆ తర్వాత నాలుగో రోజు ఆట ముగిసే వరకు రాహుల్, గిల్ మరో వికెట్ పడకుండా చూసుకుంటేనే పరుగులు రాబట్టారు. 

కెఎల్ రాహుల్ 210 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత కెప్టెన్ గిల్ 167 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. నాల్గో టెస్ట్ చివరి రోజు ఆటలో వీరు సెంచరీలను పూర్తి చేయవచ్చు. భారత్ ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవకపోవచ్చు, కానీ ఓటమి నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ బ్యాటింగ్ చేయాలి. దాంతో నాల్గో టెస్టును డ్రాగా ముగించవచ్చు.

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన కెఎల్ రాహుల్ భారత్ తరపున ఈ ఘనత సాధించిన రెండవ ఓపెనర్ అయ్యాడు. గతంలో సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించాడు. రాహుల్ ఈ సిరీస్‌లో తన 3వ సెంచరీ దిశగా వెళ్తున్నాడు. అతను మొదటి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో, మూడవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశాడు. సిరీస్ లో రాహుల్ ఇప్పటివరకు 508 పరుగులు చేశాడు.

ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ 46 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టడానికి దగ్గరగా ఉన్నాడు. గిల్ ప్రస్తుతానికి 697 పరుగులు చేశాడు, ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. గవాస్కర్ 1978లో 732 పరుగులు చేశాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో మరో 36 పరుగులు జోడిస్తే 47 సంవత్సరాల నాటి గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టవచ్చు.

టెస్ట్‌లో 3వ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం

రాహుల్, గిల్ ఈరోజు మూడవ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం విషయంలో సచిన్, సౌరవ్ గంగూలీలను అధిగమించే అవకాశం ఉంది. 3వ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం చేసిన భారత జోడీ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీరు 2004లో 336 పరుగులు చేశారు. ఈ జాబితాలో ఐదవ స్థానంలో టెండూల్కర్, గంగూలీ ఉన్నారు, వీరు 1996లో 255 పరుగులు జోడించారు. గిల్, రాహుల్ ఆట తీరును చూస్తుంటే, ఈరోజు సచిన్, గంగూలీ రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget