![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
IND vs AUS 4th T20: భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల T20 సీరీస్లో యువ భారత్ సత్తా చాటింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకుంది.
![India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం India vs Australia 4th T20I Live Score IND beat AUS by 20 runs seal series win India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/bf44d1b0312dd7db0e966c24060bba5c1701451373033872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్(Bharat) వేదికగా ఆస్ట్రేలియా(Australia) తో జరుగుతున్న 5 మ్యాచ్ ల T20 సీరీస్లో(T20 Series) యువ భారత్ సత్తా చాటింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకొని T20 ప్రపంచ కప్ (T20 World Cup) కి ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయాగా, ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగు చేసింది. దీంతో యువ భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నాలుగవ t20 మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్.. రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించారు. పవర్ ప్లేలో ఆరు ఓవర్లలో 50 పరుగులు సాధించారు. యశస్వి జైస్వాల్ ఆరంభంలో దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్తో 37 పరుగులు చేసి యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. రుతురాజ్ అవుటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు పడడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ సిరీస్లో తొలిసారి బరిలోకి దిగిన శ్రేయస్స్ అయ్యర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. కేవలం ఏడు బంతులే ఎదుర్కొన్న అయ్యర్... ఎనిమిది పరుగులు చేసి సంఘా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కేవలం రెండే బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ ఒక్కే పరుగు చేసి అవుటయ్యాడు. 50 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పటిష్టంగా కనపడిన టీమిండియా 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది.
కానీ గత మ్యాచ్ సెంచరీ హీరో రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా సూపర్ ఫినిషర్గా మారిన రింకూ సింగ్తో కలిసి రుతురాజ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కానీ కీలక సమయంలో రుతురాజ్ అవుటయ్యాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్స్తో 32 పరుగులు చేసి రుతురాజ్... సంఘా బౌలింగ్లో అవుటయ్యాడు. దీంతో 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం జితేశ్ శర్మతో కలిసి రింకూసింగ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రింకూసింగ్ 29 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. జితేశ్ శర్మ కూడా 35 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
అనంతరం 174 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 154 పరుగులకే పరిమితం అయ్యింది. అక్షర పటేల్ సహా భారత బౌలర్లు సమిష్టిగా రాణించగా కంగారూలు విజయానికి 20 పరుగుల తోనే నిలచిపోయారు. ట్రావీష్ హెడ్ 31, మాథ్యూ 36 పరుగులతో రాణించారు, మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించలేదు. భారత్ బౌలర్ లలో అక్షర పటేల్ 3, దీపక్ 2 వికెట్లు తీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)