అన్వేషించండి

IND-W vs ENG-W : టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం , కొత్త చరిత్ర లిఖించిన భారత మహిళలు

India women vs England women: మహిళా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం నమోదైంది. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో టీమిండియాచరిత్ర సృష్టించింది.

మహిళా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే భారీ విజయం నమోదైంది. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో టీమిండియాచరిత్ర సృష్టించింది. ఏకంగా 347 పరుగుల తేడాతో బ్రిటీష్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. వుమెన్స్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. నాలుగు రోజులపాటు జరిగే...... టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంతకుముందు ఏ జట్టు ఇంత భారీ విజయాన్ని నమోదు చేయలేదు. ఈ మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో.... 428 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా  6 వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం... బ్రిటీష్‌ మహిళల జట్టును రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూల్చి... 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు నేలకూల్చి దీప్తి శర్మ ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా దీప్తి శర్మ ఎంపికైంది.

ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్ట్‌ ఆడుతున్న అరంగేట్ర బ్యాటర్ శుభా సతీష్‌ 76 బంతుల్లో 69 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్‌  99 బంతుల్లో 68 పరుగులతో రాణించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్ 81 బంతుల్లో 49 పరుగులు చేసిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అర్థసెంచరీకి కేవలం ఒక్క పరుగు ముందు అవుటై నిరాశ పరిచింది. కానీ యాస్తిర్‌ బాటియా 88 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 66 పరుగులు చేసి సత్తా చాటింది. వీరిద్దరూ భాగస్వామ్యంతో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 313 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ 67 పరుగులు చేసింది. 7 వికెట్లకు 410 పరుగులతో భారత్‌ తొలి రోజును ముగించింది. రెండో రోజు ఆట ప్రారంభించిన కాసేపటికే 428 పరుగులకు ఆలౌటైంది. దీప్తి 113 బంతుల్లో 67 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 7 పరుగులు మాత్రమే జోడించి దీప్తి వెనుదిరిగింది. ఎకిల్‌స్టోన్‌ ధాటికి టీమిండియా ఓవర్‌ నైట్‌ స్కోరుకు మరో పద్దెనిమిది పరుగులు మాత్రమే జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

అనంతరం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలుత పేసర్లు తర్వాత స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ బౌలింగ్‌కు వచ్చాక ఇంగ్లాండ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి.  దీప్తి, స్నేహ్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ 28 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ (5/7) స్పిన్‌ మాయలో చిక్కుకున్న ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్‌ రాణా (2/25) కూడా ఆకట్టుకుంది.
 ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఓపెనర్లు షెఫాలి, స్మృతి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ స్మృతి వికెట్‌తో భారత్‌ను ఎకిల్‌స్టోన్‌ తొలి దెబ్బ కొట్టింది. జెమీమా (27), హర్మన్‌ప్రీత్‌ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 133/6తో నిలిచిన జట్టును పూజ (17 బ్యాటింగ్‌)తో కలిసి హర్మన్‌ ఆదుకుంది. 133 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 186 పరుగులకు డిక్లేర్‌ చిసింది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు 479 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. మరోసారి దీప్తి శర్మ స్పిన్‌తో మాయ చేయడంతో ఇంగ్లాండ్‌ 131 పరుగులకే కుప్పకూలింది. దీప్తి నాలుగు వికెట్లతో రాణించింది. దీంతో 347 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World's Richest Cricketers 2026: పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!
పరుగుల వీరులే కాదు వ్యాపార సామ్రాజ్య అధిపతులు కూడా! కోహ్లీ, ధోనీ ఆస్తుల అసలు రహస్యం ఇదే!
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Virat Kohli Creates History: కోహ్లీ సరికొత్త హిస్టరీ -   క్వాలిఫైయర్ 1 లో సత్తా.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన రన్ మెషీన్
కోహ్లీ సరికొత్త హిస్టరీ -   క్వాలిఫైయర్ 1 లో సత్తా.. వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన రన్ మెషీన్
Rajat Patidar Scripts History: పతిదార్ వరల్డ్ రికార్డ్: క్వాలిఫయర్ 1 లో ఆర్‌సీబీ కెప్టెన్ బీభత్సం.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త మైలురాయి
పతిదార్ వరల్డ్ రికార్డ్: క్వాలిఫయర్ 1 లో ఆర్‌సీబీ కెప్టెన్ బీభత్సం.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త మైలురాయి

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget