అన్వేషించండి

IND Vs WI: భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం - టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇష్టానుసారం మార్పులు!

భారత్‌, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు.

ఇండియా, వెస్టిండీస్ రెండో వన్డేకు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత్‌కు మంచి ప్రారంభం లభించినా కేవలం 23 పరుగుల తేడాలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ (34: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు) టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. జేడెన్ సీల్స్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన శుభ్‌మన్ గిల్ ఫాంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. కైల్ మేయర్స్, జేడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్ ఇలా ప్రధాన బౌలర్లందరి బౌలింగ్‌లో ఫోర్లు సాధించాడు.

మోతీ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మొదటి బంతికి సింగిల్‌తో ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ సాధించాడు. అదే ఓవర్ ఐదో బంతికి శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేసిన మోతీ వెస్టిండీస్‌కు మొదటి వికెట్ అందించాడు. అక్కడి నుంచి భారత్ పతనం ప్రారంభం అయింది. తర్వాతి ఓవర్లోనే రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. భారీ షాట్ కొట్టబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఆలిక్ అథనజ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఆశ్చర్యకరంగా అక్షర్ పటేల్‌ను (1: 8 బంతుల్లో) టీమిండియా కీలకమైన సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపింది. ఇటీవల కాలంలో ఏ జట్టు అయినా చేసిన అత్యంత ఘోరమైన వ్యూహాత్మక తప్పిదం ఏదైనా ఉంటే ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే మరో మూడు నెలల్లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. సెకండ్ డౌన్‌లో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం గాయపడ్డాడు. వరల్డ్ కప్‌లో ఆడటం కూడా డౌటే. ఇలాంటి సమయంలో ఒక స్పెషలిస్టు బ్యాటర్‌ను సెకండ్ డౌన్‌లో పరీక్షించకుండా స్పిన్ ఆల్‌రౌండర్ అయిన అక్షర్ పటేల్‌ను పంపారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ అక్షర్ రాణించాడా అంటే అదీ లేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ మూడో వికెట్ కూడా కోల్పోయింది.

అనంతరం 24వ ఓవర్ ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా (7: 14 బంతుల్లో), 25వ ఓవర్ మొదటి బంతికి సంజు శామ్సన్ (9: 19 బంతుల్లో) అవుటయ్యారు. ఆ వెంటనే వర్షం పడటంతో ఆటకు అంతరాయం కలిగింది. అప్పటికి టీమిండియా 24.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (0: 0 బంతుల్లో) ఉన్నాడు.

వెస్టిండీస్ తుది జట్టు
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Andhra Pradesh Latest Updates: 2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
2029లో కూటమిగానే పోటీ- కలిసి నడవాలని నేతలకు చంద్రబాబు సూచన- లిక్కర్‌ వ్యాపారానికి దూరంగా ఉండాలని హెచ్చరిక
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Andhra BJP : మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ నేతలకు కీలక బాధ్యతలు - నాందేడ్ పరిశీలకుడిగా విష్ణువర్ధన్ రెడ్డి
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Embed widget