అన్వేషించండి

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, 1st ODI, Ekana Sports City: భారత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 పరుగులతో విజయం సాధించింది.

భారత్‌తో జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. అనంతరం భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తొమ్మిది పరుగులతో ఓటమి పాలైంది. సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే ఆదివారం రాంచీలో జరగనుంది.

అదరగొట్టిన మిల్లర్, క్లాసీన్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జానేమన్ మలన్ (22: 42 బంతుల్లో, మూడు ఫోర్లు), క్వింటన్ డికాక్ (48: 54 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అనంతరం జానేమన్ మలన్‌ను అవుట్ చేసి ఠాకూర్ ఇండియాకు మొదటి వికెట్ అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా (8: 12 బంతుల్లో, రెండు ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (0: 5 బంతుల్లో) విఫలం అయ్యారు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా అర్థ సెంచరీ ముంగిట అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 110 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్: 63 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), హెన్రిచ్ క్లాసీన్ (74 నాటౌట్: 65 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)జ దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడిని విడదీయడం సాధ్యం కాలేదు. అభేద్యమైన ఐదో వికెట్‌కు వీరు 106 బంతుల్లోనే 139 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో వీరు 55 పరుగులు చేశారు. దీంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

సంజు షో సరిపోలేదు
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఎనిమిది పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్ (4: 16 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (3: 7 బంతుల్లో) అవుటయ్యారు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ (19: 42 బంతుల్లో, ఒక ఫోర్), ఇషాన్ కిషన్ (20: 37 బంతుల్లో, మూడు ఫోర్లు) పరిస్థితిని కుదుట పరిచే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో వీరు మరీ నెమ్మదిగా ఆడటంతో కావాల్సిన రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు వీరిద్దరూ వెంట వెంటనే అవుటవ్వడంతో కష్టాలు మరింత పెరిగాయి.

ఆ తర్వాత సంజు శామ్సన్ (86 నాటౌట్: 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50: 37 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) వేగంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత అయ్యర్ అవుట్ కావడంతో శార్దూల్ ఠాకూర్ (33: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు చేయాల్సిన దశలో సంజు శామ్సన్ చెలరేగాడు. మొదటి రెండు ఓవర్లలో 28 పరుగులు రావడంతో విజయంపై ఆశలు పెరిగాయి. తర్వాతి రెండు ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే రావడంతో పాటు మూడు వికెట్లను కూడా భారత్ కోల్పోయింది. చివరి ఓవర్లో 30 పరుగులు కావాల్సిన దశలో సంజు శామ్సన్ 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో భారత్ 40 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Hyderabad News: పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Andhra Pradesh: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా  సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Hyderabad News: పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Andhra Pradesh: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా  సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Karate Kalyani: రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుపై కరాటే కళ్యాణి ఊహించని కామెంట్స్‌ - లావణ్య చాలా తప్పులు చేసింది, ఆమెకు సపోర్ట్‌ చేయను..
రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుపై కరాటే కళ్యాణి ఊహించని కామెంట్స్‌ - లావణ్య చాలా తప్పులు చేసింది, ఆమెకు సపోర్ట్‌ చేయను..
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Hero Vishal: ఫిల్మ్ ఛాంబర్‌తో గొడవ - నిర్మాతల మండలికి విశాల్‌ వార్నింగ్‌, ఏమన్నాడంటే..
ఫిల్మ్ ఛాంబర్‌తో గొడవ - నిర్మాతల మండలికి విశాల్‌ వార్నింగ్‌, ఏమన్నాడంటే..
Embed widget