![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs ENG Semi Final: ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్ చిత్తు ప్రపంచకప్ ఫైనల్లో భారత్
India vs England: టీ20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్లో భారత్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
![IND vs ENG Semi Final: ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్ చిత్తు ప్రపంచకప్ ఫైనల్లో భారత్ Ind vs Eng Semi Final Axar Patel Kuldeep Yadav Run Riot England 6 Down In Chase vs India T20 World Cup 2024 IND vs ENG Semi Final: ప్రతీకారం అంటే ఇలా ఉండాలి భయ్యా, ఇంగ్లాండ్ చిత్తు ప్రపంచకప్ ఫైనల్లో భారత్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/e131d6660002dbe244e75794c14119c217195188231571036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ind vs Eng Highlights: టీమిండియా (India)ప్రతీకారం తీర్చుకుంది. అది అలా ఇలా కాదు. 2022 ప్రపంచకప్లో తమకు ఎలా అయితే ఘోర పరాభవం ఎదురైందో... దానికి రెట్టింపుగా తిరిగి ఇచ్చేసింది. టీ 20 ప్రపంచకప్ (T20 World Cup) సెమీస్ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేసి.. ఘనంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసి 171 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్రిటీష్ జట్టును కేవలం 103 పరుగులకే కుప్పకూల్చింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్(England)ను... స్పిన్నర్లు చుట్టేశారు. ఏ బంతిని ఎలా ఆడాలో తెలీక సతమతమయ్యారు. సుడులు తిరుగుతున్న భారత బౌలర్లను ఎదుర్కోవడం బ్రిటీష్ బౌలర్ల వల్ల కాలేదు. ఈ ఘన విజయంతో టీమిండియా టీ 20 ప్రపంచకప్ ఫైనల్లోకి పూర్తి ఆత్మ విశ్వాసంతో అడుగుపెట్టింది. ఇక మిగిలింది తుదిపోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పొట్టి ప్రపంచకప్ను ఘనంగా పైకి లేపడమే.
కీలకమైన సెమీస్లో బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు రాణించారు. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించినా ఇంగ్లాండ్ ముందు మంచి టార్గెట్ ఉంచారు. సారధి రోహిత్ శర్మ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హిట్మ్యాన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్య భాయ్ కూడా 36 బంతుల్లో 47 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరిద్దరి భాగస్వామ్యం టీమిండియాను పటిష్ట స్థానంలో నిలిపారు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాదిన పాండ్యా 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్- రవీంద్ర జడేజా కూడా పర్వాలేదనించడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 171 పరుగులు చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)