అన్వేషించండి

India vs England 1st Test: మూడో రోజు లీడ్స్ పిచ్ స్వభావం మారుతుందా? విజయం ఎవరిని వరిస్తుంది?

India vs England 1st Test: భారత్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. మరి మూడో రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

IND vs ENG 1st Test Scorecard: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదటి టెస్టు మ్యాచ్ జూన్ 20 నుంచి లీడ్స్‌లో జరుగుతోంది. హెడ్డింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో మొదటి రోజున భారతీయ బ్యాట్స్‌మెన్‌లు పరుగులు సాధిస్తూ కేవలం 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేశారు. ఇక రెండో రోజున రిషబ్ పంత్ సెంచరీ సాధించినప్పటికీ, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు పూర్తిగా భారత బ్యాటింగ్‌పై ఆధిపత్యం చెలాయించారు. మొత్తం మీద, ఇప్పటివరకు మొదటి టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్‌లదే హవా నడిచింది, అయితే లీడ్స్ పిచ్ మూడో రోజు వచ్చేసరికి తన రూపు మార్చుకుంటుందని చరిత్ర చెబుతోంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు హెడ్డింగ్లీ క్రికెట్ గ్రౌండ్ పిచ్ చూసతే దానిపై గడ్డి కనిపించింది. హెడ్డింగ్లీ గ్రౌండ్ చీఫ్ రిచర్డ్ రాబిన్సన్ మాట్లాడుతూ, ప్రారంభంలో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అన్నారు, అయితే అతని అంచనాలకు విరుద్ధంగా టాస్ ఓడిపోయినప్పటికీ, టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తూ మంచి ప్రదర్శన ఇచ్చింది. పిచ్ పాతబడిన తర్వాత చదునుగా మారుతుందని, తద్వారా బ్యాటింగ్ చేయడం మరింత సులభం అవుతుందని రాబిన్సన్ అన్నారు.

మూడో రోజున పిచ్  మారుతుంది

రిచర్డ్ రాబిన్సన్ మాట్లాడుతూ, మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు చేయడం సులభం అవుతుందని స్వయంగా వెల్లడించారు. ఈ పిచ్ ఇంగ్లాండ్ 'బాజ్‌బాల్' శైలికి సహాయపడుతుందని కూడా ఆయన అన్నారు. అదే సమయంలో, ఈ పిచ్ భారతదేశ యువ బ్యాటింగ్ లైనప్‌కు కూడా సహాయకరంగా ఉండవచ్చు. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్,  మంచి వేగం లభిస్తుందని భావిస్తే, పిచ్ పాతబడిన కొద్దీ స్పిన్నర్లు మ్యాచ్‌పై తమ పట్టును సాధించవచ్చు.

టాప్-ఆర్డర్ మంచి స్కార్ చేసినప్పటికీ టీమ్ ఇండియా ఊహించని రికార్డును నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘటన ఏమిటంటే, ముగ్గురు భారతీయ బ్యాట్స్‌మెన్ వ్యక్తిగత సెంచరీలు సాధించారు, కానీ జట్టు ఇప్పటికీ భారీ స్కోరు నమోదు చేయడంలో విఫలమైంది, 471 పరుగులకు ఆలౌట్ అయింది. టెస్ట్ చరిత్రలో ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసినా అత్యల్ప జట్టు స్కోరు ఇది.

గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. 2016లో సెంచూరియన్‌లో ఇంగ్లాండ్‌పై మూడు సెంచరీలు చేసినప్పటికీ 475 పరుగులు చేశారు. ఆ స్థానంలోకి భారత్ చేరింది.   
యశస్వి జైస్వాల్: 101 (159 బంతులు) శుబ్‌మాన్ గిల్: 147 (227 బంతులు) రిషబ్ పంత్: 134 (178 బంతులు) ఈ ముగ్గురు ఇంగ్లాండ్ బౌలింగ్‌పై ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ చివరి ఏడు వికెట్లను కేవలం 41 పరుగుల తేడాలో కోల్పోయింది. లోయర్ ఆర్డర్ ప్రతిఘటన లేకుండా వికెట్లు సమర్పించుకున్నారు. జోష్ టంగ్, బెన్ స్టోక్స్ భారత్‌ను ఘోరంగా దెబ్బతీశారు.  చెరో 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌పై  ఇంగ్లాండ్ ఆశలు నిలిపారు.  

మొదటి టెస్ట్ మ్యాచ్ పరిస్థితిని పరిశీలిస్తే, టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్  సెంచరీలు సాధించారు. ఇండియా ఆల్‌అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్‌ జాక్ క్రాలేను కేవలం నాలుగు పరుగుల వద్దే పెవిలియన్ పంపించారు. తర్వాత వచ్చిన ఓలీ పోప్‌తో బెన్ డకెట్‌ను మంచి భాగస్వామ్యం నెలకొల్పుతున్న టైంలో బుమ్రా మరో అద్భుతం చేశాడు. 62 పరుగుల వద్ద బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు. దీంతో వీళ్ల భాగస్వామ్యానికి 122 పరుగుల వద్ద ఎండ్ కార్డు పడింది.   తర్వాత వచ్చిన జోరూట్‌తో కలిసి ఓలీ పోప్‌ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ను బుమ్రా మరోసారి షాక్ ఇచ్చాడు. జోరూట్‌ను అవుట్ చేశాడు. రెండు వందల పరుగులకు ఇంగ్లండ్ మూడు వికెట్లను కోల్పోయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget