అన్వేషించండి

India vs Bangladesh: తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు

IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది.

India vs Bangladesh Highlights, 2nd T20I: భారత(India) జోరు ముందు బంగ్లాదేశ్(Bangladesh) నిలవలేకపోయింది. టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి బంగ్లా పులులను మట్టికరిపించిన టీమిండియా... ఇప్పుడు టీ 20 సిరీస్‌ను కూడా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇప్పటికే తొలి టీ 20(T20) ను కైవసం చేసుకున్న భారత జట్టు... ఇప్పుడు రెండో టీ 20లోనూ ఘన విజయం సాధించింది. మూడు టీ 20ల సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలిన ఉండగానే 2 -0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ స్కోరు చూసి సగం ఓడిపోయిన బంగ్లాదేశ్‌.. బరిలోకి దిగాక పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 135 పరుగులకే పరిమితమైంది. దీంతో 86 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

 
భారత బ్యాటర్ల ఊచకోత
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అది ఎంత తప్పుడు నిర్ణయమో బంగ్లాకు అర్థమైంది. ఆరంభంలో బంగ్లా బౌలర్లు బాగానే రాణించారు. సంజు శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌(Surya Kumar yadav) 8 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత జట్టు 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో నితీశ్‌కుమార్‌ రెడ్డి(Nitish Kumar), రింకూసింగ్‌(Rinku singh) బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నితీశ్‌కుమార్‌ రెడ్డి బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన నితీశ్‌..  క్రీజులో కాస్త కుదురుకున్నాక మరింత ధాటిగా ఆడాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేసిన రింకూ.. 29 బంతుల్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుటయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ పాండ్యా కూడా మరోసారి బ్యాటు ఝళిపించాడు. 19 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. రియాన్‌ పరాగ్‌ ఆరు బంతుల్లో 15 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో  తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో భారత బ్యాటర్లు వెంటవెంటనే అవుట్ కావడంతో స్కోరు వేగం కాస్త మందగించింది. లేకపోతే భారత స్కోరు ఇంకా పెరిగి ఉండేది.
 
పోరాటం చేయకుండానే
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.... ఏ దశలోనూ టీమిండియాకు పోరాటం ఇవ్వలేదు. భారత బౌలర్లు రాణించడంతో   తొమ్మిది వికెట్ల నష్టానికి  కేవలం 135 పరుగులకే పరిమితమైంది.  దీంతో 86 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో రాణించిన నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లోనూ మెరిశాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మిగిలిన భారత బౌలర్లు కూడా రాణించడంతో బంగ్లా పరాజయం ఖాయమైంది. బంగ్లా బ్యాటర్లలో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మహ్మదుల్లా ఒక్కడే 41 పరుగులతో పర్వాలేదనిపించాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
India vs Bangladesh: తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata Passed Away | తుదిశ్వాస విడిచిన గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా | ABP Desamకశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
India vs Bangladesh: తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
తెలుగోడు మెరిశాడు, భారత్‌కు సిరీస్ అందించాడు
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Ratan Tata Passes Away: రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
రతన్ టాటా కన్నుమూత, ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన టాటా చైర్మన్
Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
Ratan Tata Health News: ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Embed widget