అన్వేషించండి

T20 World Cup 2022: భారత్ ఫైనల్ కు వెళ్లినట్లే- ఈ బ్యాడ్ లక్ లేదుగా!

T20 World Cup 2022: న్యూజిలాండ్, ఇంగ్లండ్.. ఇండియా, పాకిస్థాన్ సెమీఫైనల్స్ మ్యాచ్ లకు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. అందులో ఓ సెంటిమెంట్ చూసి మాత్రం టీమిండియా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. 

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ దశలో ఉంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ప్రాక్టీసులో మునిగి తేలుతున్నాయి. ఈ నాలుగింటిలో రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. అయితే భారత్ ఇప్పటికే ఆఖరి పోరుకు అర్హత సాధించినట్లు మన అభిమానులు ఊహించుకుంటున్నారు.  క్రికెట్ లో ప్రతి చిన్న విషయాన్ని గమనించే భారత అభిమానులు ఎవరైతే ఉన్నారో.. వాళ్లందరూ ఇప్పుడు టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు వెళ్లిందనే ఊహలో ఉన్నారు.  అందుకు కారణం అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో.

రిచర్డ్.. బ్యాడ్ లక్

అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. ఇతనికి, టీమిండియాకు విడదీయలేని అనుబంధం ఉంది. భారత్ ఆడిన చాలా మ్యాచులకు అతను అంపైరింగ్ చేశాడు. అయితే ఆ మ్యాచుల్లో చాలా వాటిలో టీమిండియాకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ముఖ్యంగా రిచర్డ్ అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచుల్లో ఫలితాలు భారత్ కు ప్రతికూలంగా వచ్చాయి. 2014 టీ20 ప్రపంచకప్ మొదలుకుని గతేడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దాకా.. ఐసీసీ ఈవెంట్స్ లో టీమిండియా నాకౌట్ దశకు వెళ్లిన ప్రతి మ్యాచులోనూ కెటిల్ బరో అంపైర్ గా ఉన్నాడు. బ్యాడ్ లక్కో మరేంటో తెలియదు కానీ.. ఈ మ్యాచులన్నీ భారత్ ఓడిపోయింది. 

కెటిల్ బరో అంపైరింగ్ చేసి భారత్ ఓడిపోయిన మ్యాచులు

  • 2014 శ్రీలంకతో టీ20 ప్రపంచకప్ ఫైనల్
  • 2016 వెస్టిండీస్ తో టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్
  • 2017 పాకిస్థాన్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
  • 2019 న్యూజిలాండ్ తో వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్.

 ఈ మ్యాచ్ అయితే అంత త్వరగా మరచిపోలేం. ఆఖర్లో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నప్పుడు ధోనీ రనౌట్ నిర్ణయం థర్డ్ అంపైర్ వద్దకు వెళ్లింది. ఈ అంపైర్ కెటిల్ బరోనే. ఆ సమయంలో అతను ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ వైరల్ గా మారాయి. 

ఈ మ్యాచులన్నింటిలో భారత్ పరాజయం పాలైంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లో గురువారం టీమిండియా, ఇంగ్లండ్ తో సెమీఫైనల్ లో తలపడనుంది. తాజాగా ఆ మ్యాచులకు ఐసీసీ ప్రకటించిన అంపైర్లలో రిచర్డ్ కెటిల్ బరో పేరు లేదు. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా కుమార ధర్మసేన, పాల్ రీఫిల్.. థర్డ్ అంపైర్ గా క్రిస్ గ్యాఫనీ.. ఫోర్త్ అంపైర్ గా రాడ్ టకర్ వ్యవహరించనున్నారు. టీమిండియాకు బ్యాడ్ లక్ గా పేరు తెచ్చుకున్న కెటిల్ బరోకు ఈ లిస్టులో చోటు దక్కకపోవటంతో భారత అభిమానులు ఆనందపడుతున్నారు. భారత్ సెమీఫైనల్ మ్యాచులో రిచర్డ్ అంపైర్ గా లేకపోవటంతో.. అభిమానులు సెంటిమెంట్ పేరుతో ఇప్పటికే టీమిండియా కచ్చితంగా ఫైనల్ కు వెళుతుందని నమ్ముతున్నారు. ఒకవేళ అదే నిజమై భారత్ ఫైనల్ కు వెళితే అక్కడ కూడా ఈ అంపైర్ రాకూడదని కోరుకుంటున్నారు. చూద్దాం.. అభిమానుల సెంటిమెంట్ నిజమవుతుందేమో. 

నవంబర్ 10 న భారత్- ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sugali Preethi case: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
Chandrababu Maritime Master Plan: ఏపీలో  పోర్టు ఆధారిత ఎకానమీ - త్వరలో లాజిస్టిక్ కార్పొరేషన్ - చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలో పోర్టు ఆధారిత ఎకానమీ - త్వరలో లాజిస్టిక్ కార్పొరేషన్ - చంద్రబాబు కీలక ప్రకటన
US Tariffs: నోబెల్ కోసం ట్రంప్ తిప్పలు..  మోదీతో బేరం..  ప్రధాని ఇచ్చిన ఆన్సర్ వల్లే అమెరికా టారిఫ్‌లు
ఆ ఫోన్ కాల్‌కు మోడీ ఇచ్చిన  ఒక్క ఆన్సర్ ట్రంప్‌కు  చిర్రెత్తిచ్చింది.. మనకు టారిఫ్‌ల మోత మోగించింది.
Vizag Latest News: వైజాగ్‌కు క్యూ కడుతున్న పార్టీలు - పూర్తి ఫోకస్ పెడుతున్న నేతలు! ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
వైజాగ్‌కు క్యూ కడుతున్న పార్టీలు - పూర్తి ఫోకస్ పెడుతున్న నేతలు! ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
Advertisement

వీడియోలు

MLC Kavitha Telangana Jagruthi BRS Suspension | కన్నకూతురినే కాదనుకున్న కేసీఆర్ | ABP Desam
MLC Kavitha Political Journey explained | లిక్కర్ స్కామ్ టూ పార్టీ సస్పెన్షన్ | ABP Desam
Kavitha Suspended From BRS | బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ | ABP Desam
Loss to BCCI | కేంద్రం డెసిషన్‌తో ఇండియన్ క్రికెట్‌కి 7వేల కోట్ల నష్టం
Sanju Samson vs Gambhir | కేసీఎల్‌లో పరుగులు సునామీ సృష్టిస్తున్న సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Preethi case: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం - సీబీఐతో సుగాలి ప్రీతి కేసు విచారణ !
Chandrababu Maritime Master Plan: ఏపీలో  పోర్టు ఆధారిత ఎకానమీ - త్వరలో లాజిస్టిక్ కార్పొరేషన్ - చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలో పోర్టు ఆధారిత ఎకానమీ - త్వరలో లాజిస్టిక్ కార్పొరేషన్ - చంద్రబాబు కీలక ప్రకటన
US Tariffs: నోబెల్ కోసం ట్రంప్ తిప్పలు..  మోదీతో బేరం..  ప్రధాని ఇచ్చిన ఆన్సర్ వల్లే అమెరికా టారిఫ్‌లు
ఆ ఫోన్ కాల్‌కు మోడీ ఇచ్చిన  ఒక్క ఆన్సర్ ట్రంప్‌కు  చిర్రెత్తిచ్చింది.. మనకు టారిఫ్‌ల మోత మోగించింది.
Vizag Latest News: వైజాగ్‌కు క్యూ కడుతున్న పార్టీలు - పూర్తి ఫోకస్ పెడుతున్న నేతలు! ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
వైజాగ్‌కు క్యూ కడుతున్న పార్టీలు - పూర్తి ఫోకస్ పెడుతున్న నేతలు! ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?
1 రూపాయి
1 రూపాయి "ఫ్రీడమ్‌ ప్లాన్‌" ను పొడిగించిన BSNL
Pawan Kalyan OG Glimpse: పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా... బర్త్‌డే పవన్‌ది... గ్లింప్స్‌ విలన్‌ది... చివర్లో కిక్కిచ్చే పవర్ స్టార్ లుక్కు!
పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా... బర్త్‌డే పవన్‌ది... గ్లింప్స్‌ విలన్‌ది... చివర్లో కిక్కిచ్చే పవర్ స్టార్ లుక్కు!
Lokesh Satire on YS Jagan: ఓరి నీ పాసుగాల.. ! ఇదేందయ్య… నేను యాడా సూడలా.. జగన్‌ను ర్యాగింగ్ చేసిన లోకేష్
ఓరి నీ పాసుగాల.. ! ఇదేందయ్య… నేను యాడా సూడలా.. జగన్‌ను ర్యాగింగ్ చేసిన లోకేష్
Tesla Fail: టెస్లాను చూసేవాళ్లే కాని కొనేవాళ్లు లేరే -ఇండియాలో మస్క్‌‌కు షాక్ !
టెస్లాను చూసేవాళ్లే కాని కొనేవాళ్లు లేరే -ఇండియాలో మస్క్‌‌కు షాక్ !
Embed widget