![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ODI Worldcup 2023: ఆగస్టు 15 స్పెషల్! ప్రపంచకప్ టికెట్ల రిజిస్ట్రేషన్ మొదలు!
ODI Worldcup 2023: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్! ఐసీసీ వన్డే ప్రపంచకప్ టికెట్ల రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచే మొదలవుతోంది.
![ODI Worldcup 2023: ఆగస్టు 15 స్పెషల్! ప్రపంచకప్ టికెట్ల రిజిస్ట్రేషన్ మొదలు! icc odi world cup 2023 tickets registration starts from 15 august afternoon check details ODI Worldcup 2023: ఆగస్టు 15 స్పెషల్! ప్రపంచకప్ టికెట్ల రిజిస్ట్రేషన్ మొదలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/01/6ea7ae5eaf0b1145c9ca2b5834b9e7901690910122112567_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ODI Worldcup 2023:
క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్! ఐసీసీ వన్డే ప్రపంచకప్ టికెట్ల రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచే మొదలవుతోంది. ఆగస్టు 15 మధ్యాహ్నం 3:30 గంటలకు టికెట్లపై ఆసక్తి ఉందంటూ ఫ్యాన్స్ నమోదు చేసుకోవచ్చు.
అభిమానులు https://www.cricketworldcup.com/register వెబ్సైట్లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందరికన్నా ముందు టికెట్ల సమాచారం మీకే వస్తుంది. దాంతో సులువగా టికెట్లు పొందొచ్చు. అలాగే అభిమానుల నుంచి డిమాండ్ను అంచనా వేయడానికి నిర్వాహకులకు వీలవుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లు, ఆటగాళ్లు తలపడే ఈ పోటీలను వీక్షించేందుకు ఫ్యాన్స్ నుంచి ఎంత పోటీ ఉంటుందో తెలిసిందే.
మెగా టోర్నీకి సరిగ్గా 40 రోజుల ముందు, అంటే ఆగస్టు 25 నుంచి టికెట్ల విక్రయం చేపడతామని ఐసీసీ గతంలో తెలిపింది. రీషెడ్యూలును ప్రకటించిన తర్వాత ఈ విషయం చెప్పింది.
టీమ్ఇండియా మినహా మిగతా అన్ని మ్యాచుల టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి మొదలవుతుంది. మొదట వార్మప్ ఆ తర్వాత లీగ్ మ్యాచుల టికెట్లు అమ్ముతారు. ఆపై ఆరు దశల్లో టీమ్ఇండియా తలపడే మ్యాచులు టికెట్లు ఇస్తారు. సెప్టెంబర్ 30న గువాహటిలో ఇంగ్లాండ్, అక్టోబర్ 3న తిరువనంతపురంలో శ్రీలంక లేదా నెదర్లాండ్స్తో రోహిత్ సేన వార్మప్ మ్యాచులు ఆడుతుంది. మొదట ఈ పోటీల టికెట్లు అమ్ముతారు.
ఆగస్టు 25: టీమ్ఇండియా మినహా మిగతా జట్ల వార్మప్, లీగ్ మ్యాచులు టికెట్ల విక్రయం
ఆగస్టు 30: గువాహటి, తిరువనంతపురంలో టీమ్ఇండియా ఆడే వార్మప్ మ్యాచుల టికెట్ల విక్రయం
ఆగస్టు 31: ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్తో టీమ్ఇండియా మ్యాచుల టికెట్ల విక్రయం
సెప్టెంబర్ 1: న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో టీమ్ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 2: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్తో టీమ్ఇండియా మ్యాచుల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 3: అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్ x పాకిస్థాన్ మ్యాచు టికెట్ల అమ్మకాలు
సెప్టెంబర్ 15: సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచు టికెట్ల అమ్మకాలు
'ఆగస్టు 15న టికెట్ల విక్రయానికి ముందు అభిమానులు https://www.cricketworldcup.com/registerలో తమ ఆసక్తిని తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు అందరికన్నా ముందుగా వారికి టికెట్ల అమ్మకాలపై సమాచారం వస్తుంది. వన్డే ప్రపంచకప్ మ్యాచులు ప్రత్యక్షంగా చూసేందుకు వీలవుతుంది. ఆటను ఆస్వాదించొచ్చు' అని ఐసీసీ తెలిపింది.
'ఐసీసీ వన్డే ప్రపంచకప్ టికెట్ల విక్రయ సమాచారం అందరికన్నా ముందుగా తెలుసుకొనేందుకు వచ్చే వారమే పేర్లు నమోదు చేసుకోవాలని లక్షల మంది అభిమానులను కోరుతున్నాం' అని ఐసీసీ ఈవెంట్స్ అధినేత క్రిస్ టెట్లీ అన్నారు. 'సవరించిన క్రికెట్ మ్యాచుల వేళలను ప్రకటించడంతో ఆటగాళ్లు, అభిమానులు సాధ్యమైనంత ఎక్కువగా వన్డే క్రికెట్ను ఆస్వాదించగలరు' అని పేర్కొన్నారు.
ప్రస్తుతం టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. దాంతో యువకులతో కూడిన జట్టే వెస్టిండీస్తో టీ20 సిరీస్ ఆడింది. 2-3 తేడాతో ఓటమి పాలైంది. మరో రెండు రోజుల్లో ఐర్లాండ్ పర్యటన మొదలవుతుంది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని యువ జట్టు మలహైడ్ వేదికగా మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది. ఈ సిరీసులో అంతా కుర్రాళ్లే ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. ఐర్లాండ్ సిరీస్ తర్వాత ఆసియా కప్ మొదలవుతుంది.
Also Read: హార్దిక్ పాండ్యా ఆటతీరు భారత జట్టుకు సమస్యే - స్పందించిన వసీం జాఫర్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)