అన్వేషించండి

ODI World Cup 2023: ఐసీసీ ట్రోఫీ నెగ్గడం అంత ఈజీ కాదు! వన్డే వరల్డ్ కప్ పై స్పిన్నర్ అశ్విన్

నాలుగేండ్లకోసారి జరిగే వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది భారత్‌లో జరుగనుంది. అయితే ప్రపంచకప్ గెలవడం అంత ఈజీ కాదని అంటున్నాడు అశ్విన్.

ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కౌంట్ డౌన్ ఇప్పటికే మొదలైంది. స్వదేశంలో జరుగబోయే వన్డే ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగబోతున్న  టీమిండియా.. పదేండ్ల తర్వాత  ఐసీసీ ట్రోఫీని ఒడిసిపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  వరల్డ్ కప్‌కు మరో రెండు నెలలే సమయం ఉండటంతో  ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. అయితే  వరల్డ్ కప్ గెలిచినా ఓడినా  పాజిటివ్ మైండ్‌తో ఉండటం ముఖ్యమంటున్నాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఐసీసీ ట్రోఫీ నెగ్గడం అంత ఈజీ కాదని  కూడా  వ్యాఖ్యానించాడు. 

ఇటీవలే వెస్టిండీస్‌‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో  12 వికెట్లు పడగొట్టి స్వదేశానికి చేరిన అశ్విన్ తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వరల్డ్ కప్, టీమిండియా ప్రిపరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ మాట్లాడుతూ.. ‘భారత్‌‌లో జరుగబోయే ప్రపంచకప్‌లో పాల్గొనబోయే జట్లన్నీ తాము ట్రోఫీని గెలిచేందుకే  బరిలోకి దిగుతాయి.  భారత్ కూడా అదే దృక్ఫథంతో ఉంటుంది.  ఒకవేళ మనం  ప్రపంచకప్ గెలవకపోయినా  ప్రపంచమేమీ ఆగిపోదు. మనం ముందుకు సాగాల్సిందే. ఒకవేళ గెలిస్తే ఆటగాళ్లను అభినందిద్దాం... 

అభిమానులను నా విన్నపం ఏంటంటే.. ప్రపంచకప్‌ ఆడబోయే ముందు టీమిండియాకు పాజిటివ్ దృక్పథాన్ని ఇవ్వండి.  ప్రపంచకప్ గెలవడం అంత ఈజీ కాదు.  గతంలో టీమిండియా చాలాసార్లు  ఐసీసీ ట్రోఫీలలో సెమీస్ వరకూ వెళ్లగలిగింది. దాదాపు అన్ని మేజర్ ఈవెంట్స్‌లో జట్టు బాగా ఆడింది. కానీ ఆరోజు (సెమీస్ మ్యాచ్‌లలో) మన రోజు బాగోలేదు.  మన రోజు బాగోలేనప్పుడు మనం ఏం చేయగలం..? మనకు ఇప్పుడు  చాలా పాజిటివిటీ కావాలి.  మనను చూసి టీమిండియా ఆటగాళ్లు కూడా  ‘జనం మా వెంట ఉన్నారు’ అని ఫీల్ అవ్వాలి. వాళ్ల ఆటను వాళ్లను ఆడనిస్తే  ఎవరైనా సక్సెస్ అవుతారు...’అని చెప్పుకొచ్చాడు. 

టీమిండియా చాలా  హార్డ్ వర్కింగ్ టీమ్ అని అందులో సందేహమే లేదని అశ్విన్  తెలిపాడు. జిమ్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆటగాళ్లు గంటలకు గంటలు కష్టపడతారని, ప్రపంచంలో టీమిండియా ఆటగాళ్లంతా కష్టపడే టీమ్ మరొకటి లేదని  అశ్విన్  పునరుద్ఘాటించాడు. అయితే టీమ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వ్యాఖ్యలు కపిల్ దేవ్‌కు కౌంటర్ గానే చేసినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓడిన తర్వాత కపిల్ దేవ్.. భారత జట్టులో అహంకారం ఎక్కువైందని, ఎవరూ సలహాలు తీసుకోవడం లేదని, అన్నీ తమకే తెలుసుననే భావనలో ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  దీనికి నిన్నే రవీంద్ర జడేజా కూడా క్లారిటీ ఇచ్చాడు. టీమిండియాలో ఎవరికీ అహంకారం లేదని అందరూ టీమ్ కోసమే ఆడతారని  చెప్పాడు. ఇప్పుడు అశ్విన్ కూడా కపిల్ వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా ఆయనకు కౌంటర్‌గానే ఇలాంటి కామెంట్స్ చేశాడని  నెటిజన్స్ వాపోతున్నారు.  

ఇక వన్డే వరల్డ్ కప్ విషయానికొస్తే అక్టోబర్ 5 నుంచి మొదలుకాబోయే ఈ మెగా టోర్నీలో భారత జట్టు  తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న  చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Embed widget