అన్వేషించండి

Gautam Gambhir: 12 ఏళ్ల తరువాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి - కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం

Ind vs Nz 3rd Test | స్వదేశంలో భారత్ చాలాకాలం తరువాత టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వరుస రెండు టెస్టుల్లో ఓడటంతో కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

coach Gautam Gambhirs Strict action After Test series Loss | IND vs NZ | భారత గడ్డపై సిరీస్ అంటే.. అందులోనూ టెస్ట్ సిరీస్ అంటే దాదాపు అన్ని పెద్ద జట్లూ కాస్త భయంతో వచ్చేవి. ఎందుకంటే సొంతగడ్డపై గత దశాబ్దం నుంచి భారత్ కు అలాంటి ట్రాక్ రికార్డులు ఉన్నాయి. కానీ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో సిరీస్ ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. స్వదేశంలో బలమైన  జట్టుగా ఉన్న టీమిండియా టెస్టులను కనీసం డ్రా చేసుకోలేని పరిస్థితి. అందులోనూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఓడిపోవడం అటు బీసీసీఐ పెద్దలను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. 

12 ఏళ్ల తరువాత సొంతగడ్డమపై భారత్ టెస్ట్ సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ చేతిలో మరో టెస్టు ఉండగానే 2-0 ఓటమితో దారుణంగా విఫలమైంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కు ఇది ఊహించని ఫలితమనే చెప్పాలి. ఆట పట్ల సీరియస్ గా ఉండే గంభీర్ కోచ్ గానూ అలాగే ఉండాలని భావిస్తాడు. కానీ కివీస్ చేతిలో టెస్టు సిరీస్ వైఫల్యంతో సీనియర్ ఆటగాళ్లకు కోచ్ గంభీర్ షాకిచ్చాడు. వారికి ఉన్న ఆప్షనల్ ట్రైనింగ్ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం మూడో టెస్టులోనైనా భారత్ నెగ్గి ఓటమి అంతరాన్ని తగ్గించాలని, లేకపోతే పరిస్థితి మరీ చేయి దాటి పోతుందని హెడ్ కోచ్ గంభీర్ ఆలోచన. నవంబర్ 1 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.

టెస్ట్ సిరీస్ ఓటమితో గంభీర్ కీలక నిర్ణయం
స్వదేశంలో టెస్టులు నెగ్గకపోయినా.. ప్రత్యర్థిని మాత్రం ముప్పుతిప్పలు పెట్టి మ్యాచ్ లు డ్రా చేసుకునేది భారత్. గత దశాబ్దం నుంచి విజయాలే ఎక్కువ. కానీ కివీస్ తో టెస్టు సిరీస్ ఓటమితో గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీనియర్ ఆటగాళ్లకు ఉన్న ఆప్షనల్ ట్రైనింగ్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. సిరీస్ ప్రారంభానికి ముందు జట్లు ప్రాక్టీస్ చేస్తుంటాయి. వీటిలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి సీనియర్, స్టార్ ఆటగాళ్లకు ఈ ట్రైనింగ్ సెషన్ నుంచి మినహాయింపు ఉండేది. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూ వాళ్లు గాయపడితే అసలుసిసలైన పోరులో జట్టుకు నష్టం జరుగుతుందని బీసీసీఐ పెద్దల అభిప్రాయం. ఆ సమయంలో ఈ సీనియర్ స్టార్ ప్లేయర్లు వ్యక్తిగత పనులు ఉంటే చూసుకునేవారు. కానీ తాజా ఓటమితో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ సెషన్ కు తప్పనిసరిగా హాజరు కావాలని టీమ్ మేనేజ్ మెంట్ తేల్చేసింది. 

అక్టోబర్ 30, 31 తేదీలలో దీపావళి సమయంలో రెండు రోజులపాటు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ కు హాజరు కావాలని గంభీర్ నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని వాంఖండేలో నవంబర్ ఒకటో తేదీన చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇందులోనైనా గెలిచి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను మెరుగు చేసుకోవాలని భారత కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. దాంతో ఆప్షనల్ ట్రైనింగ్ రద్దు చేసినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. 
  Also Read: IND Vs NZ 2nd Test: 12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్! 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget