అన్వేషించండి

IPL-2021: సెప్టెంబరు 19 నుంచి IPL రీస్టార్ట్... తొలి మ్యాచ్ MIvCSK మధ్య

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుండగా.. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది.

కరోనాన కారణంగా ఈ ఏడాది IPL సగంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మిగతా సీజన్ గురించి బీసీసీఐ అధికారికంగా ఫ్రాంఛైజీలకు మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. 


IPL-2021: సెప్టెంబరు 19 నుంచి IPL రీస్టార్ట్... తొలి మ్యాచ్ MIvCSK మధ్య

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుండగా.. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. ఈ మేరకు ఫ్రాంఛైజీలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా మెయిల్ పంపినట్లు సమాచారం. 

ఐపీఎల్ జట్లలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఐపీఎల్ 2021 సీజన్‌ని మధ్యలో బీసీసీఐ నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. అప్పటికి 29 మ్యాచ్‌లు మాత్రమే ముగిశాయి. దాంతో.. మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే అధికారింగా బీసీసీఐ ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజులకే యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది.

సెప్టెంబరు 19న ముంబయి, చెన్నై మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా.. క్వాలిఫయర్-1 మ్యాచ్ అక్టోబరు 10న, ఎలిమినేటర్ అక్టోబరు 11న, క్వాలిఫయర్-2 అక్టోబరు 13న, ఫైనల్ మ్యాచ్ అక్టోబరు 15న జరగనుంది. త్వరలోనే మ్యాచ్‌ల వారిగా షెడ్యూల్‌ని ఐసీసీ ప్రకటించనుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 9న మొదలైన 14వ సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి బయోబుడగలో పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. దాంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత సెప్టెంబర్‌-అక్టోబర్‌లో యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ, ఐపీఎల్‌ పాలకమండలి కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. 

టోర్నీ వాయిదాపడేసరికి మొత్తం 29 మ్యాచ్‌లు జరగ్గా అందులో దిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌లో నిలిచింది. ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతోనే మూడో స్థానంలో తర్వాత ముంబయి 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచాయి. 

ఇప్పటి వరకు ట్రోఫీ అందుకోని కోహ్లీ జట్టు... ఎలాగైనా టోర్నీ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోపక్క సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టోర్నీ మధ్యలో కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్ చేసింది. మరి, ఏ జట్టు రాణించి ఈ ఏడాది టోర్నీ విజేతగా నిలుస్తుందో చూడాలంటే... ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ట్రోఫీ గెలిచి IPL కెరీర్‌ని ధోనీ గొప్పగా ముగించాలనుకుంటున్నాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించవచ్చా? పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Hyderabad drugs case: కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
Nepal Gen Z outcry: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
Tesla drops: అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
Adilabad Cement Factory: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
Embed widget