అన్వేషించండి

Vidura Niti: విదుర నీతి అనుస‌రిస్తే ఆయుష్షు పెరగడం ఖాయం

Vidur niti in telugu : మహాభారతంలో పాండవులు, కౌరవులు.. విదురుడు చెప్పిన నీతి మాటలు వింటే 18 రోజుల కురుక్షేత్ర మహాయుద్ధం జరిగి ఉండేదా? విదుర నీతిని పాటిస్తే ఆయుష్షు పెరుగుతుంది.

Vidur niti in telugu : విదురుడు ధ‌ర్మానికి మాన‌వ‌ అవతారంగా పేరొందాడు. ఆయ‌న‌ తన జీవితమంతా ధర్మ మార్గంలో గడిపింది. పాండవులు- కౌరవులు ఇద్దరికీ ధర్మ మార్గాన్ని అనుసరించమని విదురుడు బోధించాడు. కానీ కౌరవులు విదురుడి మాట వినలేదు. ఆయన మాటలను ఎప్పుడూ ఖండించేవారు. ఆఖరి రోజుల్లో కౌరవులు విదురుడు మాట వినకుండా తప్పు చేశామని అనుకున్నారు కానీ అప్పటికే సమయం మించిపోయింది.

విదుర నీతి

కలియుగంలో కూడా విదురుడి మాటలు అంతే ముఖ్యమైనవి. విదురుడు మానవ జీవితానికి అవసరమైన ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. ఆయ‌న సూత్రాలను విదుర నీతి అంటారు. అతని సూత్రాలు మహాభారతం నుంచి కలియుగం వరకు విస్తృతంగా వ్యాపించాయి. విదుర‌ నీతి ప్రకారం, ఒక వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తే, అతని ఆయుష్షు తగ్గిపోతుంది. ఇంతకీ కలియుగానికి అనుకూలమైన విదురుడి విధానాలు ఏమిటి.?

విదుర నీతి ప్రకారం ఈ పనులు చేయవద్దు

విదురుడు తన నీతి శాస్త్రంలో అసభ్యకరంగా మాట్లాడే వారితో వ్యవహారాలు కూడ‌ద‌ని చెప్పాడు. ఒక వ్యక్తి మరొకరితో ఎలా వ్యవహరించాలో ముందుగా ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని చెబుతాడు. లేదంటే ఈ ర‌క‌మైన వ్య‌వ‌హార శైలితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించాడు. ఒక వ్యక్తి అవసరమైనంత వరకు మాట్లాడాలి. అవసరానికి మించి మాట్లాడితే ఆయుష్షు కూడా తగ్గిపోతుందని విదుర‌ నీతి చెబుతోంది.

Also Read : ఈ ఐదు మీ దిన‌చ‌ర్య‌లో భాగ‌మైతే మీ పేరు, ప్ర‌తిష్ఠ‌లకు తిరుగుండదు

కోపాన్ని అదుపులో ఉంచుకోండి

మితిమీరిన కోపంతో ఉన్నవారికి కూడా తక్కువ ఆయుష్షు ఉంటుందని విదురుడు చెబుతాడు. ఎక్కువగా కోపం తెచ్చుకునే వ్యక్తి భవిష్యత్తులో చెడు పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చ‌రించాడు. ఒక వ్యక్తి  కోపాన్ని గ్రంథాల్లో నరక ద్వారం అంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని, ఎప్పుడూ ఓపికగా ఉండమని విదురుడు చెబుతాడు. విపరీతమైన కోపం ఉన్నవారు నరకానికి వెళ్తారని, వారి ఆయుష్షు కూడా తగ్గిపోతుందని తెలిపాడు.

దురాశ, స్వార్థాన్ని వీడండి

దురాశ, స్వార్థం కార‌ణంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని తగ్గించుకుంటాడు అని కూడా విదురుడు చెప్పాడు. అత్యాశ క‌లిగిన వారు, స్వార్థపరులు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వారు చేసే పనికి మరొకరు బాధపడినా, విసుగు చెందినా పర్వాలేదు, త‌మ‌కు మేలు క‌లిగితే చాలని కోరుకుంటారు. అలాంటి వారి ఆయుష్షు రోజురోజుకూ తగ్గిపోతోంది. అత్యాశ క‌లిగిన‌వారు, స్వార్థపరులు ఇతరులకు హాని చేయడానికి వెనుకాడ‌రు. దీనికి మనం మహాభారత‌మే చక్కని ఉదాహరణ. ఇలాంటి భావాలు మహాభారత యుద్ధానికి  దారితీశాయి. ఈ భావోద్వేగాలు ఒక వ్యక్తి ఆయుష్షును తగ్గిస్తాయి.

ఇతరులపై అధికారం చెలాయించవద్దు

మన గురించి మనం గర్వపడటం వల్ల ప్రయోజనం లేదు. అలా కాకుండా ఎదుటివారు మన గురించి గర్వపడేలా పనులు చేయాలని విదురుడు సూచించాడు. ఎప్పటికీ పాలకుడిలా భావించ‌కూడదు.  మనల్ని మనం సేవకునిగా భావించి ఇతరులకు మేలు చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. లేకుంటే ఆయుష్షు రోజురోజుకూ తగ్గిపోతుందని విదురుడు పేర్కొన్నారు.

‘విరూపాక్ష’కూ ఓ ఆలయం ఉంది, ఆ రహస్యాన్ని బ్రిటీషర్లు కూడా తెలుసుకోలేకపోయారు - ఏమిటా వింత?

త్యాగం, అంకిత భావం ఉండాలి

విదుర నీతి ప్రకారం, ఒక వ్యక్తి త్యాగం, అంకిత భావాన్ని కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించాలి. లేనిదానిని కోరుకునే బదులు, ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. ఏమీ లేని వారి గురించి ఆలోచించండి, దేవుడు నాకు సంతోష‌క‌ర‌మైన జీవితం ఇచ్చాడ‌ని ఆనందించండి. ఇతరులను బాధపెట్టే బదులు వారిని సంతోషపెట్టాలి. ఈ భావం లేనివారు వీలైనంత త్వరగా జీవితాన్ని విడిచిపెడతారని విదుర నీతి పేర్కొంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.