Srisailam Dhuli Darshan : శ్రీశైలంలోనే ధూళి దర్శనం ఎందుకు? ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఆంతర్యం ఏంటి?
Maha Shivaratri 2026: శరీరం అసౌచం అయితేనేం ఆ భోళాశంకరుడిని దర్శించుకునేందుకు మనసులో భక్తి ఉంటే చాలు..శ్రీశైలం ధూళి దర్శనం వెనుకున్న ఆంతర్యం ఇదే..ఇంతకీ ఈ ధూళి దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

Maha Shivaratri Srisailam Dhuli Darshan
శ్రీశైలం ధూళి దర్శనం ఎందుకు అత్యంత విశిష్టమైనది?
శ్రీశైలంలో ధూళి దర్శనం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
ఇతర ఏ ఆలయంలోనూ లేనివిధంగా శ్రీశైలంలోనే ఎందుకు ధూళి దర్శనం ఉంటుంది?
ధూళి దర్శనం వెనుకున్న ఆంతర్యం ఏంటి?
శ్రీశైలం ధూళి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ఇతర ఏ ఆలయంలోనూ లేని విధంగా శ్రీశైలంలోనే ధూళి దర్శనానికి అనుమతిస్తారు. కార్తీకమాసం, మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా ఏ ఆలయంలో అయినా స్నానం లేకుండా, శుచిగా లేకుండా దర్శనానికి వెళ్లలేరు..కానీ శ్రీశైలంలో అలా కాదు.. స్నానంతో పనిలేదు..ఎంత దూరం నుంచి వెళ్లినా, శరీరం అసౌచంగా ఉన్నా...వళ్లంతా దుమ్ము ధూళి నిండి ఉన్నా అలా మల్లికార్జునుడి దర్శనానికి వెళ్లిపోవచ్చు. నేరుగా శివిలంగాన్ని స్పర్శించి తలపెట్టి మొక్కుకోవచ్చు. ఇదే ధూళి దర్శనం అని పిలుస్తారు.
శ్రీశైలం మల్లన్న భక్తుల శరీర శుద్ధి, అసౌచాన్ని పరిగణలోకి తీసుకోడు..మనసు నిండా భక్తి నింపుకుని వచ్చినవారిని భక్తుడిగా అంగీకరిస్తాడు. ప్రయాణంలో ధుమ్ము, ధూళి కొట్టుకుపోయి వచ్చనా సరే తనను తాకి దర్శించుకునే అవకాశాన్నిస్తాడు. ఇది ఆయన భక్త వాత్సల్యానికి ప్రతీక
ధూళి దర్శనం ఎప్పటి నుంచి మొదలైంది?
అప్పటి రోజుల్లో ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. తెలుగు రాష్ట్రాలతో పాటూ పక్కనున్న కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు కాలినడకన వచ్చేవారు. అంతదూరం నుంచి వచ్చిన భక్తులు ఆ కష్టాన్ని మర్చిపోయేందుకు..నేరుగా స్వామివారిని చేరుకునేందుకు మొదలైన సంప్రదాయం ఇది. ఇది భక్తి తీవ్రతను, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది
మల్లికార్జున జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే దగ్గర కొలువై ఉండడంతో శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ లేదనే నమ్మకం ఉంది.
ధూళి దర్శనం ద్వారా స్వామివారిని స్పర్శించడం వలల సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం
ధూళి దర్శనం శ్రీశైలంలోనే ఉండటానికి కారణం?
పరమేశ్వరుడు నివాసం ఉండేది స్మశానంలో..ఆయన శరీర శుద్ధి కన్నా మనఃశుద్ధితో ఉండేవారినే భక్తులుగా స్వీకరిస్తాడు.
ఇక ఇక్కడ కొలువైన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవది. దక్షయజ్ఞంలో సతీదేశి దేహత్యాగం చేసినప్పుడు ఆ శరీరాన్ని విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించంగా ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలు. శ్రీశైలంలో సతీదేవి మెడ భాగం పడిందని పురాణాల్లో ఉంది. అందుకే ఇది అత్యంత ముఖ్యమైన శక్తిపీఠంగా భావిస్తారు. శరీరానికి గొంతు ఎంత ముఖ్యమో శక్తిపీఠాల్లో శ్రీశైలానికి అంతే ప్రాధాన్యత ఉంది.
అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు అమ్మవారు భ్రమర (తేనెటీగలు) రూపంలో వచ్చి రాక్షస సంహారం చేశారు. ఆ తర్వాత భ్రమరాంబికగా వెలిశారు. ఆలయం బయట కుడివైపు గోడకు చెవి ఆన్చితే భ్రమరగీతం ( తేనేటీగల ఝుంకారం) వినిపిస్తుందట. అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారని చెప్పేందుకు ఇదే నిదర్శం అంటారు భక్తులు.
చాళుక్యులు, రెడ్డిరాజులు, విష్ణు కుండినుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది..ఆ తర్వాత విజయనగర రాజులు, కృష్ణదేవరాయలు వంటి రాజులు గోపురాలు మండపాలు నిర్మించి అభివృద్ధి చేశారు.
Before You Go
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















