అన్వేషించండి

Valmiki Jayanti 2024 : అక్టోబరు 17 వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి - రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!

Valmiki Jayanti : ఆశ్వయుజమాసం పౌర్ణమి రోజు వాల్మీకి జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబరు 17న పౌర్ణమి తిథి వచ్చింది. ఈ ఏడాది నుంచి వాల్మీకి జయంతిని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది

Valmiki Jayanti 2024 Date: వాల్మీకి మహర్షి పుట్టుక గురించి స్పష్టమైన ఆధారాలు లేవు కానీ కశ్యపుడు - అదితి కుమారుల్లో ఒకరైన వరుణ్ - చార్సి దంపతులకు జన్మించిన కుమారుడు అని చెబుతారు. వాల్మీకి బ్రహ్మ అంశలో జన్మించాడని కొందరు చెబుతారు. దారి దోపిడీలు చేస్తూ, జంతువులును వేటాడి వధించేవాడని.. నారదమహర్షి బోధనతో తపస్సుచేసుకునేందుకు ఉపమక్రమించాడు. ఏళ్ల తరబడి రామనామం జపిస్తూ తపస్సులో ఉండిపోవడంతో చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి. పుట్టలను వల్మీకం అంటారు.. అలా పుట్టల నుంచి బయటకు రావడంతో వాల్మీకి అని పిలుస్తారు.   

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!

అరణ్యవాసం , రావణ సంహారం తర్వాత సీత, లక్ష్మణుడితో కలసి శ్రీరామచంద్రుడు అయోధ్య చేరుకుంటాడు. రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఆ సమయంలో రాజ్యంలో ప్రజలు కొందరు..లంకలో ఉండి వచ్చిన సీతను రామయ్య ఏలుకుంటున్నాడని మాట్లాడుతారు. ఆ సంగతి తెలిసిన రాముడు సీతమ్మను అడవిలో విడిచిపెట్టి రమ్మని సోదరుడిని ఆజ్ఞాపిస్తాడు. ఈ సమయంలో సీతమ్మకు ఆశ్రయం ఇచ్చింది వాల్మీకి మహర్షినే. లవకుశలు అక్కడే జన్మించారు. 

పూజనీయ గ్రంధం రామాయణం వాల్మీకి మహర్షి రచించారు. రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగా..దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహర్షిని ఆదికవిగా చెబుతారు. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి పేర్కొన్నారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన రామావతారం గురించి రాసిన ఈ గ్రంధంలో  ఓమనిషి నైతిక జీవితాన్ని ఎలా గడపాలో మార్గనిర్దేశం చేసే పవిత్ర గ్రంధం ఇది. రావణ సంహారం, రాజ్య పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్రుడు సరయూ నదిలో  జలసమాధి పొంది అవతార పరిసమాప్తి చెందారని చెబుతారు. సీతాదేవి తిరిగి తల్లి భూదేవిని చేరుకుంది. 

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దేశం వ్యాప్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరాది ప్రాంతాల్లో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కాషాయవస్త్రాలు ధరించి శోభాయాత్రలు నిర్వహిస్తారు. దాన ధర్మాలు చేస్తారు.  రామాలయం, ఆంజేనేయుడి ఆలయాల్లో ఈ రోజు వాల్మీకి రామాయణం పఠిస్తారు..

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 17 గురువారం రోజు అన్ని జిల్లాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని పేర్కొంది. అనంతపురం వేదికగా  రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకను నిర్వహించనున్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి ప్రజలు పాదయాత్రలో విజ్ఞప్తి చేశారని..ఈ మేరకు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు లోకేష్.    రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై వాల్మీకి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ క‌లెక్టర్లు నేతృత్వంలో ఈ పండుగ నిర్వహించాల‌ని  బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.స‌విత ఆదేశించారు.   

Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget