అన్వేషించండి

Tirumala Special Days 2025 : వైకుంఠ ఏకాదశి, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం సహా 2025 జనవరిలో తిరుమలలో విశేష పర్వదినాలివే!

Tirumala 2025: నూతన సంవత్సరంలో మొదట వచ్చే పర్వదిన వైకుంఠ ఏకాదశి. తిరుమలేశుడి ఉత్తరద్వార దర్శనంకోసం భక్తులు పోటెత్తుతారు. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ఇంకా 2025 జనవరిలో తిరుమలలో చాలా పర్వదినాలున్నాయి..

Tirumala New Year 2025: నూతన సంవత్సరం 2025 జనవరిలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను TTD వెల్లడించింది. ఏ తేదీల్లో ఏ ఉత్సవాలను నిర్వహిస్తారో జాబితా ఇక్కడ తెలుసుకోండి. జనవరి 9న చిన్న శాత్తుమొర ఉత్సవం నుంచి జనవరి 29  శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు వరకూ వైభవంగా జరగనున్నాయి..ఈ నెలలో అత్యంత ముఖ్యమైన రోజు వైకుంఠఏకాదశి...

Also Read: నూతన సంవత్సరం 2025 ఆరంభం ఈ రాశులవారికి బంగారంలా ఉంటుంది!

జనవరి 09 
చిన్న శాత్తుమొర

జనవరి 10
వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం

జనవరి 11
వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం.

జనవరి 15
ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.

జనవరి 17
తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

జనవరి 18
శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం

జనవరి 19
పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.

జనవరి 20
శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

జనవరి 23
అధ్యాయనోత్సవాలు సమాప్తం.

జనవరి 24
తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.

జనవరి 25
సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం

జనవరి 27
మాస శివరాత్రి.

జనవరి 29
శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు

Also Read: 2025 జనవరి మొదటి వారం మేష రాశి to కన్యా రాశి 6 రాశుల వారఫలాలు!

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకం

మరోవైపు జనవరి 10న ముక్కోటి ఏకాదశి/ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ...వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు..దీనికి సంబంధించి  తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీకి 91 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 10, 11, 12 తేదీలకోసం జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆ ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని  టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆధార్ కార్డ్ చూపించి ఈ టోకెన్లు పొందాలని...ఈ పది రోజుల పాటూ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని..టోకెన్లు లేని భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు

జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీడీపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయగా.. రోజుకు 40 వేల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

డిసెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచీ ధనుర్మాసంలో శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇక జనవరి 7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.  జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. జనవరి 11  వైకుంఠ ద్వాదశి రోజు ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. 

Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget