అన్వేషించండి

TTD Board Meeting : మే 5 నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు అనుమతి, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది.

TTD Board Meeting : సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ విధానం, నడక దారి భక్తులకు టోకెన్ల జారీ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువ గల 10 ఎకరాల స్థలాన్ని ముంబయిలో కేటాయించిందని ఆయన వివరించారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, ఆలయ నిర్మాణం చేపడుతామని అన్నారు. 

మే 5న గరుడ వారధి ప్రారంభం 

ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులను అనుమతిస్తామని, శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహాసనాలు తయారు చేయనున్నట్లు చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజిలో 21 కోట్ల రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదించిందన్నారు. శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని, మే 5వ తేదీన సీఎం జగన్ చేతులు మీదుగా గరుడ వారధిని ప్రారంభిస్తామని తెలిపారు. గరుడ వారధి రెండో దశ పనులకు 100 కోట్లు కేటాయించామన్నారు. మార్చి 2023కి పనులు పూర్తి చేస్తామన్నారు. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండు దశలలో 36 కోట్లు కేటాయింపుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. 

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు 

తిరుమలలో వసతి గదులు మరమత్తులకు రూ.19 కోట్లు కేటాయించగా, బాలాజీ నగర్ లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 437 మంది ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతులకు నిర్ణయం తీసుకున్నామని, వస్తు రూపంలో విరాళాలు అందించే భక్తులకు ప్రివిలేజస్ అందజేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే జరుగుతుందన్నారు. స్విమ్స్ లో 300 పడకల క్యాన్సర్ విభాగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5 వ తేదీన సీఎం జగన్ ఐదు కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. అన్నమయ్య నడకమార్గం అభివృద్ధి పనులకు ఇంకా అనుమతులు రాలేదన్నారు.

టాప్ హెడ్ లైన్స్

శ్రావణమాసం 2026: ఈశాన్యంలో ఈ 5 వస్తువులు పెడితే శివానుగ్రహం, సానుకూల శక్తి!
శ్రావణమాసం 2026: ఈశాన్యంలో ఈ 5 వస్తువులు పెడితే శివానుగ్రహం, సానుకూల శక్తి!
12-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
12-07-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
జగన్నాథ రథయాత్ర వివాదం: ఇస్కాన్‌కు కళింగ సేన అల్టిమేటం!
జగన్నాథ రథయాత్ర వివాదం: ఇస్కాన్‌కు కళింగ సేన అల్టిమేటం!
జూలై 15 నుంచి గుప్త నవరాత్రులు: రాశి ప్రకారం మంత్రాలు, దశ మహావిద్యల పూజతో అదృష్టం మీదే!
జూలై 15 నుంచి గుప్త నవరాత్రులు: రాశి ప్రకారం మంత్రాలు, దశ మహావిద్యల పూజతో అదృష్టం మీదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget