అన్వేషించండి

TTD Board Meeting : మే 5 నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులకు అనుమతి, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది.

TTD Board Meeting : సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ విధానం, నడక దారి భక్తులకు టోకెన్ల జారీ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. టీటీడీకి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువ గల 10 ఎకరాల స్థలాన్ని ముంబయిలో కేటాయించిందని ఆయన వివరించారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి, ఆలయ నిర్మాణం చేపడుతామని అన్నారు. 

మే 5న గరుడ వారధి ప్రారంభం 

ఆలయ నిర్మాణానికి రైమెండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులను అనుమతిస్తామని, శ్రీవారి ఆలయంలో 3.61 కోట్ల రూపాయలతో బంగారు సింహాసనాలు తయారు చేయనున్నట్లు చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజిలో 21 కోట్ల రూపాయల వ్యయంతో నూతన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదించిందన్నారు. శ్రీనివాస సేతు మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని, మే 5వ తేదీన సీఎం జగన్ చేతులు మీదుగా గరుడ వారధిని ప్రారంభిస్తామని తెలిపారు. గరుడ వారధి రెండో దశ పనులకు 100 కోట్లు కేటాయించామన్నారు. మార్చి 2023కి పనులు పూర్తి చేస్తామన్నారు. ఐఐటి నిపుణలు సూచన మేరకు ఘాట్ రోడ్డులో పటిష్ట చర్యలు తీసుకోవడానికి రెండు దశలలో 36 కోట్లు కేటాయింపుకు పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. 

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు 

తిరుమలలో వసతి గదులు మరమత్తులకు రూ.19 కోట్లు కేటాయించగా, బాలాజీ నగర్ లో 2.86 ఎకరాల స్థలంలో ఎలక్ట్రిక్ బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 437 మంది ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతులకు నిర్ణయం తీసుకున్నామని, వస్తు రూపంలో విరాళాలు అందించే భక్తులకు ప్రివిలేజస్ అందజేస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయింపు త్వరలోనే జరుగుతుందన్నారు. స్విమ్స్ లో 300 పడకల క్యాన్సర్ విభాగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మే 5 వ తేదీన సీఎం జగన్ ఐదు కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. అన్నమయ్య నడకమార్గం అభివృద్ధి పనులకు ఇంకా అనుమతులు రాలేదన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kamakhya Temple: ఎన్నికల నుంచి ప్రమాణ స్వీకారం వరకు, రాజకీయ నాయకులకు ఈ శక్తి పీఠం ఎందుకు ప్రత్యేకమైనది?
ఎన్నికల నుంచి ప్రమాణ స్వీకారం వరకు, రాజకీయ నాయకులకు ఈ శక్తి పీఠం ఎందుకు ప్రత్యేకమైనది?
Shukra Gochar 2026: మిథునంలోకి శుక్రుడు! ఈ 5 రాశులవారికి సంపద, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటూ అపురూపమైన వరాలందుతాయి!
మిథునంలోకి శుక్రుడు! ఈ 5 రాశులవారికి సంపద, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటూ అపురూపమైన వరాలందుతాయి!
Elinati Shani: ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారు ఆనందంగా ఉంటారు, కెరీర్లో పురోగతి ఉంటుంది!
ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారు ఆనందంగా ఉంటారు, కెరీర్లో పురోగతి ఉంటుంది!
Palmistry: మీ ఆలోచనా విధానం, మీ విజయం వెనుకున్న రహస్యాలను చెప్పేసే మెదడు రేఖ!
మీ ఆలోచనా విధానం, మీ విజయం వెనుకున్న రహస్యాలను చెప్పేసే మెదడు రేఖ!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget