అన్వేషించండి

Mahabharat : మహాభారతంలోని ఈ 4 కథలు నిజం, నేటికీ సజీవం

Mahabharat : మహాభారతం మతపరమైన, తాత్విక, పౌరాణిక ఇతిహాసాలలో ఒకటి. హిందూ మత ప్రధాన గ్రంథాలలో ఇది కూడా ఒకటి. మహాభారతానికి సంబంధించిన అనేక ఆధారాలు నేటికీ స‌జీవంగా ఉన్నాయి.

Mahabharat : మహాభారత సమయంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి భ‌గ‌వ‌ద్గీతను ఉపదేశించాడు. దీనిని నేటికీ ప్రజలు భక్తితో  చదువుతున్నారు. ప్రతి సంవత్సరం జరుపుకొనే గీతా జయంతి ఉత్సవాల్లో, శ్రీమద్ భగవద్గీతను పూజించే నియమం గ్రంధాలలో వివరించారు. ఈ రోజున శ్రీకృష్ణుడితో పాటు భగవద్గీతను పూజించడం వల్ల భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి వారి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

కురుక్షేత్రం
పాండ‌వులు-కౌర‌వుల మ‌ధ్య కురుక్షేత్రంలో జ‌రిగిన‌ యుద్ధానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే మహాభారతానికి సంబంధించి అలాంటి కొన్ని కథలు ఉన్నాయని మీకు తెలుసా, వాటికి సంబంధించిన సాక్ష్యాలు స‌జీవంగా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

1. కురుక్షేత్రంలో పురాతన బావి
కౌరవులు - పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతం కురుక్షేత్రం. హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. దానిని మనం ఈరోజు భగవద్గీత అంటున్నాం. పురావస్తు సర్వే సమయంలో.. ఈ ప్రదేశం నుంచి బాణాలు, ఈటెలు మొదలైన వాటితో పాటు మహాభారత కాలం నాటి అనేక అవశేషాలు కనుగొనబడ్డాయి. కురుక్షేత్రంలో ఒక పురాతన బావి ఉంది, అది ఇప్పటికీ ఉనికిలో ఉంది. అక్కడ కర్ణుడు యుద్ధ సమయంలో ఒక ప‌ద్మ‌వ్యూహం సృష్టించాడని, అభిమన్యుడిని కుటిల‌ ఉపాయం ద్వారా చంపాడని చెబుతారు.

2. లార్డ్ ఖాటూ శ్యామ్ ఆల‌యం
మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు బార్బరీకుడు ఎంతో బలవంతుడని, అతను కేవలం మూడు బాణాలతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. బార్బరీకుడు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తే నిమిషాల వ్యవధిలో యుద్ధం ముగుస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అటువంటి పరిస్థితిలో, అతనిని ఆపడానికి, శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బరీకుడి వ‌ద్ద‌కు వెళ్లి అతని తలని భిక్షగా అడిగాడు. నీ తలను దానం చేస్తే కలియుగంలో శ్యామ్ అంటే శ్రీకృష్ణుడి పేరుతో పూజిస్తార‌ని వరం ఇచ్చాడు. కానీ బార్బరీకుడు ఈ యుద్ధం ఫలితాన్ని చూడాలని ఉంద‌ని శ్రీ కృష్ణునికి తన కోరికను తెలియ‌జేశాడు. అప్పుడు బార్బరీకుడి మృతదేహాన్ని యుద్ధ ప్రాంతం నుంచి దూరంగా ఉంచారు. ప్ర‌స్తుతం అతని మృతదేహాన్ని ఉంచిన స్థలంలో లార్డ్ ఖాటూ శ్యామ్ ఆలయం ఉంది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని, ఖాటూ శ్యామ్‌ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

3. హనుమ- భీమ‌ సమావేశానికి సాక్షి
భీమా పర్వతంపై హనుమంతుడు, భీమ‌సేనుడు కలుసుకున్న కథ మనందరికీ తెలిసిందే. అప్పుడు  హనుమంతుడిని దారికి అడ్డుగా ఉన్న తోకను పక్క‌కు తీయ‌మ‌ని భీముడు కోర‌తాడు. హనుమంతుడు భీముని వైపు తిరిగి, దారి కావాలంటే, ముందుకు వెళ్లాల‌నుకుంటే నా తోకను నువ్వే కదిలించు అని చెబుతాడు. కానీ భీముడు ఎంత ప్ర‌య‌త్నించినా ఆ తోకను కదపలేకపోయాడు. ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని హనుమాన్ చట్టిలో ఈ ఘటన జరిగినట్లు చరిత్రకారులు, పండితులు చెబుతున్నారు. అప్పుడు హనుమంతుడు భీముడిని విజ‌యం సాధించ‌మ‌ని దీవించాడు.

4. బ్రహ్మాస్త్రంతో సింధు లోయ ధ్వంసం
వేదాలలో బ్రహ్మాస్త్రం అత్యంత విధ్వంసకర ఆయుధంగా వర్ణించారు. కానీ మహాభారతంలో కురు, పాండ‌వుల గురువైన‌ ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కానీ ఈ విధ్వంసక ఆయుధాన్ని ఎలా వెన‌క్కి తీసుకోవాలో అతనికి తెలియదు. తన ముందుకు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి, అర్జునుడు భయపడి, శ్రీకృష్ణుని సలహా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధ్వంసక ఆయుధాన్ని ఆపడానికి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని అర్జునుడికి సూచించాడు. ఇది నీ ప్రాణాన్ని కాపాడటానికే కాదు నీ సోదరుల ప్రాణాలను కాపాడటానికి కూడా అని శ్రీకృష్ణుడు అర్జునుని ఒప్పించాడు. అప్పుడు అర్జునుడు కూడా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఈ ఆయుధాన్ని ఉపయోగించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మాస్త్రం పడిన ప్రాంతంలో సింధు లోయ ప్రజలు నివసించారు. ఇది సింధు లోయ విధ్వంసానికి కారణమైందని చెబుతారు.

కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధానికి సంబంధించిన కథ యుద్ధం ప్రభావాన్ని వెల్ల‌డిస్తుంది. మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశాన్ని నేటికీ మనం చూడవచ్చు.

Also Read : ఈ సంకేతాలు ఎదుర‌వుతున్నాయా - అదృష్టం మీ ఇంటి త‌లుపు త‌ట్టిన‌ట్టే!

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget