అన్వేషించండి

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

భారతదేశంలో ఉన్న ఎన్నో దేవాలయాల్లో మిస్టరీలు ఇప్పటికీ వీడలేదు. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ ఆయా ఆలయాల్లో సమాధానం లేని ప్రశ్నలు ఇంకా సందేహాలుగానే మిగిలిపోయాయి..అదే దైవలీల అంటారు భక్తులు

Mysterious Temples in India: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కానీ..వీటిలో కొన్ని ఆలయాలు మాత్రం మిస్టరీగానే ఉండిపోయాయి. శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా అవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అలాంటి కొన్ని దేవాలయాల గురించి చూద్దాం...

యాగంటి
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాంగటి. ఇక్కడ కొలువైన నంది విగ్రహం మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కలేదు. మొదట్లో  చిన్నగాఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతుంటారు. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..ఈ రాయికి పెరిగే స్వభావం ఉందని..అందుకే ప్రతి 20 ఏళ్ళకు  ఇంచి చొప్పున పెరుగుతోందని అన్నారు. అయితే భక్తులు మాత్రం అదంతా పరమేశ్వర లీల అంటారు. ఏదో ఒకరోజు ఈ నంది లేచి రంకెలేస్తుందని..అప్పడు యుగాంతమే అని నమ్మతుంటారు. 

Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

లేపాక్షి
ఆంధ్రప్రదేశ్ లోని ఆనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడున్న స్తంభాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. 16వ శతాబ్ధంలో నిర్మించిన ఈ ఆలయంలో స్తంభాల కింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పెట్టేయవచ్చు. అంటే స్థంభానికి ఫ్లోర్ కి మధ్య గ్యాప్ ఉందని అర్థం. అయితే స్తంభం నేలకు తాకకుండా ఆలయాన్ని  ఎలా మోస్తోంది అన్నది మిస్టరీ. 

తంజావూరు
తంజావూరులో బృహదీశ్వరాలయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో అంతుచిక్కని రహస్యం ఏంటంటే నీడ పడదు. ఏకాలంలో చూసినా ఏ సమయంలో అయినా ఆలయం నీడ భూమిపై పడదు. 

పూరీజగన్నాథ్ 
పూరీజగన్నాథ్ ఆలయంలో ఎన్నో మిస్టరీలున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆలయం సింహద్వారం ముందు వరకూ వినిపించే సముద్ర ఘోష...ద్వారం దాటి అడుగు అటువైపు వేయగానే వినిపించదు. ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పటికీ అంతుచిక్కలేదు

Also Read: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

శని శింగనాపూర్ 
మహారాష్ట్రలో ఓ గ్రామం శని శింగనాపూర్. ఈ ఊరిలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. ఇప్పటి వరకూ ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘనటలు కూడా లేవంటారు స్థానికులు. ఒకవేళ దొంగతనం జరిగితే వారిని శనిదేవుడు శిక్షిస్తాడని నమ్ముతారు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇళ్లకు మాత్రమే కాదు ఈ ఊర్లో బ్యాంకులకు కూడా తాళాలు వేయరట

షోలాపూర్
మహారాష్ట్ర షోలాపూర్ లో ఓ వింత గ్రామం ఉంది... పేరు షెత్పల్. ఈ గ్రామంలో పాములను పూజిస్తుంటారు. ప్రతి ఇంట్లో పాములకోసం ఓ ప్రత్యేక స్థలం కేటాయిస్తారట..ఇంట్లో మనుషులు  తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూఉంటాయి. కానీ ఇప్పటివరకూ ఆ గ్రామంలో ఎవరినీ పాము కరిచిన దాఖలాలు లేవు.

అమ్రోహా
ఉత్తరప్రదేశ్ లో ఉన్న అమ్రోహా అనే పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా తేళ్ళు ఉంటాయి. ఇక్కడ ఆలయంలోపల చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. అక్కడకు వచ్చే భక్తులను మాత్రం కుట్టవు. భక్తులు వాటిని పట్టుకుంటారు కూడా.

ఇంకా చెప్పుకుంటూ పోతే..భారతదేశంలో ఎన్నో ఆలయాల్లో అంతుచిక్కని మిస్టరీలెన్నో ఉన్నాయి. పరిశోధనల ద్వారా కారణాలు అన్వేషిద్దామని శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇదంతా దైవలీల అంటారు భక్తులు

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget