అన్వేషించండి

Maha Kumbh Mela 2025 Indian Railways: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!

Special Trains For Kumbh Mela 2025: మహా కుంభమేళాకి హాజరయ్యే భక్తులకోసం ఇండియన్ రైల్వే ఉచిత రైలు ప్రయాణం కల్పిస్తోందనే ప్రచారం జరుగుతోంది..ఇందులో నిజమెంత? రైల్వే అధికారులు ఏమన్నారు?

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళాకి  దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యటకులు హాజరయ్యే అవకాశం ఉందన్నది ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా. ఈ మేరకు స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్‌ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 3లక్షలకు పైగా మొక్కలు నాటామని... కుంభమేళా పూర్తైన తర్వాత కూడా వాటిని పరిరక్షిస్తామని చెప్పారు ఉత్తర ప్రదేశ్  జల్‌శక్తి మంత్రి స్వతంత్ర దేవ్‌ సింగ్‌.  కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆధ్యాత్మిక సంబరానికి భారీగా నిధులు కేటాయించింది.

అతి పెద్ద ఆధ్యాత్మిక సంబంరంగా చెప్పే మహా కుంభమేళాకు కొన్ని నెలల ముందునుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయ్. జనవరి 13 భోగి నుంచి ఫిబ్రవరి 26 మహా శివరాత్రి వరకూ మహాకుంభమేళా జరగనుంది. ప్రయాగరాజ్ లో జనవరి 14న మహా కుంభమేళా నిర్వహిస్తారు.  12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక సంబరంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది  యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు.

Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!

మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాకు హాజరుకానున్న కోట్లాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని   13 వేల రైళ్లు కేవలం కుంభమేళాకి కేటాయించింది. భక్తులకు సుమార్ 15 భాషల్లో అనౌన్సమెంట్ ఇచ్చేలా ప్రయాగ రాజ్ లో అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

మహాకుంభమేళాకు రైలేశాఖ ఉచిత రైలు ప్రయాణం ఏర్పాటు చేసిందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో మాత్రమే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ దీనిపై వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై స్పందించిన రైల్వేశాఖ... ఇదంతా అవాస్తవం అని స్పష్టం చేసేసింది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాకుంభమేళా మాత్రమే కాదు ఏ ఇతర సందర్భాల్లోనూ ఉచిత రైలు ప్రయాణానికి అనుమతి ఉండదని మరోసారి ఇలాంటి ప్రచారం జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టేశారు రైల్వే శాఖాధికారులు.  

Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!

భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు, పర్యాటకుల కోసం అదనపు టికెట్ కౌంటర్లు, ప్రయాణికులు - పర్యాటకులు-భక్తులకు అవసమరైన ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని రైల్వేశాఖ స్పష్టం చేసింది. మహా కుంభమేళా సందర్భంగా నడిచే రైళ్ల విషయంలో రైల్వేశాఖ కీలక జాగ్రత్తలు తీసుకుంది. ఈ రైళ్లకు రెండు ఇంజిన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు..తద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.. ఈ మేరకు ప్రయాగ్ రాజ్ లో రైల్వే సంస్థ చేస్తున్న ఏర్పాట్లను  కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిశీలించారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget