అన్వేషించండి

Mantralaya Raghavendra Swamy :బృందావనం నుంచి భక్తుల కోర్కెలు నెరవేర్చే గురురాజమూర్తి!

Shri Raghavendra Swami Temple: తెలుగు రాష్ట్రాల్లో వెలుగుతున్న ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి కర్నూలు జిల్లా మంత్రాలయం. ఇక్కడున్న శ్రీ రాఘవేంద్రస్వామి మఠాన్ని వేలమంది భక్తులు నిత్యం దర్శించుకుంటారు..

Shri Raghavendra Swami Temple: హిందూమత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఓ గురువుగా రాఘవేంద్రస్వామిని భావిస్తారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబిస్తూ  తమిళనాడు కుంభకోణంలో మధ్వమఠాన్ని కొంతకాలం పాలించి..ఆ తర్వాత మంత్రాలయంలో మఠాన్ని స్థాపించి..ఇక్కడే జీవ సమాధి పొందారు. 

తమిళనాడు భువనగిరిలో తిమ్మణ్ణభట్టు  -  గోపికాంబ అనే కన్నడ భట్టు రాజులు రెండో సంతానంగా 1595లో జన్మించారు. వేంకటేశ్వర స్వామి   అనుగ్రహంతో పుట్టినందుకు చిన్నప్పటి నుంచీ వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక కుంభకోణం శ్రీ మఠంలో విద్యను అభ్యసించారు. మధురై నుంచి తిరిగి వచ్చిన తర్వాత సరస్వతీ బాయితో వీరికి వివాహమయింది. వీరి సంతానమే లక్ష్మీనారాయణాచార్య . ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుని శ్రీమఠంలో సుధీంద్రతీర్థుల వద్ద విద్యను అభ్యసించారు. వేదశాస్త్రాల్లో నైపుణ్యం సాధించి ఇతరులకు బోధించడం ప్రారంభించారు. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి దక్షిణ భారతదేశం మొత్తం ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.

Also Read: జుట్టుతో ఒళ్లంతా కప్పుకునే అమ్మవారి గురించి తెలుసా!

అప్పటి నవాబు ఒకరు రాఘవేంద్రస్వామిని పరీక్షించేందుకు బుట్టలతో మాంసం పంపాడు. అయితే ఆ బుట్టలు తెరిచి చూసేసరికి అందులో పూలు పళ్లు కనిపించాయి. ఆ తర్వాత మృతిచెందిన ఓ బాలుడిని తిరిగి బతికించి తనలో మహిమను చాటిచెప్పారు రాఘవేంద్రుడు. పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి అయిన తర్వాత  శిష్యుడైన వెంకన్నను పిలిచి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరారు. శ్రీ రాఘవేందస్వ్రామి నిత్య కార్యాలు పూర్తిచేసుకుని చేతిలో వీణపట్టుకుని సమాధిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. 23ఏళ్ల వయసులో సన్యాస దీక్ష తీసుకున్న రాఘవేంద్రస్వామి..40 ఏళ్ల పాటూ నియమ నిష్టలతో గడిపిన జీవితం, సాధించిన విజయాలు , జరిగిన సంఘటనల గురించి.. వారి సోదరి కుమారుడు నారాయణాచారి రాఘవేంద్ర విజయమ్‌ అన్న గ్రంథంలో ప్రస్తావించారు. 

Also Read: ఇంకా పెళ్లికాలేదా - అయితే ఇక్కడకు వెళ్లొస్తే ఓ ఇంటివారైపోతారు!

శిష్యుడికోసం
రాఘవేంద్రస్వామి ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవతి తీరం నుంచి పరిగెత్తుకుని వచ్చేసమయానికే గురువుగారు సమాధిలోకి చేరుకున్నారు. అప్పణాచార్యులు  కన్నీళ్లతో దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో చివరి ఏడు అక్షరాలు చెప్పలేకపోయాడు..ఆ సమయంలో శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ అక్షరాలు సమాధిలోంచి వినిపించాయి. ఆ శ్లోకాన్ని ఇప్పటికీ బృందావనంలో జరిగే ప్రార్థనల్లో పఠిస్తారు. 

మంచాల గ్రామమే మంత్రాలయం
రాఘవేంద్రస్వామి.. తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక' అనే గ్రంథానికి ‘ప్రకాశం' అనే వివరణ రాశారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక' సుధ, పరిమళ అనే గ్రంథాలు రచించారు. ఆయన బృందావన ప్రవేశానికి ముందు , బృందావన ప్రవేశం తరువాత కుడా ఎన్నో మహిమలు చేశారని చెబుతారు. స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామమే మంత్రాలయంగా వెలుగుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడిగా, సాహితీవేత్తగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై ఉన్నాడు. శ్రీ గురు రాఘవేంద్రుల వారిని స్మరిస్తూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి.  

Also Read: అమ్మవారి దంతాలు పడిన ప్రదేశం - తెలంగాణలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సి శక్తిపీఠం!

పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే

ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
MLC Kavitha: తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Doddi Komaraiah Death Anniversary | కడవెండి పౌరుషం తెలంగాణ మట్టిని ముద్దాడి 78 సంవత్సరాలు పూర్తిVirat Kohli Emotional Speech About Jasprit Bumrah | బుమ్రా ఈ దేశపు ఆస్తి అంటున్న కోహ్లీ | ABP DesamVirat Kohli Emotional About Rohit Sharma |15 ఏళ్లలో రోహిత్ శర్మను అలా చూడలేదంటున్న విరాట్ కోహ్లీJagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Jobs: జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
జాబ్ కాలెండర్ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి
MLC Kavitha: తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
తిహార్ జైలులో కవితను కేటీఆర్, హరీష్ రావు - అప్పటివరకూ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం!
Andhra Pradesh: ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
ఎమ్మెల్సీలుగా సి. రామచంద్రయ్య, హరి ప్రసాద్ ఏకగ్రీవం
UK Elections 2024: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు ఓటమి - భారత సంతతి అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే?
Electric Cars Sale Declined: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ - కారణం ఏంటి?
Anasuya Bharadwaj: అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
అనసూయకు లవ్ లెటర్ రాసేశాడు, ఎవరో తెలుసా? - ఆ ముద్దులు వద్దంటోన్న శేఖర్ మాస్టర్
Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు
Telangana Politics: తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
తెలంగాణ శాసన మండలికి రద్దు ముప్పు, చంద్రబాబును రేవంత్ సాయం కోరాలన్న బీఆర్ఎస్
Embed widget