అన్వేషించండి

Saraswati Pushkaralu Dates: సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. సీఎం దంపతుల పుష్కర స్నానం - ఘాట్ల వివరాలు ఇవే!

Saraswati Pushkaralu: కాళేశ్వరం క్షేత్రం త్రివేణి సంగమంలో మే 15 గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి దంపతులు ఈ రోజు సాయంత్రం పుష్కరస్నానం ఆచరించనున్నారు

Saraswati Pushkaralu Starting and Ending Dates:  ఏడాదికో నదికి పుష్కారాలొస్తాయి. ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రం  త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. గురువారం తెల్లవారుజామున 5 గంటల 44  నిముషాలకు సరస్వతి ఘాట్‌ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు. బుధవారం రాత్రి సమయానికే బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటికీ..సూర్యోదయానికి చేసే స్నానమే ప్రధానం. అందుకే గురువారం ఉదయం పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులతో అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. పుష్కరాలు ఈ నెల 26వరకూ జరగనున్నాయి. ఈ మేరకు భారీగా తరలివస్తున్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రాణహిత నదికి రెండేళ్ల క్రితం పుష్కరాలు జరిగాయి..ఈ ఏడాది సరస్వతి నదికి జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 15 సాయంత్రం     త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి కుటుంబ సమేతంగా కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు.  సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద కొత్తగా నిర్మించిన సరస్వతి ఘాట్‌, భక్తుల కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు.

భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఘాట్లని సుందరంగా తీర్చిదిద్దారు. 86 మీటర్ల పొడవుతో జ్ఞాన సరస్వతిఘాట్‌ను కొత్తగా నిర్మించారు. కోటి రూపాయల వ్యయంతో తమిళనాడులోని మహబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాట్ వద్ద ప్రతిష్ఠించారు. సాధారణ భక్తుల వసతి కోసం టెంట్ సిటీ సిద్ధం చేశారు. రోజుకి లక్ష మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఆ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పుష్కరాలు ప్రారంభం కావడంతో ఇప్పటికే  తెలుగు రాష్ట్రాలతో పాటూ మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. పుష్కరాల సందర్భంగా నదీ జలాలు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారుల్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.  

నిత్యం ఉదయం ఎనిమిదిన్నర నుంచి 11 వరకు తీరం వెంట యాగాలు నిర్వహిస్తారు
రోజూ సాయంత్రం  6.45 గంటల నుంచి 7.35 గంటల సరస్వతి ఘాట్ లో నవరత్న మాల హారతి నిర్వహిస్తారు
పుష్కరాలు జరిగే అన్ని రోజులు రాత్రివేళ ప్రవచన కర్తల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి
పుష్కరాలకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  

భారతదేశం చివరి గ్రామం అయిన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా మానాలో సరస్వతి నది ఉద్భవించింది.  తెలంగాణలోని కాళేశ్వరం, ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమం ఉండడంతో భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget