అన్వేషించండి

Sangameshwara Temple: ఎనిమిది నెలల పాటు గంగమ్మ ఒడిలోనే సంగమేశ్వరుడు - జంగమయ్యకు ఒడ్డునుంచే హారతి!

Sangameshwara Temple: శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన కర్నూలు జిల్లాలోనే మరో ప్రసిద్ధి చెందిన ఆలయం సంగమేశ్వర దేవాలయం. ఏడాదికి 8 నెలల పాటూ నీటిలోనే ఉండే ఈ శివయ్య ఆలయానికి ఎన్ని విశిష్టతలున్నాయో..

 Sangameshwara Temple: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరంలో ఉంది సంగమేశ్వర స్వామి దేవాలయం. వేలఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఏడాదిలో దాదాపు 8 నెలల పాటూ గంగమ్మ ఒడిలోనే ఉంటుంది. ఎగువ నుంచి కురిసే భారీ వర్షాలకు వరదనీరొచ్చి కృష్ణానదిలో చేరుతుంది. ఈ ఏడాది కూడా భారీగా వరదనీరు చేరడంతో ఎప్పటిలానే  సంగమేశ్వరఆలయం నీటమునిగింది. సంగమేశ్వరుడు కృష్ణానదిలో నిరంతర అభిషేకం చేయించుకుంటున్నాడా అన్నట్టుంది ఈ దృశ్యం. ఒడ్డునుంచే హారతి ఇస్తున్నారు పూజారి...

Also Read: ఆగష్టు 09 నాగపంచమి రోజు పుట్టలో పాలుపోసే ముహూర్తం - చదువుకోవాల్సిన శ్లోకాలివే!
 
ధర్మరాజు ప్రతిష్టించిన వేప శివలింగం 

ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే  భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం ఇది. సప్తనదులు సంగమించే ప్రదేశంలో ఉన్న సంగమేశ్వరాలయంలో పూజలందుకుంటున్న  శివలింగం  అత్యంత విశిష్టమైనది . వేల ఏళ్లక్రితం ధర్మరాజు ప్రతిష్టించిన వేప శివలింగం ఇది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడి సూచన మేరకు ధర్మరాజు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఏడు నదులు సంగమించే సంగమేశ్వరంలో శివపూజ చేయమని శ్రీకృష్ణుడు చెప్పడంతో..ఇక్కడ వేపచెట్టును నరికి శివలింగం చేసి పూజించాడట ధర్మరాజు. వేలఏళ్లక్రితం ప్రతిష్టించిన ఇక్కడ శివలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం. సంగమేశ్వరాలయం మాత్రమే కాదు.. మహా మునులు తపస్సు చేసిన ప్రదేశం ఇది...అగస్త్యుడు , విశ్వామిత్రుడు లాంటి మహర్శులు ఇక్కడ తపస్సు ఆచరించారని చెబుతారు.  

Also Read: ఏటా శ్రావణమాసంలో నాగపంచమి ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది!

ఈ సంగమేశ్వరం ప్రదేశంలో పితృదేవతలకు తర్పణాలు విడిచినా, అస్తికలు కలిపినా వారికి స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని స్కాందపురాణంలో ఉంది.  కృష్ణ, వేణి,తుంగ,భద్ర, మలపహరిని, భవనాసిని, భీమరది వంటి ఏడు నదులు కలసి ప్రవహించే ఈ ప్రదేశంలో స్నానమాచరిస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.   ఇక్కడ నదిలో స్నానమాచరించిన తర్వాత ఒడ్డున కూర్చుని గాయత్రి మంత్ర జపం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందంటారు. 

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని 200 ఏళ్ల క్రితం స్థానిక ప్రజలంతా కలసి పునర్నిర్మించారి చెబుతారు. ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించి ఉండేవి కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రస్తుతం అందరూ దర్శించుకుంటున్న ప్రధాన ఆలయం సాదాసీదాగా ఉంటుంది. ముఖ మండపై పూర్తిగా శిథిలమైపోయింది. అంతరాలయం మాత్రమే దర్శమనిస్తోంది. గతంలో లలితాదేవి, వినాయకుడికి వేర్వేరు ఆలయాలుండేవి..కానీ ఆ ఆలయాలు శిథిలం అయిపోవడంతో ఈ విగ్రహాలను తీసుకొచ్చి శివుడి సమీపంలోనే దర్శనానికి ఉంచారు. ఇక ఉపాలయాల్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలను కర్నూలు జిల్లాలో వివిధ ఆలయాలకు తరలించారు.  

కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే సంగమేశ్వరం చేరుకోవచ్చు. తెలంగాణ నుంచి వెళ్లేవారు  అయితే మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకూ బస్సు...అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం వెళ్లొచ్చు. ప్రస్తుతం ఈ ఆలయం నీటిలో మునిగిఉంది...మళ్లీ శంకరుడిని దర్శించుకోవాలంటే...మళ్లీ 8 నెలల వరకూ ఆగాల్సిందే... 

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ 
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ 
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః 

Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indian Railway Fare Hike: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు అమల్లోకి.. ఎంత పెంచారంటే
ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Railway Fare Hike: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు అమల్లోకి.. ఎంత పెంచారంటే
ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Kamareddy Crime News: భార్యను వేధిస్తున్న పార్టీ నేత అనుచరుడు.. చెప్పుతో కొట్టుకుంటూ పీఎస్‌కు తీసుకెళ్లిన భర్త
భార్యను వేధిస్తున్న పార్టీ నేత అనుచరుడు.. చెప్పుతో కొట్టుకుంటూ పీఎస్‌కు తీసుకెళ్లిన భర్త
Embed widget