అన్వేషించండి

Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు పునఃప్రారంభం

దాదాపు ఏడాదిన్నర తర్వాత చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా కల్లోలంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోయారు. అదే సమయంలో ఆలయాల్లోనూ భక్తులకు ప్రవేశం నిలిపేసిన అధికారులు, అర్చకులు.. స్వామి,అమ్మవార్లకు ఏకాంత సేవలు నిర్వహించారు. కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత నిబంధనల మేరకు భక్తులను అనుమతించడం ప్రారంభించారు. ఇప్పటికే తిరుమలలో మళ్లీ సర్వదర్శనం టోకెన్లు పంపిణీ మళ్లీ మొదలుపెట్టారు టీటీడీ అధికారులు. ఇంకా పలు ఆలయాల్లో పాత సేవలను పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణల సందడి మళ్లీ ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించారు ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్. 

కరోనా కట్టడిలో భాగంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో దాదాపు ఏడాదిన్నర పాటూ నిలిచిపోయిన ప్రదక్షిణలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయానికి వచ్చే భక్తులకు మహా ప్రాకార ప్రదక్షిణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు అర్చకులు రంగరాజన్‌. గతంలో ఆలయ గర్భగుడి చుట్టు భక్తులు, 11 లేదా 108 ప్రదక్షిణలు చేసేవారని, కరోనా కారణంగా ఏడాదిన్నర నుంచి ప్రదక్షిణలు పూర్తిగా నిలిపివేశామని పేర్కొన్నారు. చాలామంది భక్తుల పదే పదే ప్రదక్షిణల గురించి అడుగుతున్నారని..అందుకే వారి కోరిక మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు రంగరాజన్. 

Also Read: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...

అయితే ఇక్కడ కూడా కొన్ని నిబంధనలు అనుసరించాలని సూచించారు. ఆలయ ప్రకారం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే 11 ప్రదక్షిణలు చేసినట్లే అని తెలిపారు. 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కుకునే భక్తులు ఒక మహా ప్రాకార ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని అన్నారు. అలాగే 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులు 11 మహా ప్రాకార ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకోవచ్చన్నారు. కరోనా పూర్తిస్థాయిలో తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ  మహాప్రాకార ప్రదక్షిణలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు భక్తులు సహకరించాలని రంగరాజన్ విజ్ఞప్తి చేశారు. 

Also Read: ఇవాళ్టీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

చిలుకూరు బాలాజీ ఆలయంలో మొక్కుకుని ప్రదక్షిణలు చేస్తే వీసా తొందరగా వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ  శ్రీ వేంకటేశ్వరస్వామిని 'వీసా బాలాజీ' అని పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే దేవుడి విగ్రహాన్ని కళ్లు మూసుకోకుండా చూడాలి. మొదటిసారి  భక్తులు స్వామిని దర్శించుకుని  11 ప్రదక్షిణలు చేస్తారు. మొక్కు తీరాక 108 ప్రదక్షిణలు చేస్తారు. ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత మళ్లీ భక్తులకు ప్రదక్షిణలు చేసే అవకాశం కల్పించారు.

Also Read:ఈ రాశులవారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయం

Also Read:నేడే ఈఏపీసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget