అన్వేషించండి

PM Modi: ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించిన "సప్త పురిలు" ఇవే , ఇక్కడ మరణం కూడా మోక్షమే!

Sapta Puri: ప్రధాని మోదీ జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సప్త పురి, చార్ ధామ్, శక్తి పీఠాలను ప్రస్తావించారు. వీటిలో సప్తపురి ఏంటి? ఏ ఏ ప్రదేశాలో తెలుసా?

PM Modi: అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ కేవడియాలో ప్రసంగిస్తూ, చార్ ధామ్, శక్తి పీఠాలు, సప్త పురిల గురించి ప్రస్తావించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పేర్లపై ఆసక్తి పెరిగింది. చార్ ధామ్ , శక్తి పీఠాల గురించి చాలా మందికి తెలుసు, కానీ సప్త పురిలు ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటన్నది సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
 
సప్త పురిలు: మోక్షానికి మార్గాలివి
 
హిందూ గ్రంథాల్లో సప్త మోక్షదాయక క్షేత్రాల గురించి ప్రస్తావన ఉంది. ఈ ఏడు నగరాలు ధర్మం, తపస్సు, జ్ఞానం ,మోక్షం అనే నాలుగు మార్గాలు ఒకదానితో ఒకటి కలిసే ప్రదేశాలుగా పరిగణిస్తారు.  పురాణాల ప్రకారం, ఈ నగరాల్లో జీవించడం లేదా మరణించడం ద్వారా ఆత్మకు మోక్షం లభిస్తుంది.  

సప్త మోక్షదాయక క్షేత్రాలు ఇవే

అయోధ్య (ఉత్తరప్రదేశ్)

శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రావణసంహారం కోసం శ్రీరాముడిగా జన్మించాడు. రాముడి జన్మస్థలం అయోధ్య. గౌరవం, సత్యం , నీతికి చిహ్నం. ఈ నగరం ధర్మం , ఆదర్శవంతమైన జీవితానికి గొప్ప ఉదాహరణ 

మథుర (ఉత్తరప్రదేశ్)

శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణుడు కొలువైన ముఖ్యమైన ప్రదేశాల్లో మధుర ఒకటి. ఇక్కడ ప్రేమ, లీల, భక్తి భావం అత్యున్నతమైనది. ఈ ప్రదేశం భక్తి మార్గానికి కేంద్రం. ఇక్కడ భగవంతుడిని ప్రేమ రూపంలో చూస్తారు.

హరిద్వార్ (ఉత్తరాఖండ్)

గంగా నది ఒడ్డున ఉన్న ఈ నగరం తపస్సు, సాధన,స్నానంతో ముడిపడి ఉంది. కుంభమేళా సంప్రదాయం దీనిని ప్రపంచవ్యాప్తంగా మోక్షానికి ద్వారంగా ప్రసిద్ధి చెందింది.

కాశీ (వారణాసి, ఉత్తరప్రదేశ్)

శివుడు స్వయంగా నిర్మించిన నగరం కాశీ. ఇక్కడ మరణం కూడా మోక్షానికి మార్గంగా మారుతుందని చెబుతారు. ఈ ప్రదేశం జ్ఞానం, ధ్యానం ,సాధనకు కేంద్రంగా పరిగణిస్తారు. ప్రతి హిందువు జీవితకాలంలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది

కంచి (తమిళనాడు)

దక్షిణ భారతదేశంలోని ఈ పురాతన నగరం  కామాక్షి,  భగవాన్ విష్ణువును దర్శించుకోవచ్చు. ఇది విద్య, శాస్త్రం,  ఆధ్యాత్మికతకు సంగమంగా పరిగణించబడుతుంది.

అవంతిక  (మధ్యప్రదేశ్)

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడే ఉంది. ఇక్కడ కర్మ రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతారు. దీనికి చార్ ధామ్‌లతో సమానమైన ప్రతిష్ట ఉంది.
 
ద్వారక (గుజరాత్)

భగవాన్ శ్రీకృష్ణుని రాజధాని ద్వారక. ఈ నగరం ధర్మం, నీతి, కర్తవ్యాల సమతుల్యతకు చిహ్నం. ఇది పశ్చిమ దిశలో ఉన్న ధామం, ఇది భారతదేశం మొత్తానికి దిశానిర్దేశం చేస్తుంది.

గ్రంథాలలో ప్రస్తావన

గరుడ పురాణం, వాయు పురాణం , స్కంద పురాణంలో ఈ ఏడు పురిల గురించి విస్తృతంగా ఉంది. ఈ నగరాలను మోక్షదాయక క్షేత్రాలుగా పిలుస్తారు.  అంటే మనిషి తన కర్మల నుంచి విముక్తి పొంది ఆత్మశాంతిని పొందగలిగే ప్రదేశాలు.

మతపరమైన అర్థానికి మించి ఐక్యత సందేశం

ప్రధాని మోదీ ఈ నగరాలను ప్రస్తావించడం కేవలం మతపరమైన సందర్భంలోనే కాదు. సప్త పురిలు భారతదేశ సాంస్కృతిక , భౌగోళిక వైవిధ్యానికి కూడా చిహ్నం. ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు, భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర ఒకే భావనతో ముడిపడి ఉందని ఇది చూపిస్తుంది. ప్రతి పురి ఒక సందేశాన్ని ఇస్తుంది. ధర్మం కేవలం పూజ మాత్రమే కాదు, జీవితాన్ని జీవించడానికి ఒక సమతుల్య మార్గం అని ఇది చెబుతుంది. వీటిలో ప్రతి నగరం మోక్షం మరణానంతరం మాత్రమే కాకుండా, సత్యం, ప్రేమ, తపస్సు ,  జ్ఞానం యొక్క ఆచరణలో కూడా పొందవచ్చని బోధిస్తుంది.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Advertisement

వీడియోలు

విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
రివెంజ్‌ ముఖ్యం బిగిలు.. సిరీస్ కొట్టేయాలని పట్టుదలగా ఉన్న టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
India Team For South Africa T20 series: దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆడే ఇండియా జట్టు ఇదే! తిరిగి టీంలోకి వచ్చిన శుభ్‌మన్ గిల్
దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆడే ఇండియా జట్టు ఇదే! తిరిగి టీంలోకి వచ్చిన శుభ్‌మన్ గిల్
Embed widget