Medaram Maha Jathara 2026: మేడారం జాతరలో తప్పిపోయిన చిన్నారులు, రిస్ట్ బ్యాండ్ సహకారంతో 2 గంటల్లో ఆచూకీ తెలుసుకున్న పోలీసులు!
Sammakka Saralamma Jatara 2026: మేడారం జాతర వైభవంగా కొనసాగుతోంది. తప్పిపోయిన చిన్నారులను రిస్ట్ బ్యాండ్ సహకారంతో 2 గంటల్లో ఆచూకీ తెలుసుకుని వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు పోలీసులు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. లక్షల సంఖ్యలో భక్తులు బంగారం తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనం మొత్తం జనసంద్రంగా మారింది. జన జాతరలో పిల్లలు , పెద్దలు తప్పిపోకుండా ఉండేందుకు, తప్పిపోయినా వెంటనే కనిపెట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తప్పిపోయిన చిన్నారులను రెండు గంటల్లో కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ మంచి ఫలితాలను ఇస్తోంది.
మేడారం జాతరలో తప్పిపోయిన వారిని సులువుగా కనిపెట్టేందుకు క్యూ ఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థను భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థపై మల్టీ జోన్ -2 IGP S. చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. భక్తులు వచ్చే ప్రధాన మార్గాల్లో 11 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి తెలంగాణ RTC సహకారంతో చిన్నారులకు ఈ బ్యాండ్లను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్ ఉప్పల్, MGBS బస్ స్టేషన్, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటూ వరంగల్ రైల్వేస్టేషన్, కాజిపేట్ రైల్వే స్టేషన్లో రిస్ట్ బ్యాండ్లు అందించే కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.
మేడారం జాతరలో చిన్నారులు ఎవరైనా తప్పిపోతే వారిచేతికున్న రిస్ట్ బ్యాండ్ పై క్యూ ఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేయాలని చెప్పారు. స్కాన్ చేసిన వెంటనే చిన్నారికి సంబంధించిన వారి ఫోన్ నంబర్ కనిపిస్తుందని..లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మేడారం జాతరలో రెండోరోజైన జనవరి 29 గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్టించారు. చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆడపడుచులంతా అమ్మకు ఘన స్వాగతం పలికారు. వందలాది భక్తుల కోలాహం, డప్పు చప్పుళ్లు, గిరిజన నృత్యాల మధ్య సమ్మక్క గద్దెపై కొలువుతీరింది. చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం అత్యంత ఉద్వేగ భరితంగా జరిగింది. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్, కలెక్టర్ దివాకర అమ్మవారికి స్వాగతం పలికేందుకు ముందుగానే గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. పూజారులు అమ్మవారిని తీసుకుని చిలకల గుట్ట దిగుతున్న సమయంలోనే ఆమె రాకకు గౌరవ సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. చిలకలగుట్ట గేటు వద్ద కూడా పోలీసులు , భక్తుల జయజయధ్వానాల మధ్య రెండోసారి కాల్పులు జరిపారు.గద్దెపై సమ్మక్క కొలువుతీరే ఘట్టం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు
ఫోన్ చేసిన క్షణాల్లో భక్తుల ముందుకు 108 బైక్ అంబులెన్స్! మేడారంలో ప్రాణాలు కాపాడేందుకు వినూత్న ప్రయోగం! .. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
మేడారం జాతరలో న్యూజిలాండ్ మావోరీల ప్రదర్శించిన 'హాకా' నృత్యం గురించి ఆశ్చర్యపోయే విషయాలు
వనదేవతలకు రక్త తర్పణం.. మేడారంలో 'బలిహారతి' వెనుక రహస్యాలేంటి?
బెల్లం చుట్టూ ఈగలు' అంటారు కదా! మేడారం జాతరలో టన్నుల కొద్దీ బెల్లం, కానీ ఒక్క ఈగ కూడా ఉండదేం? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
























