Medaram Jatara 2026: 'బెల్లం చుట్టూ ఈగలు' అంటారు కదా! మేడారం జాతరలో టన్నుల కొద్దీ బెల్లం, కానీ ఒక్క ఈగ కూడా ఉండదేం?
'బెల్లం చుట్టూ ఈగలు' అనేది ఓ సామెత..కానీ ఈ సామెత మేడారం జాతరలో వర్తించదనే చెప్పాలి. ఎందుకంటే జాతరలో ఎటు చూసినా బెల్లమే..కానీ ఈగలు కనిపించవ్..ఎందుకో తెలుసా?

Medaram Sammakka Sarakka Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా... మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ వేడుకకు సంబంధించి ఎన్నో విశిష్టతలున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో అడుగుకో అద్భుతం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. అలాంటి అంశాల్లో ఒకటి బెల్లం. మేడారంలో వనదేవతలను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లింపులో భాగంగా బెల్లం సమర్పిస్తారు. బెల్లానేని బంగారంగా భావిస్తారు. అమ్మలను దర్శించుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరు బెల్లం తీసుకుని వస్తారు. జనంతో సమానంగా బెల్లం ఉంటుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే నిలుబెత్తు బంగారం అంటూ సమర్పించడంలో టన్నుల కొద్దీ బంగారం కనిపిస్తుంది. గద్దెలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా బెల్లమే.
ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం ఏంటంటే.. ఇంత బెల్లం ఉంటుంది కానీ ఎక్కడా ఈగలు కనిపించవ్...
సాధారణంగా చిన్న బెల్లం ముక్క ఉంటే చాలు ఈగలు ముసురుకుంటాయి.. బెల్లం కనిపించనంతగా చూట్టేస్తాయ్. బెల్లం చుట్టూ ఈగల్లా అనే సామెత కూడా అక్కడి నుంచి వచ్చినదే. అలాంటిది మేడారంలో మాత్రం టన్నుల కొద్దీ బెల్లం ఉంటుంది కానీ ఒక్క ఈగ కూడా కనిపించదు.
మేడారంలో బెల్లం చుట్టూ ఈగలు కనిపించకపోవడం వెనుకున్న రహస్యం ఏంటి?
భక్తులు చెప్పే ముఖ్యమైన కారణాలేంటి?
సమ్మక్క సారలమ్మలు కొలువుతీరిన ఆ అటవీ ప్రాంతం అత్యంత పవిత్రమైనది అని భక్తుల విశ్వాసం
అమ్మవార్ల చల్లని చూపు వల్ల దుష్టశక్తులు మాత్రమే కాదు..వ్యాధులు వ్యాపింపచేసే కీటకాలు కూడా అటువైపు రాలేవట
దేవతల అనుగ్రహం వల్లే ఇలా జరుగుతుందని అంటారు
జాతర జరిగే ప్రాంగణం అటవీ ప్రాంతంలో ఉండడం, భక్తుల సంఖ్య భారీగా ఉండడం, ధూపం-దీపం సందడి వల్ల కూడా కీటకాలు దరిచేరవు అని మరికొంది వాదన
మేడారం చుట్టూ వేప చెట్లుతో పాటూ.. దట్టమైన వనమూలికలు ఉన్నాయని, జాతర జరుగుతున్నన్ని రోజులూ నిరంతరం ధూపం వేయడంతో పాటూ లక్షల మంది భక్తులు అక్కడే పొయ్యిలు వెలిగించి వంటలు చేయడం కూడా ఈగలు రాకపోవడానికి మరో కారణం అంటారు
ఏదేమైనా బెల్లం చుట్టూ ఈగలు ముసరకపోవడం అనేది ఇక్కడ ఓ విశేషమే..అమ్మవార్ల దివ్యత్వానికి ఇదో ఉదాహరణ అంటారు భక్తులు
మేడారంలో ఎప్పుడూ ఈగలు ఉండవు అనుకుంటే పొరపాటే.. కేవలం జాతర జరిగే నాలుగు రోజులు మాత్రమే ఈగలు కనిపించవ్.. అమ్మవార్లు గద్దెలపై కొలువుతీరి..తిరిగి వనప్రవేశం చేసేవరకూ మాత్రమే ఈ అద్భుతం జరుగుతుందని చెబుతారు స్థానికులు
జాతరలో మొదటి రోజు సారలమ్మ, పగిడిద్ద రాజు , గోవిందరాజు రాక
జాతరలో రెండో రోజు సమ్మక్క రాక
మూడో రోజు భక్తులు పూజలు, మొక్కులు చెల్లింపు
నాలుగో రోజు దేవతలు తిరిగి వనప్రవేశం
ఈ సమయంలో భక్తులు లక్షల క్వింటాళ్లలో బెల్లం సమర్పించడం గిరిజన సంస్కృతి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
గిరిజనులకు మాత్రమే సొంతమైన మేడారం ఇప్పుడు అందరి జాతరగా ఎలా మారింది? సమ్మక్క-సారలమ్మల కథేంటి?
వనదేవతల జాతరకు లక్షల్లో భక్తజనం, జాతరకు వెళ్లలేని భక్తుల ఇంటి వద్దకే బంగారం బుక్ చేసుకోండి ఇలా!
























