అన్వేషించండి

Maha Shivaratri 2023: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!

మహా శివరాత్రి 2023: పరమేశ్వరుడిని పార్వతీ దేవి ప్రశ్నలు అడగడం ఏంటి...శరీరంలో సగభాగం పంచిచ్చిన అర్థనారీశ్వరుడి గురించి జగన్మాతకి తెలియని విషయాలుంటాయా..అయినా ఎందుకు అడిగిందంటే...

Maha Shivaratri 2023: అమ్మవారు అయ్యవారిని క్వశ్చన్ చేయడం ఏంటి..పోనీ ఎవ్వరూ లేని సమయం చూసి ఏకాంతంగా మాట్లాడిందా అంటే అదీ కాదు..నిండు కొలువులో అందరి మధ్యా అడిగేసింది. భోళాశంకరుడు కూడా  ఏమాత్రం కోపగించుకోకుండా పార్వతీదేవి సందేహాలన్నీ తీర్చాడు. ఏ సందర్భంలో పార్వతీ దేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది.. ఆ సందేహాలు వాటికి సమాధానాలు చూద్దాం..

కైలాశంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు,భూతగణాలతో నిండి  ఉన్న  కొలవులో భోళాశంకరుడు కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి భర్త కళ్లు మూసింది. అంతే..లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులన్నీ అల్లాడిపోవడం చూసి శంకరుడు మూడో కన్ను తెరిచాడు. ఇంకేముంది హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన గౌరీదేవి ...'స్వామీ మూడోకన్ను తెరిచారేమి'  ఆ కారణంగా నా తండ్రి హిమవంతుడికి బాధ కలిగిందని వేడుకుంది. నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గర లేవు, సర్వలోకాలు నన్ను పట్టి ఉంటాయి, నువ్వు నా రెండు కళ్లూ మూసేస్తే లోకం చీకటిమయం అయింది. అందుకు మూడోకన్ను తెరవాల్సి వచ్చిందన్నాడు శంకరుడు. అంత ప్రశాంతంగా స్పందించిన భర్తని చూసి..తనలో ఉన్న సందేహాలు తీర్చుకునేందుకు ఇదే మంచి సమయం అని భావించింది. ఇంకేముంది ప్రశ్నలు సంధించింది. 

Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

పార్వతి: స్వామీ మీ కంఠంపై నల్లటి మచ్చ ఎందుకుంది?
శివుడు: దేవతలు, దానవులు కలిసి పాలసముద్రం మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ కనిపిస్తుంది. 

పార్వతి: పినాకమనే విల్లునే ఎందుకు ధరిస్తారు? 
శివుడు: కణ్వుడనే మహాముని ఆదియుగంలో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది. అద్భుతంగా పెరిగిన ఆ వెదురు నుంచి బ్రహ్మ మూడు విల్లులు తయారు చేశాడు. అందులో ఒకటి పినాకము( నా దగ్గర ఉంది), రెండోది శారంగం( విష్ణువు దగ్గరుంది), మూడోది బ్రహ్మదగ్గరుంది. పినాకం నా చేతిలో ఉన్నప్పటి నుంచి పినాకపాణిగా మారాను
 
పార్వతి: మరే వాహనం లేనట్టు ఎద్దును వాహనంగా చేసుకున్నారెందుకు స్వామి?
శివుడు: ఓసారి తపస్సు చేసుకుంటున్నప్పుడు చుట్టూ చేరిన గోవులు కారణంగా నా తపస్సుకి భంగం కలిగింది. కోపంగా చూడడంతో అవి పడిన బాధను చూసిన శ్రీ మహావిష్ణువు..శాంతింపచేసి ఓ ఎద్దుని కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఎద్దు వాహనమైనంది. 

పార్వతి: కైలాశంలో ఉండకుండా శ్మశానంలో ఉంటారేంటి స్వామి?
శివుడు: భయంకరమైన భూతాలు ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మ నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉన్నంతవరకూ లోకాలు సురక్షితంగా ఉంటాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం, జనం తిరగని స్థలం, అందుకే ఇక్కడ నుంచి లోకాలను రక్షించాలనుకున్నా.

పార్వతి: భస్మ  లేపనం, పాములు ధరించడం, శూలం, ఈ భీకరమైన రూపం ఎందుకు స్వామి?
శివుడు: లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం (చలి), రెండవది ఉష్ణం (వేడి). సౌమ్యం విష్ణువు, అగ్ని నేను అందుకే భస్మం సహా ఈ భీకర రూపం.

Also Read: శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఆలయాలివి, అడుగడుగునా మిస్టరీలే!

పార్వతి: తలపై నెలవంక ఎందుకు?
శివుడు: దక్షయజ్ఞ సమయంలో నేను దేవతలని బాధించాను, ఆ సమయంలో చంద్రుడిని కాలితో తొక్కగా..శరణు వేడాడు. పొరపాటు చేశానని అర్థమై చంద్రుడిని తలపై పెట్టుకున్నాను...

ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగింది పార్వతీదేవి..అయినా లోకమాతకు ఈ సమధానాలు తెలియవా..ఆమెకు అర్థనారీశ్వరుడిపై సందేహాలు ఎందుకుంటాయి..సకల జీవులకు తన భక్త గొప్పతనం తెలియజెప్పేందుకే నిండుసభలో ఈ ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించింది లోకమాత..

ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం 
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా  శివోమే అస్తు సదా శివోం

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Mangli Bayilone Ballipalike Song : మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
Byju Ravindran: బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు భారీ షాక్  - అప్పులోళ్లకు 1 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశం
బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు భారీ షాక్ - అప్పులోళ్లకు 1 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశం
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
Embed widget