అన్వేషించండి

ksheerabdi dwadasi 2023 Date and time: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!

ksheerabdi dwadasi 2023: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!

ksheerabdi dwadasi 2023 Date and Time:  కార్తీకమాసంలో నెలంతా అత్యంత పవిత్రమైనదే... మరీ ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఈ ఐదు రోజులు మరింత విశేషమైనవి అని చెబుతారు పండితులు.  కార్తీక శుద్ద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొంటాడు..అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజు శ్రీ మహాలక్ష్మితో కలసి భూలోకానికి వస్తాడట. అందుకే శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరికి...శ్రీ మహాలక్ష్మి ఉండే తులసికి కళ్యాణం జరిపిస్తారు. 

శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వివాహం
వాసుకుని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ చేసుకుని ఈరోజునే రాక్షసులు, దేవతలు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని పిలుస్తుంటారు. అలాకే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా  అంటారు. పాలకడలి నుంచి వచ్చిన శ్రీమహాలక్ష్మి ఈ రోజు శ్రీ మహా విష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అంటారు. అందుకు గుర్తుగా కూడా ఈరోజును క్షీరాబ్ది ద్వాదశి అని చెబుతాం. ఆషాఢ శుద్ద ఏకాదశి రోజున ప్రారంభించి కార్తీక శుద్ద ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్షను చేస్తారు. ఈరోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు.

Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!

క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి కథతో పాటూ కార్తీకపురాణంలో ప్రస్తావన ఉంది. 

అంబరీషుడి కథ
భక్త ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు కూడా శ్రీమహా విష్ణుకి ప్రియమైన భక్తుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన నభగ మహారాజు కుమారుడు. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు దాటిపోయే లోగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము తినాలి. ఇలా ఓ సారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడు భోజనం చేసే సమయానికి దూర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. భోజన సమయానికి వచ్చిన మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం సరికాదని తెలిసి ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే తాను వచ్చేవరకూ వేచి ఉండమని చెప్పి నదికి స్నానమాచరించేందుకు వెళ్లిపోతాడు దూర్వాసుడు.  ద్వాదశ ఘడియలు ముగిసిపోతున్నా దూర్వాసుడు తిరిగి రాడు..ఆయన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే ఆగ్రహానికి గురికాక తప్పదు..ద్వాదశి ముగిసిపోయాక భోజనం చేస్తే ఉపవాస ఫలితం దక్కదు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో అంబరీషుడు తన కులగురువైన వశిష్టుడి సలహామేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ నీళ్లు తాగి దీక్ష విరిమిస్తాడు.

Also Read: అయ్యప్ప మండల దీక్ష తర్వాత మాలధారుల్లో రావాల్సిన మార్పులివే!

అంబరీషుడి శాపాన్ని తీసుకున్న శ్రీ మహావిష్ణువు
అప్పుడే స్నానమాచరించి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. పదిరకాల జన్మలనెత్తమని  అంబరీషుడిని శపిస్తాడు.  అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే  భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు.అంబరీషుడిని కరుణించిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. రాక్షసుడిని సంహరించిన అనంతరం ఆ సుదర్శన చక్రం దూర్వాసుడిని వెంబడిస్తుంది. ఆ చక్రం బారినుంచి కాపాడుకునేందుకు అన్ని లోకాలకు వెళ్లిన దూర్వాసుడు మహా విష్ణువుని కూడా శరణువేడతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి ఏమీ చేయలేనని అంబరీషుడినే శరణువేడుకోమంటాడు. చివరికి దుర్వాసుడు వెళ్లి అంబరీషుడిని శరణు వేడుతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని, ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని, అవసరం వచ్చినప్పుడు పది అవతారాలుగా లోకరక్షణకోసం తాను అనుభవిస్తానని శ్రీమహావిష్ణువు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడూ బంధీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా, లేక చదివినా అనేక పాపాలు నశించి, పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది. 

Also Read: ఈ 6 రాశులవారు ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget