అన్వేషించండి

The End of the Kali Yuga : కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!

Kalki Avatar Real Story: భూమ్మీద ఉన్న అధర్మపరులను ఊచకోత కోసుకుంటూ వెళుతున్న కల్కికి అశ్వత్థాముడు ఏ విధంగా సహాయం చేశాడు? గాడిద వాహనం ఎక్కి పారిపోయిన కలి మళ్లీ వస్తాడా? కల్కి అవతార పరిసమాప్తి ఎప్పుడు?

Kalki Real Story: కీటకపురాన్ని పాలించే జిహుడితో భీకరమైన యుద్ధం జరిగింది..జిహుడి సంహారం తర్వాత  సోదరుడు శుద్దోధనుడు కూడా యుద్ధంలో మరణించాడు. అప్పుడు శుద్ధోధనుడి భార్య, సైనికుల భార్యలంతా ఆయుధాలు చేతపట్టి యుద్ధ రంగంలో దిగాడు. స్త్రీలతో యుద్ధం చేయనని చెప్పి కల్కి ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి నిల్చున్నారు. ఆ స్త్రీలంతా వేసిన బాణాలు, అస్త్రాలు అన్నీ కల్కిలో కలసిపోయాయి. ఆతర్వాత ఆ స్త్రీలకు మోక్షాన్ని ప్రసాదించి ముందుకు కదిలాడు కల్కి. ఆ సమయంలో కలిశాడు అశ్వత్థాముడు. కల్కిని కలిసిన అశ్వత్థాముడు.. మూడువేల సంవత్సరాలు ఒళ్లంతా పుళ్లుతో నిండిఉన్న నేను శాపవిమోచనం పొందాను.. నీకోసమే ఇంకా ఈ భూమ్మీద ఉన్నానని చెప్పాడు. అలా కల్కి సైన్యానికి అశ్వత్థాముడు యుద్ధ విద్యలు నేర్పించి..ధర్మసంస్థాపనలో భాగం అయ్యాడు.  

Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!

ఆ తర్వాత కల్కిని కలిసిన మహర్షులు... కుంభ కర్ణుడి తనయుడు నికుంభుడి కుమార్తె అయిన కుథోధరి  హిమాలయ ప్రాంతంలో ఉన్న మహర్షులను పీడిస్తోంది..ఆమెను సంహరించాలని కోరారు. మహర్షులకు అభయం ఇచ్చిన స్వామివారు వెంటనే హిమాలయా ప్రాంతానికి బయలుదేరి వెళ్లి గుహలా ఉన్న ఆమెను చంపడంతో...కుథోధరి కుమారుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అప్పుడు బ్రహ్మాస్తం ప్రయోగించాడు కల్కి...

జిహుడిని నిర్మూలించాడు

ఘోరంగా హింస చేస్తున్నవారిని సంహరించాడు

అప్పటికీ మిగిలి ఉన్న రాక్షసులను అంతమొందించాడు 

ఆ తర్వాత హరిద్వార్ లో అడుగుపెట్టిన కల్కిని దర్శించుకునేందుకు సప్తమహర్షులు, సప్త చిరంజీవులు రావడంతో వారిని పూజించి ఆశీర్వచనం పొందారు స్వామివారు. అదే సమయంలో కల్కిని దర్శించుకున్న మరువు - దేవాపి అనే ఇద్దరు వచ్చి మోక్షం కావాలని వేడుకున్నారు. మీరిద్దరూ సూర్య, చంద్ర, ఇంద్ర,యమ, కుబేర అంశలకు చెందినవారు..మీరు మోక్షంకోసం పుట్టినవారు కాదు.. ధర్మ సంస్థాపన తర్వాత మీరిద్దరూ పాలన చేయాలని చెప్పాడు

మరువు - అయోధ్య
దేవాపి - హస్తినాపురం
రాజధానిగా చేసుకుని పాలించనున్నారు. అయితే ఈ లోగా ధర్మ సంస్థాపనకు తనతో పాటూ కలసి రావాలని కోరాడు కల్కి. అప్పటి నుంచి కలి ప్రభావం ఉన్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుంటూ , దుర్మార్గులైన రాజులను సంహరిస్తూ.. అధర్మపరులను ఊచకోత కోస్తూ ముందుకు వెళ్లాడు..

Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!

'కల్కి'కి భయపడి గాడిదపై పారిపోయిన 'కలి'

మరువు, దేవాపి..కలి సైన్యంపై దండయాత్ర చేశారు..ఆ తర్వాత కలిని తరిమికొట్టారు కల్కి. గాడిద వాహనంపై పారిపోయాడు. కలికి మరణం ఉండదు కానీ కలిని దూరం చేసుకుంటే కొన్ని యుగాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా ధర్మసంస్థాపన చేశాడు కల్కి...

రమాదేవిగా జన్మించిన భూదేవి

కలిని తరిమికొట్టిన తర్వాత విష్ణుభక్తుడైన రాజు పాలించే భల్లాటపురం వెళ్లారు. కల్కితో యుద్ధం చేసిన ఆ రాజు..భగవంతుడిని ఎత్తుకుని తీసుకెళ్లి రాజమందిరంలో సింహాసనంపై కూర్చోబెట్టాడు. అప్పుడే పూజ అనంతరం బయటకు వచ్చిన ఆ మహారాజు భార్య..సాక్షాత్తూ భగవంతుడే వచ్చాడంటూ సకల ఉపచారాలు చేసింది. తన భర్తను క్షమించమని కోరింది..అప్పుడు స్వామివారు తానిక్కడు రావడం వెనుక కారణం ఉందని.. వారి పుత్రిక రమాదేవి కోసం వచ్చానని చెప్పాడు. భూదేవి రమాదేవిగా భల్లాటపురంలో జన్మించింది. 

నాగలోకానికి కల్కి

భూలోకంలో ధర్మసంస్థాపన సాధ్యం అయిన తర్వాత సర్పలోకానికి వెళ్లారు కల్కి. అక్కడ ఉండే సులోచన అనే నాగకన్య చూపు పడితే ఎవ్వరైనా మాడి మసైపోతారు..కానీ కల్కికి ఏమీ కాలేదు. అప్పటికి ఆమెకు అర్థమైంది..తాను ఓ గంధర్వుడి భార్యను..శాపం కారణంగా ఇలా నాగలోకంలో విషకన్యగా ఉండిపోయానని ...మీ దర్శనంతో శాపవిమోచనం అయిందని చెప్పి వెళ్లిపోయింది...

సత్యయుగం ఆరంభం - కల్కి అవతార పరిసమాప్తి

భార్యలు పద్మావతి - రమాదేవిని తీసుకుని శంబల చేరుకున్నారు స్వామివారు. పైనుంచి దిగివచ్చిన దేవతలంతా మీరొచ్చిన కార్యం పూర్తైంది..తిరిగి వైకుంఠానికి రావాలని కోరారు. అప్పుడు సత్యయుగం పాలనను... మరువు - దేవాపికి అప్పగించి భార్యలతో కలసి వైకుంఠానికి వెళ్లిపోయాడు శ్రీ మహావిష్ణువు... సత్యయుగంలో మళ్లీ ధర్మం నాలుగుపాదాలపై నడుస్తూ పాలన సాగింది...

Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Punganur Politics : పుంగనూరులో టీడీపీలో చేరిపోతున్న వైసీపీ క్యాడర్ - ఆపలేకపోతున్న పెద్దిరెడ్డి
పుంగనూరులో టీడీపీలో చేరిపోతున్న వైసీపీ క్యాడర్ - ఆపలేకపోతున్న పెద్దిరెడ్డి
Khammam Sitrama Project: సీతారామా ప్రాజెక్టు ట్రయల్‌ రన్ విజయవంతం- కం‌గ్రాట్స్‌ చెప్పిన కేటీఆర్
సీతారామా ప్రాజెక్టు ట్రయల్‌ రన్ విజయవంతం- కం‌గ్రాట్స్‌ చెప్పిన కేటీఆర్
AP EDCET 2024 Results: ఏపీ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి -  డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి - డైరెక్ట్ లింక్ ఇదే
Andhra Pradesh: ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. అభ్యంతరాలపై అధికారులకు ప్రశ్నలు
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. అభ్యంతరాలపై అధికారులకు ప్రశ్నలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

South Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికాVirat Kohli Batting T20 World Cup 2024 | సెమీ ఫైనల్లోనైనా కింగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా..? | ABP DesamIndia vs England Semi Final 2 Preview | T20 World Cup 2024 లో అసలు సిసలు మ్యాచ్ ఇదే | ABP DesamSA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Politics : పుంగనూరులో టీడీపీలో చేరిపోతున్న వైసీపీ క్యాడర్ - ఆపలేకపోతున్న పెద్దిరెడ్డి
పుంగనూరులో టీడీపీలో చేరిపోతున్న వైసీపీ క్యాడర్ - ఆపలేకపోతున్న పెద్దిరెడ్డి
Khammam Sitrama Project: సీతారామా ప్రాజెక్టు ట్రయల్‌ రన్ విజయవంతం- కం‌గ్రాట్స్‌ చెప్పిన కేటీఆర్
సీతారామా ప్రాజెక్టు ట్రయల్‌ రన్ విజయవంతం- కం‌గ్రాట్స్‌ చెప్పిన కేటీఆర్
AP EDCET 2024 Results: ఏపీ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి -  డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఎడ్‌సెట్ 2024 ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి - డైరెక్ట్ లింక్ ఇదే
Andhra Pradesh: ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. అభ్యంతరాలపై అధికారులకు ప్రశ్నలు
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. అభ్యంతరాలపై అధికారులకు ప్రశ్నలు
Arvind Kejriwal: బెల్ట్‌ లేక ఇబ్బందిగా ఉంది -  కోర్టుకు కేజ్రీవాల్ రిక్వస్ట్
బెల్ట్‌ లేక ఇబ్బందిగా ఉంది - కోర్టుకు కేజ్రీవాల్ రిక్వస్ట్
'ప్రయాణికులు ముందే టికెట్ తీసుకోవాల్సిన పని లేదు' - హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్
'ప్రయాణికులు ముందే టికెట్ తీసుకోవాల్సిన పని లేదు' - హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్
Kalki 2898 AD Movie Review: అశ్వత్థామ శాపం , ఎగిరే గుర్రం ప్లేస్ లో కారు, చిలుక స్థానంలో బుజ్జి..మొత్తం సేమ్ టు సేమ్ దించేసిన నాగ్ అశ్విన్!
అశ్వత్థామ శాపం , ఎగిరే గుర్రం ప్లేస్ లో కారు, చిలుక స్థానంలో బుజ్జి..మొత్తం సేమ్ టు సేమ్ దించేసిన నాగ్ అశ్విన్!
Telangana News: మంత్రివర్గంలో ఖాళీలు లేవు- రేవంత్ కీలక ప్రకటన- త్వరలోనే తెలంగాణ పీసీసీ చీఫ్‌ నియాకమం
మంత్రివర్గంలో ఖాళీలు లేవు- రేవంత్ కీలక ప్రకటన- త్వరలోనే తెలంగాణ పీసీసీ చీఫ్‌ నియాకమం
Embed widget