అన్వేషించండి

The End of the Kali Yuga : కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!

Kalki Avatar Real Story: భూమ్మీద ఉన్న అధర్మపరులను ఊచకోత కోసుకుంటూ వెళుతున్న కల్కికి అశ్వత్థాముడు ఏ విధంగా సహాయం చేశాడు? గాడిద వాహనం ఎక్కి పారిపోయిన కలి మళ్లీ వస్తాడా? కల్కి అవతార పరిసమాప్తి ఎప్పుడు?

Kalki Real Story: కీటకపురాన్ని పాలించే జిహుడితో భీకరమైన యుద్ధం జరిగింది..జిహుడి సంహారం తర్వాత  సోదరుడు శుద్దోధనుడు కూడా యుద్ధంలో మరణించాడు. అప్పుడు శుద్ధోధనుడి భార్య, సైనికుల భార్యలంతా ఆయుధాలు చేతపట్టి యుద్ధ రంగంలో దిగాడు. స్త్రీలతో యుద్ధం చేయనని చెప్పి కల్కి ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి నిల్చున్నారు. ఆ స్త్రీలంతా వేసిన బాణాలు, అస్త్రాలు అన్నీ కల్కిలో కలసిపోయాయి. ఆతర్వాత ఆ స్త్రీలకు మోక్షాన్ని ప్రసాదించి ముందుకు కదిలాడు కల్కి. ఆ సమయంలో కలిశాడు అశ్వత్థాముడు. కల్కిని కలిసిన అశ్వత్థాముడు.. మూడువేల సంవత్సరాలు ఒళ్లంతా పుళ్లుతో నిండిఉన్న నేను శాపవిమోచనం పొందాను.. నీకోసమే ఇంకా ఈ భూమ్మీద ఉన్నానని చెప్పాడు. అలా కల్కి సైన్యానికి అశ్వత్థాముడు యుద్ధ విద్యలు నేర్పించి..ధర్మసంస్థాపనలో భాగం అయ్యాడు.  

Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!

ఆ తర్వాత కల్కిని కలిసిన మహర్షులు... కుంభ కర్ణుడి తనయుడు నికుంభుడి కుమార్తె అయిన కుథోధరి  హిమాలయ ప్రాంతంలో ఉన్న మహర్షులను పీడిస్తోంది..ఆమెను సంహరించాలని కోరారు. మహర్షులకు అభయం ఇచ్చిన స్వామివారు వెంటనే హిమాలయా ప్రాంతానికి బయలుదేరి వెళ్లి గుహలా ఉన్న ఆమెను చంపడంతో...కుథోధరి కుమారుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అప్పుడు బ్రహ్మాస్తం ప్రయోగించాడు కల్కి...

జిహుడిని నిర్మూలించాడు

ఘోరంగా హింస చేస్తున్నవారిని సంహరించాడు

అప్పటికీ మిగిలి ఉన్న రాక్షసులను అంతమొందించాడు 

ఆ తర్వాత హరిద్వార్ లో అడుగుపెట్టిన కల్కిని దర్శించుకునేందుకు సప్తమహర్షులు, సప్త చిరంజీవులు రావడంతో వారిని పూజించి ఆశీర్వచనం పొందారు స్వామివారు. అదే సమయంలో కల్కిని దర్శించుకున్న మరువు - దేవాపి అనే ఇద్దరు వచ్చి మోక్షం కావాలని వేడుకున్నారు. మీరిద్దరూ సూర్య, చంద్ర, ఇంద్ర,యమ, కుబేర అంశలకు చెందినవారు..మీరు మోక్షంకోసం పుట్టినవారు కాదు.. ధర్మ సంస్థాపన తర్వాత మీరిద్దరూ పాలన చేయాలని చెప్పాడు

మరువు - అయోధ్య
దేవాపి - హస్తినాపురం
రాజధానిగా చేసుకుని పాలించనున్నారు. అయితే ఈ లోగా ధర్మ సంస్థాపనకు తనతో పాటూ కలసి రావాలని కోరాడు కల్కి. అప్పటి నుంచి కలి ప్రభావం ఉన్న ప్రదేశాలను ఒక్కొక్కటిగా తుడిచిపెట్టుకుంటూ , దుర్మార్గులైన రాజులను సంహరిస్తూ.. అధర్మపరులను ఊచకోత కోస్తూ ముందుకు వెళ్లాడు..

Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!

'కల్కి'కి భయపడి గాడిదపై పారిపోయిన 'కలి'

మరువు, దేవాపి..కలి సైన్యంపై దండయాత్ర చేశారు..ఆ తర్వాత కలిని తరిమికొట్టారు కల్కి. గాడిద వాహనంపై పారిపోయాడు. కలికి మరణం ఉండదు కానీ కలిని దూరం చేసుకుంటే కొన్ని యుగాలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా ధర్మసంస్థాపన చేశాడు కల్కి...

రమాదేవిగా జన్మించిన భూదేవి

కలిని తరిమికొట్టిన తర్వాత విష్ణుభక్తుడైన రాజు పాలించే భల్లాటపురం వెళ్లారు. కల్కితో యుద్ధం చేసిన ఆ రాజు..భగవంతుడిని ఎత్తుకుని తీసుకెళ్లి రాజమందిరంలో సింహాసనంపై కూర్చోబెట్టాడు. అప్పుడే పూజ అనంతరం బయటకు వచ్చిన ఆ మహారాజు భార్య..సాక్షాత్తూ భగవంతుడే వచ్చాడంటూ సకల ఉపచారాలు చేసింది. తన భర్తను క్షమించమని కోరింది..అప్పుడు స్వామివారు తానిక్కడు రావడం వెనుక కారణం ఉందని.. వారి పుత్రిక రమాదేవి కోసం వచ్చానని చెప్పాడు. భూదేవి రమాదేవిగా భల్లాటపురంలో జన్మించింది. 

నాగలోకానికి కల్కి

భూలోకంలో ధర్మసంస్థాపన సాధ్యం అయిన తర్వాత సర్పలోకానికి వెళ్లారు కల్కి. అక్కడ ఉండే సులోచన అనే నాగకన్య చూపు పడితే ఎవ్వరైనా మాడి మసైపోతారు..కానీ కల్కికి ఏమీ కాలేదు. అప్పటికి ఆమెకు అర్థమైంది..తాను ఓ గంధర్వుడి భార్యను..శాపం కారణంగా ఇలా నాగలోకంలో విషకన్యగా ఉండిపోయానని ...మీ దర్శనంతో శాపవిమోచనం అయిందని చెప్పి వెళ్లిపోయింది...

సత్యయుగం ఆరంభం - కల్కి అవతార పరిసమాప్తి

భార్యలు పద్మావతి - రమాదేవిని తీసుకుని శంబల చేరుకున్నారు స్వామివారు. పైనుంచి దిగివచ్చిన దేవతలంతా మీరొచ్చిన కార్యం పూర్తైంది..తిరిగి వైకుంఠానికి రావాలని కోరారు. అప్పుడు సత్యయుగం పాలనను... మరువు - దేవాపికి అప్పగించి భార్యలతో కలసి వైకుంఠానికి వెళ్లిపోయాడు శ్రీ మహావిష్ణువు... సత్యయుగంలో మళ్లీ ధర్మం నాలుగుపాదాలపై నడుస్తూ పాలన సాగింది...

Also Read: అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడున్నాడు? ‘కల్కి 2898 ఏడీ’ లో అమితాబ్ నుదుట కనిపించిన అద్భుతమైన మణి గురించి తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
Billionaires: ఇండియాలో పెరిగిన బిలియనీర్ల సంఖ్య -   అంబాని, అదానీ..  నెంబర్ వన్ ఎవరో తెలుసా.. ?
ఇండియాలో పెరిగిన బిలియనీర్ల సంఖ్య - అంబాని, అదానీ.. నెంబర్ వన్ ఎవరో తెలుసా.. ?
Vallabhaneni Vamsi: వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
వంశీకి షాక్ - బెయిల్ పిటిషన్ డిస్మిస్ - ఇంకా చాలా కాలం జైలు జీవితం తప్పదా ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Nara Lokesh Saves Life: నారా లోకేష్ చేసిన ఈ పని కళ్లు చెమర్చేలా చేస్తుంది - ఒకరి ప్రాణం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ?
నారా లోకేష్ చేసిన ఈ పని కళ్లు చెమర్చేలా చేస్తుంది - ఒకరి ప్రాణం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ?
Embed widget