అన్వేషించండి

Kalki Real Story:రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!

kalki 2898 AD: సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోవడం వల్ల రామాయణ యుద్దం జరిగింది. రాజ్యం కోసం కురుక్షేత్ర సంగ్రామం జరిగింది..మరి కల్కిని యుద్ధం దిశగా నడిపించిన సందర్భం ఏంటి? కల్కి ఊచకోత ఎప్పుడు మొదలైంది?

Kalki Real Story: పరశురాముడి దగ్గర సకలవిద్యలు నేర్చుకున్న కల్కి..తన అవతార ఆంతర్యం గురించి తెలుసుకని శివుడికోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివపార్వతులు తెల్లటి గుర్రం, బరువైన ఖడ్గం, సర్వజ్ఞుడు అనే చిలుకను ప్రసాదించారు. వాటిని తీసుకుని తాను జన్మించిన శంబలవైపు కదిలాడు కల్కి. మరి శంబలలో ఉన్న కల్కి శ్రీలంకలో పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవిని ఎలా చేరుకున్నాడు? అసలు కల్కిని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీలంకలో పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవి

సింహళదేశంలో బృహధ్వజుడు - కౌముది అనే రాజకుటుంబంలో పద్మావతిగా జన్మించింది లక్ష్మీదేవి. చిన్నప్పటి నుంచి నారాయణుడి ఆలోచనలో ఉండే పద్మావతి..పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం తపస్సు చేసింది. ప్రత్యక్షమైన శివుడు..విష్ణువుతో పాణిగ్రహం జరుగుతుందని వరమిచ్చాడు. అసలు నారాయణడు ఎవరో ఎలా గుర్తించాలని అడిగింది పద్మావతి. శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవ్వరు నిన్ను కామభావనతో చూసినా వారు స్త్రీలుగా మారిపోతారని చెబుతాడు. ఆ విషయాన్ని తండ్రికి తెలియజేసింది పద్మావతి. తండ్రి వెంటనే స్వయంవరం ఏర్పాటు చేశాడు..కానీ అక్కడకు వచ్చిన మహారాజులంతా పద్మావతిని చూసి మోహించి వెంటనే  స్త్రీలుగా మారిపోయారు. అప్పటి నుంచి రాజభజనం నుంచి బయట అడుగుపెడితే చాలు పద్మావతి అందాన్నీ చూసి ఆశ్చర్యపోయిన యువకులంతా స్త్రీలుగా మారిపోవడం మొదలైంది. అప్పటి నుంచీ రాజభవనం దాటి వెళ్లడం మానేసింది..కేవలం స్త్రీలమధ్యలో మాత్రమే ఉండేది. ఆ బాధను అనుభవించలేక అగ్నిప్రవేశం చేసుకునేందుకు సిద్ధపడింది పద్మావతి...ఆ సమయానికి సర్వజ్ఞుడనే చిలుక అక్కడకు వచ్చి ఏం జరిగిందని అడిగింది. చిలుక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన పద్మావతి..తనకు శివుడు ఇచ్చిన వరం గురించి చెప్పింది.  అప్పుడు శంబలలో జన్మించిన నారాయణుడి గురించి చిలుక చెప్పిన మాటలు విని తన జాడ స్వామివారికి చెప్పమని కోరింది.  

చిలుక ద్వారా కల్కికి సందేశం

చిలుక నుంచి సందేశం విన్న నారాయణుడు..వెంటనే శ్రీలంకలో ఉన్న కారుమతి అనే నగరంలో ప్రవేశించాడు. అక్కడ సరోవరం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి చిలుకను దూతగా పంపించాడు.  ఆ మాట వినగానే జన్మధన్యం అయిందని భావించి పరుగున చెలికత్తెలతో సరోవరానికి వెళ్లింది. అయితే మనసులో సందేహం...చెలికత్తెల వెనుక దాక్కుని నారాయణుడిని చూసింది.. ఏమో ఎదురుపడితే తను నారాయణుడు కాకపోతే స్త్రీగా మారిపోతాడేమో అనే భయంతో ఆగిపోయింది. అది గమనించిన నారాయణుడి పిలుపు విని పరుగున వెళ్లి కాళ్లపై పడి నమస్కరించింది పద్మావతి. స్వయంగా శ్రీ మహావిష్ణువే కల్కిగా వచ్చిన సంగతి తల్లిదండ్రులతో చెప్పి పరిణయమాడింది. ఇన్నాళ్ల ఆలస్యానికి పరిహారంగా ఏ వరం కావాలో కోరుకో అన్న కల్కితో.. ఇన్నాళ్లూ తనని చూసి స్త్రీలుగా మారిపోయిన వారికి పూర్వరూపాన్నివ్వమని అడిగింది. ఆ తర్వాత పద్మావతిని తీసుకుని శంబల నగరానికి బయలుదేరాడు...

కల్కి ధర్మసంస్థాపన దిశగా బయలుదేరిన సందర్భం ఇదే..
 
కల్కి-పద్మావతికి జయవిజయులు అనే సంతానం కలిగారు. వారిద్దరూ తండ్రి దగ్గరకు వచ్చి నాన్నగారూ మీరు అశ్వమేథ యాగం, రాజసూయ యాగం చేసి భూమిని పాలిస్తే చూడాలని ఉందని కోరారు. అప్పుడు దండయాత్రకు బయలుదేరాడు కల్కి.  మొదటగా కల్కి వెళ్లిన ప్రదేశం కార్తావీర్యార్జునుడు పాలించిన..పరశురాముడు జయించిన మాహిష్మతి రాజ్యం. అప్పటికి ఆ రాజ్యంలో కలి ప్రభావం ఏమాత్రం లేదు.. ధర్మమైన పాలన సాగుతోంది. అక్కడ విశాఖయూపుడు అనే రాజుపై దండయాత్రకు వెళ్లగా..ఆ మహారాజు కల్కితో కలసి రాజసూయయాగం చేసేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఇద్దరూ కలసి కీటకపురం అనే ప్రదేశానికి వెళ్లారు...కలి ప్రభావంతో నిండిపోయిన ఈ ప్రదేశం నుంచి ధర్మసంస్థాప దిశగా కల్కి అడుగులుపడ్డాయి...

కీటకపురంలో ఏం జరిగింది? కల్కిపై దండెత్తిన మహిళలు ఎవరు? కల్కికి అశ్వత్థాముడు ఏ విధంగా సహాయపడ్డాడు? కలిని కల్కి తరిమికొట్టిన ప్రదేశం ఏంటి? కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైంది? తర్వాత కథనంలో తెలుసుకుందాం...


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమేంటి - ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే..
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
New Delhi Stampede Compensation: న్యూఢిల్లీలో తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ భారీ పరిహారం- గాయపడితే రూ.2.5 లక్షలు
Telugu TV Movies Today: రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
రజనీకాంత్ ‘వేట్టయాన్’, చిరంజీవి ‘డాడీ’ to పృథ్వీరాజ్ ‘గురువాయూర్ అంబలనాడయిల్’, సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 16) టీవీలలో వచ్చే సినిమాలివే
Revanth Chit Chat:  ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిని కించపర్చలేదు- కులగణనలో తప్పుల్లేవు - రేవంత్ కీలక వ్యాఖ్యలు
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
గొడవలు అన్నారు... కట్ చేస్తే బాబు -పవన్ చెట్టా పట్టాల్
NTPC: ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు 55 వేల రూపాయల జీతం
NTPC: ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎంపికైతే నెలకు 55 వేల రూపాయల జీతం
New Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట- 18 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
Pawan Kalyan: 'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
'టికెట్ కొనకుండా రావడం గిల్టీగా ఉంది' - తలసేమియా బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ ఆర్థిక సాయం, ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.