అన్వేషించండి

Sri Eri Katha Ramar Temple: ఆ ప్రదేశంలో అడుగు పెడితే మోక్షమే

తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో వున్న మధురాంతకం వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం.ఈ క్షేత్రంలో అడుగుపెడితే చాలు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఏరి కథ రామార్ దేవాలయం, మధురాంతకం
అప్పట్లో వకుళవనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో వకుళారణ్యం అని పిలిచేవారట. చుట్టుపక్కల ప్రాంతాల సాగుకి నీరందించే ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కట్టకు దిగువగా ఉంది శ్రీరామచంద్రుడి ఆలయం. ప్రతి ఆలయంలో రామయ్య పాదాల దగ్గరే ఉండే ఆంజనేయుడు ఇక్కడ కనిపించడు. 

ప్రచారంలో ఉన్న కథనం
రావణసంహారం అనంతరం సీతాదేవితో కలసి అయోధ్యకు తిరిగి వెళుతున్న సమయంలో శ్రీరాముడు వకుళవనం దగ్గర ఆగాడట. ఆ సమయంలో రాముడు అయోధ్యకు వస్తోన్న విషయాన్ని భరతుడికి చేరవేసేందుకు వెళ్లాడట ఆంజనేయుడు. ఆయన తిరిగి వచ్చాక పుష్కరిణిలో స్నానమాచరించి అక్కడి నుంచి సీతారాములను దర్శించుకుని నమస్కరించాడు. అందుకే హనుమంతుడి విగ్రహం ఆలయంలో కాకుండా పుష్కరిణి ఒడ్డున ఉంటుంది.

పెరియ పెరియ పెరియ స్వామి
పెరియ అంటే వరుస.ఈ ఆలయంలో మూడు వరసల ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మొదటి వరుసలో ఉన్నవి  శ్రీమన్నారాయణుడు ప్రసాదించినవి, రెండో వరుసలో ఉన్నవి శ్రీ రామానుజాచార్యులు పూజించినవి, మూడో వరుసలో ఉన్నవి ప్రతిష్టించిన విగ్రహాలు..అందుకే ఇక్కడ స్వామివారిని పెరియ పెరియ పెరియ స్వామి అంటారు. కృతయుగంలో బ్రహ్మ పుత్రులు శ్రీమన్నారాయణుడిని తమకు మోక్షం ప్రసాదించమని కోరారు. అప్పుడు స్వామి తన విగ్రహాన్నిచ్చి, వకుళారణ్యంలో విభాండక మహర్షి ఆశ్రమంలో ఉంచి  మోక్షంకోసం తపస్సు చేయమని చెప్పాడట. ఆ ప్రదేశమే ప్రస్తుతం కోదండ రాముడు నెలకొన్న మధురాంతకం. శ్రీమన్నారాయణునితో బ్రహ్మపుత్రులకు ఇచ్చిన విగ్రహాలే అక్కడ మొదటి వరుసలో ఉన్నవి అని చెబుతారు.  

Also Read: భోజనం బాలేదు అంటూ తిట్టుకుంటూ తింటున్నారా!

వైష్ణవ మత ప్రబోధకుడు శ్రీ రామానుజాచార్యులు పెరంబదూరులో జన్మించినా, ఆయన ఆధ్యాత్మిక రంగంలో అడుగిడినదిక్కడే.  ఆయన పెరియనంబి దగ్గర దీక్ష తీసుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీరంగం వెళ్తూ దారిలోనే ఆయన్ని కలిశారు. అప్పుడు పెరియనంబి వకుళవనంలోనే పంచ సంస్కారాలను ప్రబోధించారని చెబుతారు. 1937 లో కలకత్తాకు చెందిన సేఠ్ మగన్ లాల్ ఆలయాన్ని పునరుధ్ధరిస్తుండగా ఆలయం బయట గోడదగ్గర భూమిలోవున్న ఒక గుహని చూశారు.తవ్వి చూడగా 20 అడుగుల లోపల ఒక మండపంలో నవనీత కృష్ణుడి చిన్న రాగి విగ్రహం, శంఖం, చక్రం బయటపడ్డాయి.  పెరియనంబి రామానుజులవారికి దీక్ష ఇవ్వటానికి వీటిని వాడారని భావించారు. 

అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన ఆంగ్లేయుడు 
150 సంవత్సరాల క్రితం అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో వున్న ఈ ప్రాంతానికి  లియనాల్డ్ ప్లేస్ అనే ఆంగ్లేయుడు కలెక్టరుగా వున్నాడు. ఆయన భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్మేవాడు. మధురాంతకం ఆలయానికి ఎగువన నీరును నిల్వచేసేందుకు ఓ పెద్ద చెరువు ఉండేది. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఆ నీరు పొంగి సాగుని, చుట్టుపక్కల గ్రామాలను ముంచేసేది. ఏటా లియనార్ ప్లేస్ ఓ గట్టు కట్టించినా మళ్లీ వర్షాలకు అది కొట్టుకుపోయేది. ఓ సందర్భంలో మధురాంతకం ఆలయంలో బ్రాహ్మణులంతా ఆయన్ను కలసి అమ్మవారికి మరో ఆలయం నిర్మించాలనుకున్నామని డబ్బు సహాయం చేయమని కోరారు. ఏటా వరదల నుంచి మిమ్మల్ని కాపాడని దేవుడికి ఆలయం ఎందుకన్న ఆ ఆంగ్లేయ కలెక్టర్..ఈ ఏడాది కట్టించిన కట్ట నిలబడతే ఆలయ నిర్మాణానికి ధనసహాయం చేస్తానన్నాడు. అలా ఆ ఏడాది భారీగా వానలు పడినప్పటికీ ఆ కట్ట తెగలేదట. ఆ దృశ్యం చూసిన కెలక్టర్ తన వాగ్ధానం ప్రకారం అమ్మవారికి ఆలయం నిర్మించాడని కథనం. 

ఈ ఆలయంలో శ్రీ రామనవమికి 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా జూన్, జూలైలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 

Also Read:  ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!

Also Read: దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే స్థలం, శివయ్య ధ్యానం చేసిన మహిమాన్విత ప్రదేశం 

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget