అన్వేషించండి

Ayodhya Ram Mandir Rules: అయోధ్య రామ మందిరం చూసేందుకు వెళ్తున్నారా? ఈ రూల్స్ తప్పక పాటించాలి

Ayodhya Ram Mandir: రామజన్మ భూమి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనే వారు తప్పక కొన్ని నియమాలు పాటించి తీరాలి. అవేమిటో చూడండి.

రాముడంటే మర్యాద పురుషోత్తముడు. రాజ ధర్మాన్ని, క్షత్రీయ ధర్మాన్ని, మానుష ధర్మాన్ని మానవ సమాజానికి ఆచరించి చూపిన ఆదర్శప్రాయడు. అందుకే, హిందువులు అంతగా ఆరాధిస్తారు. అయోధ్యలో రామ మందిరంలో ఆయన కొలువై ఉండగా చూడాలనేది ఎంతోమంది కల. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చేస్తోంది. అది కనులారా చూసేందుకు ఎంతో మంది భక్తులు అయోధ్యకు బయల్దేరుతున్నారు. మీరు కూడా అక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే, ముందుగా ఈ నియమ నిబంధనలు గురించి తెలుసుకోంటే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీరామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చు.

అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం అయోధ్యలో జనవరి 22, 2024 న ప్రారంభించబోతున్నారు. రామభక్తులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భం. అయోధ్యలో అణువణువున శ్రీరాముడుంటాడని నమ్మకం. అందుకే అయోధ్య ఎప్పుడూ చర్చలో ఉంటుంది. రాముడు పుట్టింది ఇక్కడే అయినప్పటికీ 500 సంవత్సరాలుగా రాముడికి ఇక్కడ చోటు దొరకలేదు. ఇన్నాళ్ల అజ్ఞాతం తర్వాత ఇప్పుడు తిరిగి రాముడు ఈ నేలమీద అడుగు పెడుతున్నాడు. అందుకే ఈ ఉత్సవం రామభక్తులకు అత్యంత ఉద్వేగ భరితం. ఆలయంలో జరిపే విగ్రహ ప్రాణప్రతిష్ట చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. దీన్ని చూసేందుకు భారీ సంఖ్యలో రామభక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి.

అయోధ్యలో భక్తులు పాటించాల్సిన రూల్స్ ఇవే:

జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.

  • ఆలయ ప్రాంగణంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అనుమతించరు. కనుక వాటిని తీసుకుపోవద్దు.
  • మొబైల్, ఎలక్ట్రానిక్ వాచి, ల్యాప్ ట్యాప్, కెమెరా వంటి వస్తువులేవీ తీసుకు వెళ్ల కూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.
  • తినుబండారాలు, పానీయాలు ఏవీ కూడా ఆలయ ప్రాంగణంలోకి అనుమతించరు.
  • ఇంటి వంటకాలైనా, ఫాస్ట్ ఫూడ్ అయినా సరే ఎటువంటి తినుబండారాలను, పానీయాలకు ఆలయంలోకి అనుమతి లేదు.
  • బూట్లూ, బెల్ట్ వంటి వస్తువులు ధరించి ఆలయంలోకి ప్రవేశం నిశిద్ధం. వీటిని ప్రవేశద్వారం వద్దే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది.
  • చాలా మందికి ఆలయానికి వెళ్లే సమయంలో హారతి పళ్లేం తీసుకువెళ్లే ఆచారం ఉంటుంది. కానీ జనవరి 22న జరిగే కార్యక్రమానికి మాత్రం హారతి పళ్లెం తీసువెళ్లకూడదు. ఎందుకంటే ఎలాంటి పూజకు మీకు అనుమతి ఉండదు. కనుక అది తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు.
  • ఆహ్వాన పత్రిక ఉన్నవారికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుంది. ఆహ్వాన పత్రిక లేకుండా ఆలయ ప్రవేశం చేసే అనుమతి లేదు. కనుక పత్రిక లేకుండా ఆలయంలో ప్రవేశించే ప్రయత్నం చెయ్యకపోవడమే మంచిది.
  • రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు తప్పకుండా సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. అలాంటి వారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. అయితే డ్రెస్ కోడ్ గురించి ప్రత్యేక నియమం లేదు. అయినప్పటికీ సంప్రదాయ దుస్తులు ధరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
  • అయోధ్య రామ మందిరాన్ని జనవరి 22న సందర్శించాలంటే చాలా కష్టం. వీఐపీల రాకపోకల వల్ల సామాన్యులకు దర్శన భాగ్యం అంత సులభం కాదు. కాబట్టి.. మరొక రోజును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

Also read : సిమెంట్, ఇనుము లేకుండా అయోధ్య రామాలయం నిర్మాణం - ఆ రాయికి అంత ప్రత్యేకత ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget