అన్వేషించండి

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

ఏపీ ధార్మిక పరిషత్‌ను ఏర్పా ఇక ఆలటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఆలయాల సంబంధిత కార్యక్రమాలన్నీ ధార్మిక పరిషత్ ద్వారానే నడుస్తాయి.


AP Dharmika Parishat :  ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఏటా రూ. 25 లక్షలకు పైబడి కోటి రూపాయలకు తక్కువ వార్షికాదాయం వచ్చే ఆలయాలకు ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో పాలక మండళ్ల నియామకం జరుగుతుంది. ఈ మేరకు ధార్మిక పరిషత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  దేవదాయ శాఖ పరిధిలో ఉండే అలయాలు, సత్రాల కార్యకలాపాలపై తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల్లో  పరిషత్‌ కీలకంగా వ్యవహరిస్తుంది.   వందేళ్లు దాటిన ఆలయాల పునర్నిర్మాణానికి ముందుగా పరిషత్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.  హిందూ ధార్మిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో ధార్మిక పరిషత్‌తో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి.   నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్‌ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అవసరమైతే ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభఉత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇప్పటి వరకూ ఒక్క సారే ధార్మిక పరిషత్ ఏర్పాటు 
 
ఉమ్మడి ఏపీలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటి సారిగా ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేశారు.  అప్పుడు ఏర్పడిన పరిషత్‌ పదవీకాలం 2012లో ముగిసింది.  2014లో మరోసారి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అది బాధ్యతలు చేపట్టక ముందే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పరిషత్‌ ఏర్పాటుకు ముందే రద్దయింది.  తిరిగి పదేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పరిషత్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుంది. 

దేవాదాయ శాఖ కీలక వ్యవహారాలన్నీ ధార్మిక పరిషత్ ద్వారానే 
 
ధార్మిక పరిషత్‌లో దేవదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవో తో పాటు మరో పదిహేడు మంది ఉంటారు. దేవదాయ శాఖ పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో ధార్మిక పరిషత్‌ కు విశేషమైన అధికారాలు ఉంటాయి. శాఖ పరిధిలోని రూ.25 లక్షల నుంచి రూ. కోటి లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలు, అన్ని రకాల మఠాల పాలన, ధార్మిక వ్యవహారాలు పూర్తి పరిషత్‌ ఆధీనంలో కొనసాగాలి. రాష్ట్రంలో చిన్నా పెద్దవి కలిపి మొత్తం 128 మఠాలు ఉన్నాయి. మంత్రాలయం, హథీరాంజీ మఠం వంటివి ఈ కేటగిరిలోకే వస్తాయి. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయడం లేదని కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అవి విచారణలో ఉన్న సమయంలో ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 

గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్న దేవాదాయ మంత్రి 

సీఎం  ఆదేశాలతో  ధార్మిక  పరిషత్ ఏర్పాటు  జరిగిందని దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు.  మూడేళ్లకు  ఒక సారి  ధార్మిక  పరిషత్   ఏర్పాటు  జరగాల్సి ఉందన్నారు. కానీ   టీడీపీ  ప్రభుత్వం ఏర్పాటు  చేయలేకపోయింది...దీనికి వాళ్ళే  సమాధానం  చెప్పాలన్నారు.  ప్రస్తుతం  ఏర్పాటు  చేస్తున్న  ధార్మిక  పరిషత్  లో  21 మంది  సభ్యులు ఉంటారు ..25 లక్షల  నుంచి  కోటి  రూపాయల  ట్రస్ట్  బోర్డ్  లన్ని    ధార్మిక  పరిషత్   నుంచే  ఏర్పాటు చెయ్యాల్సి ఉందన్నారు.  మఠాధిపతులు  పై  ఏదైనా  చర్యలు  తీస్కొవాలి   అంటే  ధార్మిక  పరిషథ్  కు అధికారాలు ఉంటాయన్నారు.  లీజ్  కు సంబంధించి  ఏదైనా  చర్యల ను  తీసుకోవాలి  అంటే  ధార్మిక  పరిషత్తు  తోనే  సాధ్యమని మంత్రి తెలిపారు.  
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ugadi Panchangam 2026: పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
పరాభవ నామ సంవత్సరం సింహ రాశి ఉగాది ఫలితాలు! ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎలా ఉండబోతోంది?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
ఈ రోజు మధ్యాహ్నం 12 లోగా భోజనం ముగించేయాలా? చంద్రగ్రహణం పట్టుస్నానం, విడుపు స్నానం ఎప్పుడు చేయాలి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: బ్లడ్ మూన్ వినాశనానికి సంకేతమా? రానున్న 41 రోజుల్లో ఇరాన్ 100ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందా?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: బ్లడ్ మూన్ వినాశనానికి సంకేతమా? రానున్న 41 రోజుల్లో ఇరాన్ 100ఏళ్లు వెనక్కు వెళ్లిపోతుందా?
March 2026 Monthly Horoscope: మేషం నుంచి మీనం వరకు.. 2026 మార్చిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి!
మేషం నుంచి మీనం వరకు.. 2026 మార్చిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget