అన్వేషించండి

Ganesh Immersion 2024: గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు..చేయకపోతే ఏమవుతుంది!

Ganesh Visarjan 2024: ఈ ఏడాది గణేష్ నిమజ్జనం సెప్టెంబరు 17 మంగళవారం. వినాయక విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేయాలి? చేయకపోతే ఏమవుతుంది?

Ganesh Immersion 2024:  రుతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో ఒకటి వినాయకచవితి. ఏటా భాద్రపద చదివి నుంచి నవరాత్రులు పూజలందుకునే గణపయ్య ఆ తర్వాత నిమజ్జనానికి తరలివెళతాడు..ఇంతకీ నిమజ్జనం ఎందుకు చేయాలి?
 
గణనాథుడి నక్షత్రం హస్త...ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. సాధారణంగా బుధుడికి ఆకుపచ్చనివి అంటే ప్రీతికరం. అందుకే విఘ్నేశ్వరుడికి గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఏక వింశతి పత్రాలు, గరికతో పూజ చేస్తారు. ఇక పూజకు వినియోగించే విగ్రహం ఒండ్రు మట్టితో తయారు చేసి ఉంటుంది. వినాయక విగ్రహాలు తయారుచేసేందుకు అవసరం అయిన ఒండ్రుమట్టి కోసం జలాశయాలలో దిగి పూడిక తీస్తారు. ఈ సందర్భంగా వానలు కురిసేసమయంలో చెవువుల్లో మరింత నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఆ మట్టిని తీసేందుకు జలాశయాల్లో దిగడం.. పూడిక తీయడం, ఆ ఒండ్రు మట్టిలో నానడం వల్ల ఆరోగ్యానికి చాలామంచిది అంటారు ఆరోగ్య నిపుణులు. ఇక వాడవాడలా పూజలందుకునే వినాయకుడు అనంతరం  నిమజ్జనానికి తరలివెళతాడు. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
 
కాలుష్య నివారణకోసమే నిమజ్జనం

వినాయక పూజలో 21 రకాల పత్రి వినియోగిస్తారు. ఇలా 9 రోజులు చేయమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పూజకోసం ఎంచుకునే ప్రతిలు అన్నీ మామూలివి కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులే. అందుకే వ్రతకల్పంలో పొందుపరిచిన పత్రాలతోనే పూజించాలి. ఆయా పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో వైరల్ , బ్యాక్టీరియాలు నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఆ తర్వాత ఈ పత్రిలు నీటిలో వేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఫలితంగా నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. 
 
నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!

సాధారణంగా వినాయకచవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించిన తర్వాత ... ఎవరికి వీలైనన్ని రోజులు పూజలందించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. కొందరైతే విగ్రహాలకు ఉద్వాసన చెప్పేసి పక్కనపెట్టేస్తారు. ఇలా ఉంచేస్తే ఏమీ జరిగిపోదు కానీ ఆ విగ్రహాల పరిమాణాన్ని బట్టి పూజ, నైవేద్యం పాటించాలి. అందుకే నిమజ్జనం చేయాలని చెబుతారు. 
 
నిమజ్జనం చేసేందుకు సరైన ప్రదేశం, చెరువు, కొలనులు లేకపోతే ఏం చేయాలి అనే సందేహం రావొచ్చు. సాధారణంగా ప్రవహించే నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు..ఆ అవకాశం లేకపోయినప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. 

  • పూజకోసం చిన్న విగ్రహాలను వినియోగించడం ద్వారా కరవు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ సులభం అవుతుంది
  • ఉద్వాసన చెప్పేసిన తర్వాత చెరువులు, నదులకే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు..ఇంటి బయట తులసిమొక్క దగ్గర ఓ పాత్రలో నీటిని నింపి అందులో గణేషుడు మునిగేలా దించేయండి...
  • మట్టి మొత్తం కరిగిపోయేవరకూ అలాగే ఉంచేసి ఆ నీటిని చెట్లకు పోయవచ్చు..లేదంటే ..అదే మట్టిలో ఏదైనా మొక్కను నాటొచ్చు..

ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మిక విషయాలతో పాటూ ప్రకృతి పరమైన విశేషాలు కూడా ఉంటాయి. పైగా మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన గణపయ్యతోపాటూ ఇరుగుపొరుగు వారంతా కలసి సందడిగా తరలివెళతారు. అందరితో ఆడిపాడుతూ బంధాలను పెంచుకునే వేదిక ఇది. అయితే ఈ వేడుకలో హోరు శ్రుతిమించడం, హోదా చూపడం కోసం రంగురంగులి విగ్రహాలను నీటిలో కలపడం చేయకూడదు. గణేష్ పూజ వెనుకున్న ఆంతర్యం కేవలం ప్రకృతి ఆరాధన, ప్రకృతి పరిరక్షణే...

Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?SRH vs PBKS Match Preview IPL 2025 | పరాజయాల పరంపరలో పంజాబ్ పై సన్ రైజర్స్ పంజా విసురుతుందా..?Rohit Sharma Panic Delhi Thunderstorm | ముంబై మ్యాచ్ ప్రాక్టీస్ లో సుడిగాలి బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్  పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదమే - అధికారికంగా ప్రకటించిన పోలీసులు
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నిలిచిన చిత్తూరు
ఇంటర్ ఫలితాల్లో దుమ్మురేపిన కృష్ణా, చివరి స్థానంలో చిత్తూరు- జిల్లాలవారీగా పాస్ శాతాలు, పూర్తి వివరాలు
TTD News:  చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన  భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
చెప్పులతో ఆలయంలోకి వెళ్లబోయిన భక్తులు - టీటీడీలో మరో వివాదం - తనిఖీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందా ?
Tamil Nadu: గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
గవర్నర్‌తో పని లేకుండా చట్టాల నోటిఫై - దేశంలో తొలి సారి తమిళనాడు రికార్డు
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
పవన్ కల్యాణ్ కుమారుడ్ని కాపాడిన వారికి సింగపూర్ ప్రభుత్వ అవార్డులు - ఆ నలుగురు భారతీయులే!
MLC Vijayashanti: ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
AP Inter Supply Exam Date 2025: ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన
ఏపీలో ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌పై మంత్రి లోకేష్ ప్రకటన
Vanajeevi Ramaiah: గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
గొప్ప ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయాం, ఆయన ఎందరికో ఆదర్శం - వనజీవి రామయ్య మృతిపై రేవంత్, చంద్రబాబు సంతాపం
Embed widget