అన్వేషించండి

Ganesh Immersion 2024: గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు..చేయకపోతే ఏమవుతుంది!

Ganesh Visarjan 2024: ఈ ఏడాది గణేష్ నిమజ్జనం సెప్టెంబరు 17 మంగళవారం. వినాయక విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేయాలి? చేయకపోతే ఏమవుతుంది?

Ganesh Immersion 2024:  రుతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో ఒకటి వినాయకచవితి. ఏటా భాద్రపద చదివి నుంచి నవరాత్రులు పూజలందుకునే గణపయ్య ఆ తర్వాత నిమజ్జనానికి తరలివెళతాడు..ఇంతకీ నిమజ్జనం ఎందుకు చేయాలి?
 
గణనాథుడి నక్షత్రం హస్త...ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. సాధారణంగా బుధుడికి ఆకుపచ్చనివి అంటే ప్రీతికరం. అందుకే విఘ్నేశ్వరుడికి గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఏక వింశతి పత్రాలు, గరికతో పూజ చేస్తారు. ఇక పూజకు వినియోగించే విగ్రహం ఒండ్రు మట్టితో తయారు చేసి ఉంటుంది. వినాయక విగ్రహాలు తయారుచేసేందుకు అవసరం అయిన ఒండ్రుమట్టి కోసం జలాశయాలలో దిగి పూడిక తీస్తారు. ఈ సందర్భంగా వానలు కురిసేసమయంలో చెవువుల్లో మరింత నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఆ మట్టిని తీసేందుకు జలాశయాల్లో దిగడం.. పూడిక తీయడం, ఆ ఒండ్రు మట్టిలో నానడం వల్ల ఆరోగ్యానికి చాలామంచిది అంటారు ఆరోగ్య నిపుణులు. ఇక వాడవాడలా పూజలందుకునే వినాయకుడు అనంతరం  నిమజ్జనానికి తరలివెళతాడు. 

Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
 
కాలుష్య నివారణకోసమే నిమజ్జనం

వినాయక పూజలో 21 రకాల పత్రి వినియోగిస్తారు. ఇలా 9 రోజులు చేయమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పూజకోసం ఎంచుకునే ప్రతిలు అన్నీ మామూలివి కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులే. అందుకే వ్రతకల్పంలో పొందుపరిచిన పత్రాలతోనే పూజించాలి. ఆయా పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో వైరల్ , బ్యాక్టీరియాలు నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఆ తర్వాత ఈ పత్రిలు నీటిలో వేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఫలితంగా నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. 
 
నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!

సాధారణంగా వినాయకచవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించిన తర్వాత ... ఎవరికి వీలైనన్ని రోజులు పూజలందించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. కొందరైతే విగ్రహాలకు ఉద్వాసన చెప్పేసి పక్కనపెట్టేస్తారు. ఇలా ఉంచేస్తే ఏమీ జరిగిపోదు కానీ ఆ విగ్రహాల పరిమాణాన్ని బట్టి పూజ, నైవేద్యం పాటించాలి. అందుకే నిమజ్జనం చేయాలని చెబుతారు. 
 
నిమజ్జనం చేసేందుకు సరైన ప్రదేశం, చెరువు, కొలనులు లేకపోతే ఏం చేయాలి అనే సందేహం రావొచ్చు. సాధారణంగా ప్రవహించే నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు..ఆ అవకాశం లేకపోయినప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. 

  • పూజకోసం చిన్న విగ్రహాలను వినియోగించడం ద్వారా కరవు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ సులభం అవుతుంది
  • ఉద్వాసన చెప్పేసిన తర్వాత చెరువులు, నదులకే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు..ఇంటి బయట తులసిమొక్క దగ్గర ఓ పాత్రలో నీటిని నింపి అందులో గణేషుడు మునిగేలా దించేయండి...
  • మట్టి మొత్తం కరిగిపోయేవరకూ అలాగే ఉంచేసి ఆ నీటిని చెట్లకు పోయవచ్చు..లేదంటే ..అదే మట్టిలో ఏదైనా మొక్కను నాటొచ్చు..

ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మిక విషయాలతో పాటూ ప్రకృతి పరమైన విశేషాలు కూడా ఉంటాయి. పైగా మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన గణపయ్యతోపాటూ ఇరుగుపొరుగు వారంతా కలసి సందడిగా తరలివెళతారు. అందరితో ఆడిపాడుతూ బంధాలను పెంచుకునే వేదిక ఇది. అయితే ఈ వేడుకలో హోరు శ్రుతిమించడం, హోదా చూపడం కోసం రంగురంగులి విగ్రహాలను నీటిలో కలపడం చేయకూడదు. గణేష్ పూజ వెనుకున్న ఆంతర్యం కేవలం ప్రకృతి ఆరాధన, ప్రకృతి పరిరక్షణే...

Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోన‌సీమ జిల్లా రామ‌చంద్ర‌పురంలో విషాదం
Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
Census India 2027: జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
జనగణన సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష విధిస్తారా, రూల్స్ ఏంటి?
Embed widget